మిరాయ్ దూకుడు మాములుగా లేదు. వీకెండ్ ని యునానిమస్ గా డామినేట్ చేస్తోంది. ఏపీ తెలంగాణలో ఎక్స్ ట్రా షోలు, థియేటర్లతో టికెట్ల డిమాండ్ ని తట్టుకోవడానికి ఎగ్జిబిటర్లు చేస్తున్న ప్లానింగ్ తో ఆదివారం చాలా బిజీగా ఉంది. నిర్మాణ సంస్థ అధికారికంగా రెండు రోజుల వసూళ్లను 55 కోట్ల 60 లక్షలుగా ప్రకటించింది. హనుమాన్ ని దాటేయడానికి పరుగులు పెడుతున్న తేజ సజ్జ సోలో హీరోగా మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. మల్టీప్లెక్సులు, ప్రీమియం సింగల్ స్క్రీన్లలో మిరాయ్ టికెట్ ముక్క దొరికితే ఒట్టు అనేలా పరిస్థితి మారిపోయింది. వీకెండ్ సెకండ్ షోల దాకా అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
వీటిని కేవలం వసూళ్లగానే కాకుండా పాఠాలుగా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టికెట్ రేట్లు పెంచుకుంటే తప్ప గట్టెక్కలేమనే భ్రమలో ఉన్న టయర్ 2 నిర్మాతలకు ఇదో చెంపపెట్టు లెసన్ గా నిలుస్తోంది. అవకాశం పలుకుబడి ఉన్నా సరే టికెట్ హైక్స్ తీసుకోకుండా రెగ్యులర్ ధరలకే కట్టుబడి ఉండటం ఫ్యామిలీ ఆడియన్స్ ని అధిక శాతం వచ్చేలా చేస్తోంది. నిజంగానే మిరాయ్ కు పెంపు అడిగి ఉంటే వెంటనే వచ్చేసేది. ఇప్పుడున్న టాక్ కి జనాలు చూసేవాళ్ళు. కానీ వీకెండ్ కాగానే వెంటనే డ్రాప్ తీవ్రంగా ఉండే ప్రమాదం పొంచి ఉండేది. దాన్ని మిరాయ్ దిగ్విజయంగా తప్పించుకోవడం రేపటి నుంచి చూడొచ్చు.
కంటెంట్ మీద నమ్మకం ఉన్నప్పుడు, అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చినప్పుడు ఎలాంటి పెంపులు, సవరణలు అక్కర్లేదని మిరాయ్ నిరూపించేసింది. మిగిలిన నిర్మాతలు దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. విజువల్ ఎఫెక్ట్స్ లేని చిన్న బడ్జెట్ సినిమాలు లిటిల్ హార్ట్స్ రూపంలో అద్భుతాలు చేసి చూపించాయి. విఎఫ్ఎక్స్ మీద ఆధారపడిన మిరాయ్ లాంటివి మాములు టికెట్ రేట్లతో ఈ ఏడాది టాప్ గ్రాసర్స్ ని టార్గెట్ చేసుకున్నాయి. అలాంటప్పుడు ఇకపై ఈ విషయంలో ప్రొడ్యూసర్లు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. జిఓలు వచ్చినంత సులభంగా కలెక్షన్లు రావని గుర్తు పెట్టుకుంటే చాలు.
This post was last modified on September 14, 2025 12:31 pm
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…