తెలుగులో అంతకు ముందు ఏమో కానీ అమరన్ రూపంలో సాలిడ్ బ్లాక్ బస్టర్ పడ్డాక శివ కార్తికేయన్ కు ఇక్కడ కూడా మార్కెట్ ఏర్పడింది. అందుకే పెద్దగా హైప్ లేకపోయినా మదరాసిని మంచి రేట్లకే అమ్మారు. సినిమా ఫ్లాప్ కావడం వేరే విషయం. ఏడాది గ్యాప్ తీసుకుని మూవీ చేస్తే ఇలాంటి ఫలితం దక్కడం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తితో ఉన్నారు. ఇతని కొత్త చిత్రం పరాశక్తి జనవరి 14 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ మేరకు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటన ఇచ్చింది. అయితే కోలీవుడ్ లో ఈ అనౌన్స్ మెంట్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే పండగ బరిలో విజయ్ జన నాయగన్ ఉంది కాబట్టి.
పొలిటికల్ ఎంట్రీకి ముందు విజయ్ చివరి సినిమాగా ప్రచారంలో ఉన్న జన నాయగన్ మీద విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. అందుకే తనతో క్లాష్ వద్దు లెమ్మని సూర్య, విక్రమ్ లాంటి హీరోలు పోటీకి దిగే రిస్క్ చేయడం లేదు. కానీ శివ కార్తికేయన్ మాత్రం సై అంటూ సవాల్ విసరడం తమిళ సీమలో హాట్ టాపిక్ అయ్యింది. అధికార పార్టీ మీద విమర్శలు చేస్తున్న విజయ్ కు పోటీగా మరో సినిమా వస్తోందంటే ఉదయనిధి స్టాలిన్ చేతిలో ఉన్న రెడ్ జాయింట్ డిస్ట్రిబ్యూషన్ మద్దతు ఆటోమేటిక్ గా పరాశక్తికి వస్తుంది. దీంతో థియేటర్ల విషయంలో టెన్షన్ పడనక్కర్లేదని ట్రేడ్ పండితుల అంచనా.
ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. పరాశక్తికి తెలుగులోనూ డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ శ్రీలీల, సుధా కొంగర దర్శకత్వం, పీరియాడిక్ సెటప్ లాంటి ఆకర్షణలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ చిరంజీవి, ప్రభాస్, రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ లు పండగ బరిలో నువ్వా నేనాని తలపడబోతున్నారు. వీళ్ళలో ఒకరో ఇద్దరో తప్పుకున్నా కాంపిటీషన్ అయితే టఫ్ గా ఉంటుంది. స్క్రీన్లు కూడా సరైన సంఖ్యలో దొరకవు. మరి ఇన్ని ప్రతికూలతల మధ్య పరాశక్తి బ్లాక్ బస్టర్ కన్నా తక్కువ ఫలితం అందుకుంటే నిర్మాతలకు నష్టమే. దశాబ్దాల క్రితం జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమం బ్యాక్ డ్రాప్ లో పరాశక్తి రూపొందింది.
This post was last modified on September 12, 2025 10:44 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…