ఒక ఫ్లాప్ సినిమాకు ఎవ్వరైనా సీక్వెల్ తీయాలని అనుకుంటారా? రెండు భాగాలుగా తీయాలనుకున్న సినిమాకు కొంత షూటింగ్ చేసి ఉంటే ఆలోచిస్తారేమో కానీ.. అలా కాని పక్షంలో అయితే మాత్రం సీక్వెల్ చర్చే ఉండదు. కానీ పీపుల్ మీడియా అధినేత టి.జి.విశ్వప్రసాద్ మాత్రం తన బేనర్లో వచ్చిన ఒక ఫ్లాప్ చిత్రానికి సీక్వెల్ చేయాలనుకుంటున్నారు. ఆ చిత్రమే.. ఈగల్. రవితేజ హీరోగా యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని రూపొందించిన ఈ చిత్రం గత ఏడాది ఫిబ్రవరిలో భారీ అంచనాల మధ్య రిలీజై నిరాశపరిచింది.
ప్రోమోలు చూసి ఏదో ఊహించుకున్న ప్రేక్షకులకు ఈ సినిమా పెద్ద షాకే ఇచ్చింది. వీకెండ్లో కూడా సరిగా నిలబడలేకపోయిన ఈ చిత్రం.. తర్వాత పూర్తిగా చల్లబడిపోయింది. ఐతే సినిమా సరిగా ఆడకపోయి ఉండొచ్చు కానీ.. కంటెంట్ పరంగా ఇది తీసి పడేసే సినిమా కాదని అంటున్నారు విశ్వప్రసాద్. ఈగల్-2 తీయడంపై సీరియస్గానే ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. కార్తీక్ ఈ సినిమాను బాగానే తీసినా.. పొజిషనింగ్ సరిగా లేదని.. స్క్రీన్ ప్లేలో కొంచెం మార్పులు ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈగల్ క్లైమాక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని.. ఆ విషయంలో రెండో మాట లేదని ఆయనన్నారు. అందుకే సీక్వెల్ తీయడం గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పారు. థియేటర్లలో ఈ సినిమా ఉన్నంతలో బాగానే ఆడిందని.. అమ్మిన రేట్లతో పోలిస్తే నాలుగైదు కోట్ల నష్టమే వచ్చిందని ఆయన చెప్పారు. ఐతే ఒక మిస్ మేనేజ్మెంట్ వల్ల ‘ఈగల్’ సినిమాకు డిజిటల్ డీల్ ఓకే కాలేదని.. దాని వల్ల ఈ సినిమా ఓవరాల్గా పెద్ద నష్టం తెచ్చిపెట్టిందే తప్ప, ఓటీటీ అయి ఉంటే తమకు సినిమా సక్సెస్ ఫుల్ ప్రాజెక్టుగా నిలిచేదని ఆయనన్నారు.
This post was last modified on September 16, 2025 10:00 pm
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…