మాములుగా ఒక స్టార్ హీరో ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయించుకోవడమే గగనమైపోయింది. అలాంటిది రెండున్నర నెలల్లో రెండు సినిమాలు విడుదలంటే అసలు ఊహించుకోవడం కూడా కష్టమే. కానీ రవితేజకది జరిగేలా ఉంది. ఇప్పటికే పలు వాయిదాల మధ్య ఆలస్యమవుతూ వచ్చిన మాస్ జాతర అక్టోబర్ 31 దాదాపు లాక్ చేసుకున్నట్టే. బాహుబలి ఎపిక్ రీ రిలీజ్ తప్ప ఆ రోజు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. పండగ సీజన్ కాకపోయినా టాక్ బాగుంటే కమర్షియల్ ఫుల్ బాగా ఉండే టైం కనక నిర్మాత నాగవంశీ ధీమాగా ఉన్నారట. ప్రకటన రాలేదు కానీ ఫైనల్ చేసే చర్చలు చివరి దశలో ఉన్నాయని టాక్.
మాస్ జాతర మీద ఇప్పటికైతే బజ్ పెద్దగా లేదు. భాను భోగవరపు దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ ఎంటర్ టైనర్ లో శ్రీలీల హీరోయిన్. ధమాకా మేజిక్ రిపీట్ అవుతుందనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. దీని తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న మరో సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతికి రిలీజ్ చేయాలనే పట్టుదలతో షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారని సమాచారం. ముందు అనార్కలి టైటిల్ అనుకున్నారు కానీ ప్రస్తుతం దానికి బదులు మరో వెరైటీ పేరు పెట్టే ఆలోచనలో టీమ్ ఉన్నట్టు తెలిసింది. ఇప్పటిదాకా రవితేజకు పెట్టని టైటిల్ సెట్ చేయబోతున్నట్టు తెలిసింది.
పండక్కు ఎంత పోటీ ఉన్నా సరే జనవరి 13 ఈ మూవీని రిలీజ్ చేయాలని సంకల్పించుకున్నారట. రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. నిజమైతే మాత్రం ఇంత తక్కువ గ్యాప్ లో మాస్ మహారాజా సినిమాలు ఎంజాయ్ చేయడం అభిమానులకు స్పెషల్ గా ఉండిపోతుంది. హిట్టు ఫ్లాపు పక్కనపెడితే స్పీడ్ విషయంలో రవితేజ ముందు ఎలా ఉన్నారో ఇప్పుడు అదే కొనసాగిస్తున్నారు. కాకపోతే దర్శకులు సరిగా హ్యాండిల్ చేయకపోవడం వల్ల ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. మాస్ జాతర, తిరుమల కిషోర్ సినిమాలు హిట్టయ్యి మళ్ళీ తనను ట్రాక్ లోకి తీసుకురావడం కోసమే సినీ ప్రియులు వెయిటింగ్.
This post was last modified on September 8, 2025 11:15 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…