Movie News

శర్వానంద్ చడీచప్పుడు లేకుండా..

ఒక దశలో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా, రన్ రాజా రన్ లాంటి సూపర్ హిట్లతో మాంచి ఊపుమీదున్నాడు శర్వానంద్. అతడి మార్కెట్ అమాంతం పెరిగింది. కానీ ఆ సక్సెస్ స్ట్రీక్‌ను తర్వాత కొనసాగించలేకపోయాడు. మారుతితో చేసిన ‘మహానుభావుడు’ మినహాయిస్తే గత కొన్నేళ్లలో శర్వా స్థాయికి తగ్గ విజయాల్లేవు.

చివరగా అతడి నుంచి వచ్చిన జాను, పడి పడి లేచె మనసు పెద్ద డిజాస్టర్లయ్యాయి. ఇప్పుడు శర్వాకు అత్యవసరంగా ఓ హిట్టు అవసరం. ఆ విజయం ఏది అందిస్తుందో కానీ.. శర్వా మాత్రం యమ స్పీడుగా సినిమాలు చేసుకుపోతున్నాడు. ఇప్పటికే శర్వా తెలుగులో ‘శ్రీకారం’ అనే సినిమాను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. కిషోర్ అనే కొత్త దర్శకుడు ఆ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం మొదలైంది గత ఏడాదే కానీ.. మధ్యలో కరోనా వల్ల కొంచెం ఆలస్యమైంది.

ఇక శర్వా లాక్ డౌన్ తర్వాత మొదలుపెట్టిన ఓ కొత్త చిత్రం ఇంతలోనే పూర్తయిపోవడం విశేషం. తమిళంలో నిర్మాతగా చాలా మంచి పేరున్న ఎస్.ఆర్.ప్రభు ‘డ్రీమ్ వారియర్స్’ బేనర్ మీద తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఇంతకుముందు శర్వా తమిళంలో ‘జర్నీ’ సినిమాతో చాలా మంచి పేరే సంపాదించాడు. కానీ ఆ తర్వాత ఆ మార్కెట్ మీద దృష్టిపెట్టలేదు. ఇంత కాలానికి ద్విభాషా చిత్రం చేయబోతున్నాడు.

ఈ సినిమాలో సీనియర్ నటి అమల ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తుండగా.. రీతూ వర్మ కథానాయికగా నటించింది. వీళ్లిద్దరికీ తమిళంలో మంచి గుర్తింపే ఉంది. తెలుగు వెర్షన్లో వెన్నెల కిషోర్, ప్రియదర్శి నటిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో మాటలు రాస్తున్నది దర్శకుడు తరుణ్ భాస్కర్ కావడం విశేషం. కొత్త ఏడాదిలో వీలు చూసుకుని ఈ చిత్రాన్ని రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.

This post was last modified on November 24, 2020 2:47 pm

Share
Show comments
Published by
Satya
Tags: SHarwanand

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

54 minutes ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

1 hour ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

2 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

2 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

5 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

6 hours ago