దర్శకుడు క్రిష్ అంటే మూవీ లవర్స్ లో ప్రత్యేక గౌరవముంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా జోలికి వెళ్లకుండా విభిన్నమైన కథలతో ఆలోచింపజేసే సినిమాలు తీస్తాడని ఎక్కువగా ఇష్టపడతారు. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ కు ఇప్పటికీ బోలెడు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. తన ముద్ర 2015లో వచ్చిన కంచెతోనూ కొనసాగింది. 2017లో గౌతమిపుత్రశాతకర్ణితో బాలకృష్ణకు మర్చిపోలేని వందో మూవీ ఇచ్చిన క్రిష్ ఆ తర్వాత ట్రాక్ తప్పారు. మణికర్ణిక నుంచి మధ్యలోనే బయటికి వచ్చేయడంతో కంగనా రౌనత్ తో పాటు డైరెక్షన్ కార్డుని పంచుకోవాల్సి వచ్చింది. అది యావరేజ్ కావడం వేరే విషయం.
బాలయ్య ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు రెండూ తీవ్రంగా నిరాశపరిచాయి. స్వర్గీయ ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటన ఎంత అద్భుతంగా ఉన్నా మహానటి టైపు ట్రీట్ మెంట్ రాసుకున్న క్రిష్ ఆ స్థాయిలో మెప్పించలేకపోయారు. కొండపొలం సంగతి సరేసరి. చదవడానికి గొప్పగా అనిపించే నవలను తెరకెక్కించే క్రమంలో పడిన తడబాటుతో పాటు ఇంత హెవీ సబ్జెక్టుకి వైష్ణవ్ తేజ్ ని హీరోగా పెట్టడం ఆడియన్స్ తిరస్కారానికి కారణమయ్యింది. ఇక హరిహర వీరమల్లు గురించి తెలిసిందే. డిజాస్టర్ లో జ్యోతికృష్ణదే సింహ భాగమైనా క్రిష్ ప్రమేయాన్ని కొట్టి పారేయలేం.
ఇప్పుడు ఘాటీ కూడా వీటి కోవలోకే చేరింది. తన సెన్సిబిలిటీకి ఏ మాత్రం సూటవ్వని గంజాయి స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ ని తీసుకున్న క్రిష్ దాన్ని కనీసం యావరేజ్ అనిపించే స్థాయిలో తీయలేకపోయారు. అనుష్క విశ్వరూపం చూస్తారని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు కానీ తన దర్శకత్వపు విశ్వరూపం కోసం ఎదురు చూసే ప్రేక్షకులు ఉన్నారని మర్చిపోయారు. పుష్ప, కెజిఎఫ్ ప్రభావంతో అలాంటి ట్రీట్ మెంట్ తోనే ఒక లేడీ గ్యాంగ్ స్టర్ కథను చెప్పాలనుకుని ఇంకేదో చెప్పేశారు. బాలయ్య డ్రీం ప్రాజెక్టు ఆదిత్య 999 మ్యాక్స్ ని క్రిష్ కి ఇవ్వబోతున్నారనే టాక్ బలంగా ఉంది. దాన్నుంచి క్రిష్ సత్తా బయటపడాలనేది సినీ ప్రియుల కోరిక.
This post was last modified on September 7, 2025 9:03 pm
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…
అన్ని పాదయాత్రలు సెంటిమెంటును రాజేస్తాయా.. అన్ని పాదయాత్రలు ఓటు బ్యాంకును దూసుకు వస్తాయా.. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో చెప్పడం కష్టంగా…