Movie News

శర్వానంద్ చడీచప్పుడు లేకుండా..

ఒక దశలో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఎక్స్‌ప్రెస్ రాజా, రన్ రాజా రన్ లాంటి సూపర్ హిట్లతో మాంచి ఊపుమీదున్నాడు శర్వానంద్. అతడి మార్కెట్ అమాంతం పెరిగింది. కానీ ఆ సక్సెస్ స్ట్రీక్‌ను తర్వాత కొనసాగించలేకపోయాడు. మారుతితో చేసిన ‘మహానుభావుడు’ మినహాయిస్తే గత కొన్నేళ్లలో శర్వా స్థాయికి తగ్గ విజయాల్లేవు.

చివరగా అతడి నుంచి వచ్చిన జాను, పడి పడి లేచె మనసు పెద్ద డిజాస్టర్లయ్యాయి. ఇప్పుడు శర్వాకు అత్యవసరంగా ఓ హిట్టు అవసరం. ఆ విజయం ఏది అందిస్తుందో కానీ.. శర్వా మాత్రం యమ స్పీడుగా సినిమాలు చేసుకుపోతున్నాడు. ఇప్పటికే శర్వా తెలుగులో ‘శ్రీకారం’ అనే సినిమాను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. కిషోర్ అనే కొత్త దర్శకుడు ఆ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రం మొదలైంది గత ఏడాదే కానీ.. మధ్యలో కరోనా వల్ల కొంచెం ఆలస్యమైంది.

ఇక శర్వా లాక్ డౌన్ తర్వాత మొదలుపెట్టిన ఓ కొత్త చిత్రం ఇంతలోనే పూర్తయిపోవడం విశేషం. తమిళంలో నిర్మాతగా చాలా మంచి పేరున్న ఎస్.ఆర్.ప్రభు ‘డ్రీమ్ వారియర్స్’ బేనర్ మీద తమిళం, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీ కార్తీక్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. ఇంతకుముందు శర్వా తమిళంలో ‘జర్నీ’ సినిమాతో చాలా మంచి పేరే సంపాదించాడు. కానీ ఆ తర్వాత ఆ మార్కెట్ మీద దృష్టిపెట్టలేదు. ఇంత కాలానికి ద్విభాషా చిత్రం చేయబోతున్నాడు.

ఈ సినిమాలో సీనియర్ నటి అమల ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తుండగా.. రీతూ వర్మ కథానాయికగా నటించింది. వీళ్లిద్దరికీ తమిళంలో మంచి గుర్తింపే ఉంది. తెలుగు వెర్షన్లో వెన్నెల కిషోర్, ప్రియదర్శి నటిస్తున్నారు. ఈ చిత్రానికి తెలుగులో మాటలు రాస్తున్నది దర్శకుడు తరుణ్ భాస్కర్ కావడం విశేషం. కొత్త ఏడాదిలో వీలు చూసుకుని ఈ చిత్రాన్ని రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేయబోతున్నారు.

This post was last modified on November 24, 2020 2:47 pm

Share
Show comments
Published by
Satya
Tags: SHarwanand

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago