దర్శకుడు క్రిష్ అంటే మూవీ లవర్స్ లో ప్రత్యేక గౌరవముంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా జోలికి వెళ్లకుండా విభిన్నమైన కథలతో ఆలోచింపజేసే సినిమాలు తీస్తాడని ఎక్కువగా ఇష్టపడతారు. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ కు ఇప్పటికీ బోలెడు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. తన ముద్ర 2015లో వచ్చిన కంచెతోనూ కొనసాగింది. 2017లో గౌతమిపుత్రశాతకర్ణితో బాలకృష్ణకు మర్చిపోలేని వందో మూవీ ఇచ్చిన క్రిష్ ఆ తర్వాత ట్రాక్ తప్పారు. మణికర్ణిక నుంచి మధ్యలోనే బయటికి వచ్చేయడంతో కంగనా రౌనత్ తో పాటు డైరెక్షన్ కార్డుని పంచుకోవాల్సి వచ్చింది. అది యావరేజ్ కావడం వేరే విషయం.
బాలయ్య ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు రెండూ తీవ్రంగా నిరాశపరిచాయి. స్వర్గీయ ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటన ఎంత అద్భుతంగా ఉన్నా మహానటి టైపు ట్రీట్ మెంట్ రాసుకున్న క్రిష్ ఆ స్థాయిలో మెప్పించలేకపోయారు. కొండపొలం సంగతి సరేసరి. చదవడానికి గొప్పగా అనిపించే నవలను తెరకెక్కించే క్రమంలో పడిన తడబాటుతో పాటు ఇంత హెవీ సబ్జెక్టుకి వైష్ణవ్ తేజ్ ని హీరోగా పెట్టడం ఆడియన్స్ తిరస్కారానికి కారణమయ్యింది. ఇక హరిహర వీరమల్లు గురించి తెలిసిందే. డిజాస్టర్ లో జ్యోతికృష్ణదే సింహ భాగమైనా క్రిష్ ప్రమేయాన్ని కొట్టి పారేయలేం.
ఇప్పుడు ఘాటీ కూడా వీటి కోవలోకే చేరింది. తన సెన్సిబిలిటీకి ఏ మాత్రం సూటవ్వని గంజాయి స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ ని తీసుకున్న క్రిష్ దాన్ని కనీసం యావరేజ్ అనిపించే స్థాయిలో తీయలేకపోయారు. అనుష్క విశ్వరూపం చూస్తారని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు కానీ తన దర్శకత్వపు విశ్వరూపం కోసం ఎదురు చూసే ప్రేక్షకులు ఉన్నారని మర్చిపోయారు. పుష్ప, కెజిఎఫ్ ప్రభావంతో అలాంటి ట్రీట్ మెంట్ తోనే ఒక లేడీ గ్యాంగ్ స్టర్ కథను చెప్పాలనుకుని ఇంకేదో చెప్పేశారు. బాలయ్య డ్రీం ప్రాజెక్టు ఆదిత్య 999 మ్యాక్స్ ని క్రిష్ కి ఇవ్వబోతున్నారనే టాక్ బలంగా ఉంది. దాన్నుంచి క్రిష్ సత్తా బయటపడాలనేది సినీ ప్రియుల కోరిక.
This post was last modified on September 7, 2025 9:03 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…