బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషన్ను త్వరలోనే కొత్త అవతారంలో చూడబోతున్నాం. పాతికేళ్ల కెరీర్లో హీరోగానే కనిపించిన అతను.. తొలిసారిగా దర్శకుడి అవతారం ఎత్తబోతున్నాడు. తాను హీరోగా, తన తండ్రి దర్శక నిర్మాతగా వచ్చిన బ్లాక్ బస్టర్ ‘క్రిష్’ ఫ్రాంఛైజీలో భాగంగా నాలుగో చిత్రాన్ని స్వయంగా హృతికే డైరెక్ట్ చేయబోతున్నాడు.
ఈ ఫ్రాంఛైజీలో తొలి మూడు చిత్రాలు కోయీ మిల్గయా, క్రిష్, క్రిష్-3 ఒకదాన్ని మించి ఒకటి హిట్టయ్యాయి. వీటిని డైరెక్ట్ చేసిన రాకేష్ రోషన్ చాలా ఏళ్ల కిందటే క్రిష్-4కు స్క్రిప్టు రెడీ చేశాడు. కానీ ఒకవైపు బడ్జెట్ సమస్యలు, మరోవైపు రాకేష్ రోషన్ ఆరోగ్య సమస్యలు ఈ సినిమాకు అడ్డంకిగా మారాయి. క్యాన్సర్ నుంచి కోలుకున్నాక కూడా ఈ సినిమాను పట్టాలెక్కించడానికి చాలా ప్రయత్నించాడు రాకేష్. కానీ ఆయన వల్ల కాలేదు.
హృతిక్ మార్కెట్ స్థాయికి మించి ఖర్చు పెట్టాల్సి రావడంతో నిధులు సమకూరలేదు. బడ్జెట్ తగ్గిస్తే సినిమా చెడిపోతుందని రాకేష్ రాజీ పడలేదు. ఈలోపు ఆయనకు వయసు పెరిగి, ఓపిక తగ్గిపోయింది. దీంతో తాను ఆ సినిమాను డైరెక్ట్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. హృతిక్కే బాధ్యతలు అప్పగించేశాడు. ఐతే ప్రి ప్రొడక్షన్ ఆలస్యం, ఫైనాన్స్ సమకూర్చుకోవడంలో ఇబ్బందులతో సినిమా ఆలస్యమవుతూ వచ్చింది.
కానీ ఇప్పుడు అన్ని అడ్డంకులూ తొలగిపోయినట్లే ఉన్నాయి. క్రిష్-4 బడ్జెట్పై పూర్తి అవగాహన తెచ్చుకున్నామని, అన్ని లెక్కలూ వేసుకుని ప్రి ప్రొడక్షన్ పనులూ మొదలుపెట్టామని రాకేష్ రోషన్ వెల్లడించాడు. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలవుతుందని.. 2027లో రిలీజ్ ఉంటుందని కూడా రాకేష్ రోషన్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి.. ఆ తర్వాత ‘క్రిష్-4’కు అంకితం కానున్నాడు హృతిక్.
This post was last modified on September 9, 2025 6:06 pm
కాంగ్రెస్పార్టీ మాజీ అధ్యక్షురాలు, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ..పుస్తకం ముద్రణ వ్యవహారం వివాదంగా మారింది.…
ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…
ఆకస్మిక ప్రచండ వరదలతో అతలాకుతలమైన నేపాల్ తాజాగా ప్రపంచ దేశాలను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ``భౌతికంగా మీరు మాకు…
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…
సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…