ఒక దశలో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్ప్రెస్ రాజా, రన్ రాజా రన్ లాంటి సూపర్ హిట్లతో మాంచి ఊపుమీదున్నాడు శర్వానంద్. అతడి మార్కెట్ అమాంతం పెరిగింది. కానీ ఆ సక్సెస్ స్ట్రీక్ను తర్వాత కొనసాగించలేకపోయాడు. మారుతితో చేసిన ‘మహానుభావుడు’ మినహాయిస్తే గత కొన్నేళ్లలో శర్వా స్థాయికి తగ్గ విజయాల్లేవు.
చివరగా అతడి నుంచి వచ్చిన జాను, పడి పడి లేచె మనసు పెద్ద డిజాస్టర్లయ్యాయి. ఇప్పుడు శర్వాకు అత్యవసరంగా ఓ హిట్టు అవసరం. ఆ విజయం ఏది అందిస్తుందో కానీ.. శర్వా మాత్రం యమ స్పీడుగా సినిమాలు చేసుకుపోతున్నాడు. ఇప్పటికే శర్వా తెలుగులో ‘శ్రీకారం’ అనే సినిమాను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. కిషోర్ అనే కొత్త దర్శకుడు ఆ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం మొదలైంది గత ఏడాదే కానీ.. మధ్యలో కరోనా వల్ల కొంచెం ఆలస్యమైంది.
ఇక శర్వా లాక్ డౌన్ తర్వాత మొదలుపెట్టిన ఓ కొత్త చిత్రం ఇంతలోనే పూర్తయిపోవడం విశేషం. తమిళంలో నిర్మాతగా చాలా మంచి పేరున్న ఎస్.ఆర్.ప్రభు ‘డ్రీమ్ వారియర్స్’ బేనర్ మీద తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఇంతకుముందు శర్వా తమిళంలో ‘జర్నీ’ సినిమాతో చాలా మంచి పేరే సంపాదించాడు. కానీ ఆ తర్వాత ఆ మార్కెట్ మీద దృష్టిపెట్టలేదు. ఇంత కాలానికి ద్విభాషా చిత్రం చేయబోతున్నాడు.
ఈ సినిమాలో సీనియర్ నటి అమల ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తుండగా.. రీతూ వర్మ కథానాయికగా నటించింది. వీళ్లిద్దరికీ తమిళంలో మంచి గుర్తింపే ఉంది. తెలుగు వెర్షన్లో వెన్నెల కిషోర్, ప్రియదర్శి నటిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో మాటలు రాస్తున్నది దర్శకుడు తరుణ్ భాస్కర్ కావడం విశేషం. కొత్త ఏడాదిలో వీలు చూసుకుని ఈ చిత్రాన్ని రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…