అనుకున్నదే అవుతోంది. మహావతార్ నరసింహ బ్లాక్ బస్టర్ సక్సెస్ ఎందరో ఫిలిం మేకర్స్ ని యానిమేషన్ వైపుకు తీసుకెళ్తుందన్న అంచనా చాలా త్వరగా నిజమవుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ఆంజనేయుడి కథను వాయుపుత్ర పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. వచ్చే సంవత్సరం దసరా విడుదలను టార్గెట్ చేసుకున్న ఈ మూవీలో ప్రత్యేకంగా నటీనటులు ఉండరు. అన్నీ యానిమేటెడ్ క్యారెక్టర్లతోనే కథను నడిపిస్తారు. నాగచైతన్య తండేల్ తో హిట్టు కొట్టాక గ్యాప్ తీసుకున్న చందూ మొండేటి ఈ వాయుపుత్రకు దర్శకుడు. ఇవాళ అధికారిక ప్రకటన ఇచ్చారు.
అందరికీ తెలిసిన కథే కాబట్టి ఎమోషన్స్, ఎలివేషన్స్ జోడించి వాయుపుత్రని ఎలా చూపిస్తారనేది కీలకం కానుంది. ఇప్పుడిలాంటి ప్రయత్నాల్లోనే ఇతర ప్రొడక్షన్ హౌసెస్ కూడా ఉన్నాయని సమాచారం. మీడియం రేంజ్ హీరోల మీద వంద కోట్లు పెట్టి జూదం ఆడటం కన్నా ఇలా యానిమేషన్ల మీద తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు వచ్చేలా చేసుకోవచ్చనే సత్యం ప్రొడ్యూసర్లు గుర్తిస్తున్నారు. అయితే యానిమేషన్ లో తీసినంత మాత్రాన జనం నెత్తిన బెట్టుకుంటారనే గ్యారెంటీ లేదు. వాళ్ళను రెండున్నర గంటల పాటు కట్టిపడేసే కంటెంట్ ని ఇవ్వాలి. అప్పుడే మహావతార్ నరసింహ లాంటివి సాధ్యమవుతాయి.
చిన్నగా మొదలైన ఈ మార్పు క్రమంగా ట్రెండ్ లా మారినా ఆశ్చర్యపోనక్కలేదు. ఆర్టిస్టులను పెట్టుకుని అష్టకష్టాలు పడే కంటే ఇలా యానిమేషన్ టీమ్ ని సెట్ చేసుకుని సినిమాలు తీయొచ్చని నిర్మాతలు భావించే అవకాశాలు లేకపోలేదు. అయితే అవి మహావతార్ నరసింహను మించి ఉండాలి. అలాని రెగ్యులర్ గా వీటినే తీస్తూ పోయినా రిస్కె. ఎందుకంటే రియల్ లైఫ్ ఆర్టిస్టులను తెరమీద చూస్తే వచ్చే ఫీల్ వేరు. ప్రతిసారి యానిమేషన్ తో ఆ భావోద్వేగాన్ని రిజిస్టర్ చేయలేం. ఒకదశ దాటాక ఇవీ రొటీన్ అయిపోయే ప్రమాదం ఉంది. మరి వాయుపుత్ర లార్జర్ దాన్ లైఫ్ రేంజ్ లో అద్భుతం చేస్తుందేమో చూడాలి.
This post was last modified on September 10, 2025 1:02 pm
రాజమౌళి తీసిన ఒకే ఒక స్పోర్ట్స్ డ్రామా సై. హీరో నితిన్ ఎంతమందికి గుర్తుంటాడో చెప్పలేం కానీ ఆ మూవీతోనే…
ఏపీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై సీఎం చంద్రబాబు ప్రోగ్రెస్ రిపోర్టు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితిని ఆయన వివరించారు.…
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…