తేజ సజ్జ.. ఇప్పుడు పాన్ ఇండియా మార్మోగిపోతున్న పేరు. గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’ సినిమాతో భారీ పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నాడతను. ఆ తర్వాత పెద్ద పెద్ద అవకాశాలు వచ్చినా ఒప్పుకోకుండా.. అప్పటికే మేకింగ్ దశలో ఉన్న ‘మిరాయ్’ మీద దృష్టిపెట్టాడు. అందుకు ఇప్పుడు మంచి ఫలితమే దక్కింది. ‘మిరాయ్’ సైతం బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపుతోంది. వంద కోట్ల వసూళ్ల మార్కును దాటి దూసుకెళ్తోంది.
ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ చిత్రంతో మిడ్ రేంజ్ హీరోల్లో టాప్కు వెళ్లిపోయేలా ఉన్నాడు తేజ. అతను ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలోనూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలనే మీమాంస లేకుండా.. తాను చేసిన మూడు సక్సెస్ ఫుల్ చిత్రాల సీక్వెల్స్తోనే అతను రాబోతున్నాడు.
తేజ హీరోగా నటించిన తొలి చిత్రం.. జాంబిరెడ్డి. అప్పటికి తనకు ఎలాంటి ఇమేజ్ లేదు. సినిమా కూడా ఓ మోస్తరుగా ఉంటుంది. అందుకు తగ్గట్లే బాక్సాఫీస్ దగ్గర ఓ మాదిరి విజయాన్నందుకుంది. తర్వాత ‘హనుమాన్’, ‘మిరాయ్’ సినిమాలు ఘనవిజయాన్నందుకున్నాయి. ఈ మూడు చిత్రాలకూ సీక్వెల్స్ రాబోతున్నాయి. ‘జాంబి రెడ్డి’ సీక్వెల్ను ఇటీవలే అనౌన్స్ చేశారు. ‘మిరాయ్’ తీసిన పీపుల్ మీడియా సంస్థే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతోంది. ప్రశాంత్ వర్మ ఈసారి కథకుడి పాత్రకే పరిమితం అవుతున్నాడు. దర్శకుడెవర్నది ఇంకా సస్పెన్సుగానే ఉంది. ‘హనుమాన్’కు సీక్వెల్ ప్రకటించి చాలా కాలమైంది. కానీ సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరుగుతోంది. ఈసారి రిషబ్ శెట్టి లీడ్ రోల్లో కనిపిస్తాడు. కానీ అందులో తేజ కూడా ఉంటాడు.
ఇంకోవైపు ‘మిరాయ్’ సినిమాకు సీక్వెల్ ఉంటుందని సినిమాలో హింట్ ఇచ్చారు. ముందు నుంచే ఈ దిశగా ప్లానింగ్ ఉన్నప్పటికీ.. ‘మిరాయ్’ ఫలితాన్ని బట్టే ముందుకు వెళ్లాలనుకున్నారు. కార్తీక్ ఘట్టమనేని చివరి చిత్రం ‘ఈగల్’ ఫ్లాప్ కావడంతో ‘మిరాయ్’ సీక్వెల్ గురించి ముందే ప్రకటించి ఇబ్బంది పడడం ఎందుకు అనుకున్నారు. ఈ సినిమా సక్సెస్ అయింది కాబట్టి ‘జైత్రయ’ పేరుతో సీక్వెల్ చేయడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. హీరో, దర్శకుడు, నిర్మాత.. ముగ్గురూ రెడీ. ‘జైత్రయ’లో రానా దగ్గుబాటి విలన్ పాత్ర చేయబోతున్నాడు. ఈ మూడు సీక్వెల్స్తో తేజ.. మూణ్నాలుగేళ్లు బిజీగా ఉండబోతున్నాడు. కాబట్టి కొత్తగా వేరే సినిమాలేవీ అనౌన్స్ అయ్యే అవకాశాలు లేవు.
This post was last modified on September 19, 2025 9:07 pm
మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…
పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…
మెగా కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఉండే అనుబంధం గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కల్యాణ్…
వందే భారత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులకు అందించే భోజనం నాణ్యతపై మరోసారి పెద్ద వివాదం రాజుకుంది. పాట్నా నుంచి టాటానగర్ వెళ్లే…
వరసగా సినిమాలు చేస్తున్నా సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష పండులా మారిపోయిన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి సరైన బ్రేక్…
రేపు ప్రారంభం కావాల్సిన పెద్ది ఓవర్ సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ ఏప్రిల్ 8కి వాయిదా వేయడం అభిమానుల్లో ఖంగారు పుట్టిస్తోంది.…