బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషన్ను త్వరలోనే కొత్త అవతారంలో చూడబోతున్నాం. పాతికేళ్ల కెరీర్లో హీరోగానే కనిపించిన అతను.. తొలిసారిగా దర్శకుడి అవతారం ఎత్తబోతున్నాడు. తాను హీరోగా, తన తండ్రి దర్శక నిర్మాతగా వచ్చిన బ్లాక్ బస్టర్ ‘క్రిష్’ ఫ్రాంఛైజీలో భాగంగా నాలుగో చిత్రాన్ని స్వయంగా హృతికే డైరెక్ట్ చేయబోతున్నాడు.
ఈ ఫ్రాంఛైజీలో తొలి మూడు చిత్రాలు కోయీ మిల్గయా, క్రిష్, క్రిష్-3 ఒకదాన్ని మించి ఒకటి హిట్టయ్యాయి. వీటిని డైరెక్ట్ చేసిన రాకేష్ రోషన్ చాలా ఏళ్ల కిందటే క్రిష్-4కు స్క్రిప్టు రెడీ చేశాడు. కానీ ఒకవైపు బడ్జెట్ సమస్యలు, మరోవైపు రాకేష్ రోషన్ ఆరోగ్య సమస్యలు ఈ సినిమాకు అడ్డంకిగా మారాయి. క్యాన్సర్ నుంచి కోలుకున్నాక కూడా ఈ సినిమాను పట్టాలెక్కించడానికి చాలా ప్రయత్నించాడు రాకేష్. కానీ ఆయన వల్ల కాలేదు.
హృతిక్ మార్కెట్ స్థాయికి మించి ఖర్చు పెట్టాల్సి రావడంతో నిధులు సమకూరలేదు. బడ్జెట్ తగ్గిస్తే సినిమా చెడిపోతుందని రాకేష్ రాజీ పడలేదు. ఈలోపు ఆయనకు వయసు పెరిగి, ఓపిక తగ్గిపోయింది. దీంతో తాను ఆ సినిమాను డైరెక్ట్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. హృతిక్కే బాధ్యతలు అప్పగించేశాడు. ఐతే ప్రి ప్రొడక్షన్ ఆలస్యం, ఫైనాన్స్ సమకూర్చుకోవడంలో ఇబ్బందులతో సినిమా ఆలస్యమవుతూ వచ్చింది.
కానీ ఇప్పుడు అన్ని అడ్డంకులూ తొలగిపోయినట్లే ఉన్నాయి. క్రిష్-4 బడ్జెట్పై పూర్తి అవగాహన తెచ్చుకున్నామని, అన్ని లెక్కలూ వేసుకుని ప్రి ప్రొడక్షన్ పనులూ మొదలుపెట్టామని రాకేష్ రోషన్ వెల్లడించాడు. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలవుతుందని.. 2027లో రిలీజ్ ఉంటుందని కూడా రాకేష్ రోషన్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి.. ఆ తర్వాత ‘క్రిష్-4’కు అంకితం కానున్నాడు హృతిక్.
This post was last modified on September 9, 2025 6:06 pm
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…