ఒక ఫ్లాప్ సినిమాకు ఎవ్వరైనా సీక్వెల్ తీయాలని అనుకుంటారా? రెండు భాగాలుగా తీయాలనుకున్న సినిమాకు కొంత షూటింగ్ చేసి ఉంటే ఆలోచిస్తారేమో కానీ.. అలా కాని పక్షంలో అయితే మాత్రం సీక్వెల్ చర్చే ఉండదు. కానీ పీపుల్ మీడియా అధినేత టి.జి.విశ్వప్రసాద్ మాత్రం తన బేనర్లో వచ్చిన ఒక ఫ్లాప్ చిత్రానికి సీక్వెల్ చేయాలనుకుంటున్నారు. ఆ చిత్రమే.. ఈగల్. రవితేజ హీరోగా యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఈ చిత్రం గత ఏడాది ఫిబ్రవరిలో భారీ అంచనాల మధ్య రిలీజై నిరాశపరిచింది.
ప్రోమోలు చూసి ఏదో ఊహించుకున్న ప్రేక్షకులకు ఈ సినిమా పెద్ద షాకే ఇచ్చింది. వీకెండ్లో కూడా సరిగా నిలబడలేకపోయిన ఈ చిత్రం.. తర్వాత పూర్తిగా చల్లబడిపోయింది. ఐతే సినిమా సరిగా ఆడకపోయి ఉండొచ్చు కానీ.. కంటెంట్ పరంగా ఇది తీసి పడేసే సినిమా కాదని అంటున్నారు విశ్వప్రసాద్. ఈగల్-2 తీయడంపై సీరియస్గానే ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్తీక్ ఈ సినిమాను బాగానే తీసినా.. పొజిషనింగ్ సరిగా లేదని.. స్క్రీన్ ప్లేలో కొంచెం మార్పులు ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈగల్ క్లైమాక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని.. ఆ విషయంలో రెండో మాట లేదని ఆయనన్నారు. అందుకే సీక్వెల్ తీయడం గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పారు. థియేటర్లలో ఈ సినిమా ఉన్నంతలో బాగానే ఆడిందని.. అమ్మిన రేట్లతో పోలిస్తే నాలుగైదు కోట్ల నష్టమే వచ్చిందని ఆయన చెప్పారు. ఐతే ఒక మిస్ మేనేజ్మెంట్ వల్ల ‘ఈగల్’ సినిమాకు డిజిటల్ డీల్ ఓకే కాలేదని.. దాని వల్ల ఈ సినిమా ఓవరాల్గా పెద్ద నష్టం తెచ్చిపెట్టిందే తప్ప, ఓటీటీ అయి ఉంటే తమకు సినిమా సక్సెస్ ఫుల్ ప్రాజెక్టుగా నిలిచేదని ఆయనన్నారు.
This post was last modified on September 16, 2025 10:00 pm
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…
నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…