ఒక ఫ్లాప్ సినిమాకు ఎవ్వరైనా సీక్వెల్ తీయాలని అనుకుంటారా? రెండు భాగాలుగా తీయాలనుకున్న సినిమాకు కొంత షూటింగ్ చేసి ఉంటే ఆలోచిస్తారేమో కానీ.. అలా కాని పక్షంలో అయితే మాత్రం సీక్వెల్ చర్చే ఉండదు. కానీ పీపుల్ మీడియా అధినేత టి.జి.విశ్వప్రసాద్ మాత్రం తన బేనర్లో వచ్చిన ఒక ఫ్లాప్ చిత్రానికి సీక్వెల్ చేయాలనుకుంటున్నారు. ఆ చిత్రమే.. ఈగల్. రవితేజ హీరోగా యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఈ చిత్రం గత ఏడాది ఫిబ్రవరిలో భారీ అంచనాల మధ్య రిలీజై నిరాశపరిచింది.
ప్రోమోలు చూసి ఏదో ఊహించుకున్న ప్రేక్షకులకు ఈ సినిమా పెద్ద షాకే ఇచ్చింది. వీకెండ్లో కూడా సరిగా నిలబడలేకపోయిన ఈ చిత్రం.. తర్వాత పూర్తిగా చల్లబడిపోయింది. ఐతే సినిమా సరిగా ఆడకపోయి ఉండొచ్చు కానీ.. కంటెంట్ పరంగా ఇది తీసి పడేసే సినిమా కాదని అంటున్నారు విశ్వప్రసాద్. ఈగల్-2 తీయడంపై సీరియస్గానే ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్తీక్ ఈ సినిమాను బాగానే తీసినా.. పొజిషనింగ్ సరిగా లేదని.. స్క్రీన్ ప్లేలో కొంచెం మార్పులు ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈగల్ క్లైమాక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని.. ఆ విషయంలో రెండో మాట లేదని ఆయనన్నారు. అందుకే సీక్వెల్ తీయడం గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పారు. థియేటర్లలో ఈ సినిమా ఉన్నంతలో బాగానే ఆడిందని.. అమ్మిన రేట్లతో పోలిస్తే నాలుగైదు కోట్ల నష్టమే వచ్చిందని ఆయన చెప్పారు. ఐతే ఒక మిస్ మేనేజ్మెంట్ వల్ల ‘ఈగల్’ సినిమాకు డిజిటల్ డీల్ ఓకే కాలేదని.. దాని వల్ల ఈ సినిమా ఓవరాల్గా పెద్ద నష్టం తెచ్చిపెట్టిందే తప్ప, ఓటీటీ అయి ఉంటే తమకు సినిమా సక్సెస్ ఫుల్ ప్రాజెక్టుగా నిలిచేదని ఆయనన్నారు.
This post was last modified on September 16, 2025 10:00 pm
నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్లో, లవర్ బాయ్గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…