హైదరాబాద్ లో జరిగిన ఓజి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానులు ఎదురు చూసింది రెండింటి కోసం. ఒకటి పవన్ కళ్యాణ్ స్పీచ్. రెండోది ట్రైలర్. మూడోది అనుకుంటే వేడుకకు పేరు పెట్టిన తమన్ మ్యూజికల్ కన్సర్ట్. అయితే వర్షం పెద్ద అడ్డంకిగా నిలవడంతో సంబరం పూర్తి స్థాయిలో జరగలేదు. సాయంత్రం నుంచే మబ్బులు ముసురుకోవడంతో చినుకులు ఉంటాయనే సమాచారం ఉన్నప్పటికీ అది పెద్ద హోరుగా మారదనే నమ్మకంతో ఉన్న నిర్వాహకులకు రైన్ పెద్ద షాక్ ఇచ్చింది. చాలా హుషారుగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ సైతం తన ప్రసంగాన్ని కుదించుకోవాల్సి రావడం తీవ్ర నిరాశకు గురి చేసింది.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఇంకా తుది మెరుగులు దిద్దుకునే పనిలోనే ఉండటంతో సకాలంలో స్టేజి మీద ప్లే చేయలేకపోయారు. దర్శకుడు సుజిత్ ఇంకా డిఐ వర్క్ ఉందని పవన్ తో చెప్పినా, డిప్యూటీ సిఎం ఏం పర్లేదు మా వాళ్ళు చూసుకుంటారు, ముందు ప్లే చేయమని చెప్పడంతో రఫ్ కట్ వెర్షనే తెరమీద ప్రదర్శించాడు. వీడియో మీద ఫర్ నిఖిల్ అని వాటర్ మార్క్ ఉందంటే అది టీమ్ సభ్యులకు పని కోసం ఇచ్చిన కాపీ అని అర్థమైపోయింది. అయినా సరే విజువల్స్ లైవ్ లో చూసిన అభిమానులు వెర్రెక్కిపోయారు. తాము కోరుకున్నది కనిపించడంతో వాళ్ళ ఆనందం అంతా ఇంతా కాదు.
అయితే కోట్లాది అభిమానులు ఆన్ లైన్ రిలీజ్ కోసం ఎదురు చూస్తే వాళ్ళు మాత్రం డిస్సప్పోయింట్ అయ్యారు. టెక్నికల్ గా ఎన్ని సమస్యలు ఉన్నా వాటిని ఈవెంట్ కు నాలుగైదు గంటల ముందే సరి చూసుకోవాలి. కానీ చివరి నిమిషం దాకా పని చేస్తూ ఒత్తిడి తెచ్చుకోవడం వల్ల నిర్మాణ సంస్థతో పాటు హీరో దర్శకుడు కూడా మాటలు పడాల్సి వస్తుంది. విడుదల తేదీ రెండు నెలల క్రితమే ఖరారు చేసుకుని షూటింగ్ కూడా టైంకి పూర్తి చేశాక ఇప్పుడీ ఆలస్యం ఎందుకనేది వేయి డాలర్ల ప్రశ్న. తమన్ అయితే ఈ రాత్రే ట్రైలర్ వచ్చేస్తుందని అంటున్నాడు. కల్ట్ ఫ్యాన్స్ అప్పటిదాకా జాగారం చేయాల్సిందే.
This post was last modified on September 21, 2025 10:28 pm
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…
దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…