టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్బస్టర్ ‘మిరాయ్’ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంశాల్లో రెబల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఒకటి అనడంలో సందేహం లేదు. మన పురాణాలు, ఇతిహాసాల గొప్పదనాన్ని చెబుతూ.. కథా నేపథ్యాన్ని వివరించిన తీరు ప్రభాస్ అభిమానులనే కాక సామాన్య ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ప్రభాస్ తన సినిమాలకు చెప్పే డబ్బింగ్ కంటే ఇది బాగుందని.. వాయిస్లో ఏదో విశేషం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
మామూలుగా కొంచెం పట్టి పట్టి, నెమ్మదిగా డైలాగ్ చెబుతాడు ప్రభాస్. కానీ ఇందులో మాత్రం డైలాగుల్లో స్పీడ్ ఉంది. దీంతో ఇది ప్రభాస్ ఒరిజినల్ వాయిసేనా అన్న సందేహాలు కలిగాయి. దీని వెనుక ఏఐ ఉందనే చర్చ కూడా జరిగింది. ప్రభాస్ అనుమతితో ఏఐ ద్వారా అతడి వాయిస్ను రీక్రియేట్ చేశారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది.
ఐతే ఈ ప్రచారాన్ని దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఖండించాడు. ప్రభాస్ సొంతంగానే ‘మిరాయ్’ కోసం డబ్బింగ్ చెప్పాడని.. అందులో వినిపించిన ప్రతి మాటా ప్రభాస్ గొంతు నుంచి వచ్చిందే అని కార్తీక్ స్పష్టం చేశాడు. కాకపోతే టెక్నాలజీని ఉపయోగించి వాయిస్లో కొంచెం స్పీడు మాత్రం పెంచామని వెల్లడించాడు కార్తీక్. వాయిస్ ఓవర్ రన్ టైం తగ్గించడానికి ఈ పని చేసి ఉండొచ్చు.
దీంతో ప్రభాస్ వాయిస్ ఓవర్ విషయంలో ఏఐ ఊహాగానాలకు తెరపడిపోయింది. ఏదేమైనప్పటికీ.. ప్రభాస్ సొంత చిత్రాల కంటే ఇందులో తన డైలాగ్ డెలివరీ బాగుందనే ఫీడ్ బ్యాక్ మాత్రం జనాల నుంచి వచ్చింది. ప్రభాస్ ఎంత పెద్ద స్టార్గా ఎదిగినా.. తన డైలాగ్ డెలివరీ విషయంలో విమర్శలు మాత్రం ఆగట్లేదు. కొంచెం స్పీడు పెంచితే తన వాయిస్ ఇంత బెటర్ అవుతుందా అని ఇప్పుడు ప్రేక్షకులు చర్చించుకుంటారనడంలో సందేహం లేదు.
సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…