సినీ పరిశ్రమలో అవకాశం దొరకడం ఒకెత్తు. దాన్ని సద్వినియోగం చేసుకోవడం మరో ఎత్తు. తొలి అవకాశం కోసం పడే కష్టాలు మామూలుగా ఉండవు. కానీ ఆ ఛాన్స్ను సరిగ్గా ఉపయోగించుకుని టాలెంట్ చూపిస్తే రాత్రికి రాత్రి జీవితాలు మారిపోతాయి. తర్వాత కూడా జాగ్రత్తగా అడుగులు వేస్తే.. ఇండస్ట్రీనే వారి వెనుక తిరుగుతుంది. ఇందుకు తాజా ఉదాహరణ.. ఆదిత్య హాసన్.
‘నైంటీస్ మిడిల్ క్లాస్’ అనే లో బడ్జెట్ వెబ్ సిరీస్తో ఇతను దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అందులో పేరున్న కాస్టింగ్ లేదు. చాలా పరిమిత వనరులతో ఆ సిరీస్ను పూర్తి చేశాడు. కానీ అందులో ప్రొడక్షన్ వాల్యూస్ను కాకుండా కంటెంట్ను మాత్రమే జనం చూశారు. తెలుగు ఒరిజినల్స్లో అదొక సంచలనంగా నిలిచింది. తర్వాత అతను సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్లో ‘బేబి’ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలతో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు.
ఈలోపు ఆదిత్య హాసన్.. తన అభిరుచిని చాటుతూ ‘లిటిల్ హార్ట్స్’ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమా సెన్సేషనల్ బ్లాక్బస్టర్ అయింది. ఐతే ఈ సినిమా సక్సెస్ను ఇక్కడే ఉండి ఎంజాయ్ చేసే స్థితిలో ఆదిత్య లేడు. యూకేలో ఆనంద్-వైష్ణవి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. అతనక్కడ ఉండగానే, సినిమా పూర్తి కాకముందే.. ఇక్కడ డిజిటల్ డీల్ పూర్తయిపోయింది.
ఏకంగా రూ.11 కోట్లకు ఈ సినిమా డిజిటల్ హక్కులను ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ స్థాయి సినిమాకు ఇది చాలా పెద్ద రేటు. బహుశా సినిమా బడ్జెట్ అంతా ఇక్కడే కవరైపోతుండొచ్చు. దర్శకుడిగా నైంటీస్ సిరీస్, నిర్మాతగా లిటిల్ హార్ట్స్ తీసి ఆదిత్య తెచ్చుకున్న గుర్తింపే తన కొత్త చిత్రానికి ఇంత మంచి డీల్ తెచ్చి పెట్టిందనడంలో సందేహం లేదు. ఇంత త్వరగా ఇలాంటి బ్రాండ్ వాల్యూ సంపాదించడం చిన్న విషయం కాదు. దర్శకుడిగా తన తొలి సినిమా కూడా అంచనాలకు తగ్గట్లు ఉంటే.. అతను టాలీవుడ్లో మరో మారుతిలా పేరు తెచ్చుకుంటాడేమో.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…