చెప్పుకోతగ్గ చాలా సినిమాలు సంక్రాంతి రిలీజ్కి క్యూ కడుతోంటే సాయి ధరమ్ తేజ్ మాత్రం అంతవరకు ఆగకుండా డిసెంబరులోనే రిస్క్ చేస్తున్నాడు. గత ఏడాది డిసెంబరులో ప్రతిరోజూ పండగే లాంటి హిట్టొచ్చింది కాబట్టి ఈసారి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. ఇన్ని నెలల తర్వాత థియేటర్లలో విడుదలయ్యే సినిమా కనుక కరోనా భయం లేని వారంతా థియేటర్లకు వచ్చేస్తారనే నమ్మకంతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఒకవేళ ఈ చిత్రానికి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో రాకపోయినా కానీ నష్టం లేదు. ఎందుకంటే ఈ చిత్రం సర్వ హక్కులను జీ సంస్థ ముందే కొనేసింది.
ఓటిటిలో విడుదల చేసే ముందు ప్రయోగాత్మకంగా థియేటర్లలో విడుదల చేస్తోంది. థియేటర్లలో విడుదల చేసిన రెండు, మూడు వారాలకే ఓటిటి రిలీజ్ కూడా వుంటుంది. అయితే మిగతా అందరిలా సంక్రాంతి వరకు వేచి చూడవచ్చు కానీ అసలే సగం టికెట్లు అమ్మాల్సిన టైమ్లో అన్ని సినిమాలతో పోటీ పడడం కంటే ఇప్పుడు అందుబాటులో వున్న అన్ని థియేటర్లలో విడుదల చేసుకుంటే మంచిదని ఇలా రిస్క్ చేస్తున్నారు. ఒకవేళ ఈ చిత్రానికి ప్రేక్షకులు బాగానే వచ్చారనిపిస్తే మరికొన్ని సినిమాలను జనవరి 1కి విడుదల చేసే అవకాశాలున్నాయని టాలీవుడ్లో అంటున్నారు.
This post was last modified on November 24, 2020 8:01 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…