బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషన్ను త్వరలోనే కొత్త అవతారంలో చూడబోతున్నాం. పాతికేళ్ల కెరీర్లో హీరోగానే కనిపించిన అతను.. తొలిసారిగా దర్శకుడి అవతారం ఎత్తబోతున్నాడు. తాను హీరోగా, తన తండ్రి దర్శక నిర్మాతగా వచ్చిన బ్లాక్ బస్టర్ ‘క్రిష్’ ఫ్రాంఛైజీలో భాగంగా నాలుగో చిత్రాన్ని స్వయంగా హృతికే డైరెక్ట్ చేయబోతున్నాడు.
ఈ ఫ్రాంఛైజీలో తొలి మూడు చిత్రాలు కోయీ మిల్గయా, క్రిష్, క్రిష్-3 ఒకదాన్ని మించి ఒకటి హిట్టయ్యాయి. వీటిని డైరెక్ట్ చేసిన రాకేష్ రోషన్ చాలా ఏళ్ల కిందటే క్రిష్-4కు స్క్రిప్టు రెడీ చేశాడు. కానీ ఒకవైపు బడ్జెట్ సమస్యలు, మరోవైపు రాకేష్ రోషన్ ఆరోగ్య సమస్యలు ఈ సినిమాకు అడ్డంకిగా మారాయి. క్యాన్సర్ నుంచి కోలుకున్నాక కూడా ఈ సినిమాను పట్టాలెక్కించడానికి చాలా ప్రయత్నించాడు రాకేష్. కానీ ఆయన వల్ల కాలేదు.
హృతిక్ మార్కెట్ స్థాయికి మించి ఖర్చు పెట్టాల్సి రావడంతో నిధులు సమకూరలేదు. బడ్జెట్ తగ్గిస్తే సినిమా చెడిపోతుందని రాకేష్ రాజీ పడలేదు. ఈలోపు ఆయనకు వయసు పెరిగి, ఓపిక తగ్గిపోయింది. దీంతో తాను ఆ సినిమాను డైరెక్ట్ చేయకూడదని నిర్ణయించుకున్నాడు. హృతిక్కే బాధ్యతలు అప్పగించేశాడు. ఐతే ప్రి ప్రొడక్షన్ ఆలస్యం, ఫైనాన్స్ సమకూర్చుకోవడంలో ఇబ్బందులతో సినిమా ఆలస్యమవుతూ వచ్చింది.
కానీ ఇప్పుడు అన్ని అడ్డంకులూ తొలగిపోయినట్లే ఉన్నాయి. క్రిష్-4 బడ్జెట్పై పూర్తి అవగాహన తెచ్చుకున్నామని, అన్ని లెక్కలూ వేసుకుని ప్రి ప్రొడక్షన్ పనులూ మొదలుపెట్టామని రాకేష్ రోషన్ వెల్లడించాడు. వచ్చే ఏడాది ఈ సినిమా మొదలవుతుందని.. 2027లో రిలీజ్ ఉంటుందని కూడా రాకేష్ రోషన్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి.. ఆ తర్వాత ‘క్రిష్-4’కు అంకితం కానున్నాడు హృతిక్.
This post was last modified on September 9, 2025 6:06 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…