మిరాయ్ దూకుడు మాములుగా లేదు. వీకెండ్ ని యునానిమస్ గా డామినేట్ చేస్తోంది. ఏపీ తెలంగాణలో ఎక్స్ ట్రా షోలు, థియేటర్లతో టికెట్ల డిమాండ్ ని తట్టుకోవడానికి ఎగ్జిబిటర్లు చేస్తున్న ప్లానింగ్ తో ఆదివారం చాలా బిజీగా ఉంది. నిర్మాణ సంస్థ అధికారికంగా రెండు రోజుల వసూళ్లను 55 కోట్ల 60 లక్షలుగా ప్రకటించింది. హనుమాన్ ని దాటేయడానికి పరుగులు పెడుతున్న తేజ సజ్జ సోలో హీరోగా మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. మల్టీప్లెక్సులు, ప్రీమియం సింగల్ స్క్రీన్లలో మిరాయ్ టికెట్ ముక్క దొరికితే ఒట్టు అనేలా పరిస్థితి మారిపోయింది. వీకెండ్ సెకండ్ షోల దాకా అన్ని చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
వీటిని కేవలం వసూళ్లగానే కాకుండా పాఠాలుగా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టికెట్ రేట్లు పెంచుకుంటే తప్ప గట్టెక్కలేమనే భ్రమలో ఉన్న టయర్ 2 నిర్మాతలకు ఇదో చెంపపెట్టు లెసన్ గా నిలుస్తోంది. అవకాశం పలుకుబడి ఉన్నా సరే టికెట్ హైక్స్ తీసుకోకుండా రెగ్యులర్ ధరలకే కట్టుబడి ఉండటం ఫ్యామిలీ ఆడియన్స్ ని అధిక శాతం వచ్చేలా చేస్తోంది. నిజంగానే మిరాయ్ కు పెంపు అడిగి ఉంటే వెంటనే వచ్చేసేది. ఇప్పుడున్న టాక్ కి జనాలు చూసేవాళ్ళు. కానీ వీకెండ్ కాగానే వెంటనే డ్రాప్ తీవ్రంగా ఉండే ప్రమాదం పొంచి ఉండేది. దాన్ని మిరాయ్ దిగ్విజయంగా తప్పించుకోవడం రేపటి నుంచి చూడొచ్చు.
కంటెంట్ మీద నమ్మకం ఉన్నప్పుడు, అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చినప్పుడు ఎలాంటి పెంపులు, సవరణలు అక్కర్లేదని మిరాయ్ నిరూపించేసింది. మిగిలిన నిర్మాతలు దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. విజువల్ ఎఫెక్ట్స్ లేని చిన్న బడ్జెట్ సినిమాలు లిటిల్ హార్ట్స్ రూపంలో అద్భుతాలు చేసి చూపించాయి. విఎఫ్ఎక్స్ మీద ఆధారపడిన మిరాయ్ లాంటివి మాములు టికెట్ రేట్లతో ఈ ఏడాది టాప్ గ్రాసర్స్ ని టార్గెట్ చేసుకున్నాయి. అలాంటప్పుడు ఇకపై ఈ విషయంలో ప్రొడ్యూసర్లు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. జిఓలు వచ్చినంత సులభంగా కలెక్షన్లు రావని గుర్తు పెట్టుకుంటే చాలు.
This post was last modified on September 14, 2025 12:31 pm
పాలమ్మీ, పూలమ్మీ ఎదిగానంటూ తనదైన శైలి వ్యాఖ్యలతో అందరినీ ఆకట్టుకున్న తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి…
నిన్న విడుదలైన జన నాయకుడుకి ఎలాంటి టాక్ వచ్చిందో తెలిసిందే. విజయ్ కున్న క్రేజ్ దృష్యా తమిళనాడులో ఎగబడి చూస్తున్నారు…
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. దేశ ప్రజలు మేకిన్…
పార్వతీపురం మన్యం జిల్లాలోని రైతులు గత కొన్ని రోజులుగా ఏనుగుల బెడదను ఎదుర్కొంటున్నారు. స్థానిక గ్రామాల్లోకి ఏనుగులు చొరబడి ప్రజలను…
ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో కీలక ఎన్నికలకు తెర లేవనుంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా కూటమి సర్కారు ప్రణాళికలు…
ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు.. ఈ కాన్సెప్ట్ తో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. వినడానికి, చూడడానికి సరదాగానే ఉంటుంది.…