మిరాయ్.. తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా. ఆ మాటకొస్తే ఇతర భాషల్లోనూ ఈ సినిమాపై క్యూరియాసిటీ కనిపిస్తోంది. ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ లీడ్ రోల్ చేయడం.. టీజర్, ట్రైలర్ వేరే లెవెల్ అనిపించడమే ఈ ఆసక్తికి కారణం. కొంచెం అడ్వెంచరస్గా సాగే కథలకు డివైన్ ఎలిమెంట్ జోడిస్తే పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన ఫలితం వస్తుందని.. హనుమాన్, కార్తికేయ-2, కాంతార లాంటి చిత్రాలు రుజువు చేశాయి. ఈ ట్రెండును అందిపుచ్చుకుంటూ యువ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఎంతో కసరత్తు చేసి ‘మిరాయ్’ను తీర్చిదిద్దాడు.
ఈ సినిమా కథను దాచిపెట్టాలని అతనేమీ భావించట్లేదు. ట్రైలర్లో స్టోరీ మీద ఐడియా వచ్చేలా ఒక హింట్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్లలో కథ గురించి అతను ఓపెన్ అయిపోయాడు. దాని గురించి అతనేమన్నాడంటే..?
‘‘అశోక చక్రవర్తి దగ్గర తొమ్మిది దైవ గ్రంథాలు ఉండేవనే ఒక కల్పిత పురాణం ప్రచారంలో ఉంది. మానవాళికి ఎలాంటి సమస్య ఎదురైనా.. ఆ గ్రంథాల్లో పరిష్కారం ఉంటుందని.. దాన్ని సొంతం చేసుకోవడానికి జర్మనీ నియంత హిట్లర్ కూడా ప్రయత్నించాడని అంటారు. అలాంటి విలువైన గ్రంథాలు ఒక దుష్టుడి చేతుల్లోకి వెళ్తే ఏం జరుగుతందన్నదే ఈ కథ.
మన ఇతిహాసాల సాయంతో ఒక సూపర్ హీరో ఆ దుష్ట శక్తిని ఎలా అడ్డుకున్నాడన్న నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ఈ కథకు వర్తమానంతో పాటు త్రేతాయుగంతో ముడిపెట్టాం. అశోకుడిని శ్రీరాముడిని ఎలా కలిపాం.. ఆ తొమ్మది గ్రంథాలు అశోకుడి చేతికి ఎలా వచ్చి ఉండొచ్చు అన్నది కల్పిత విషయాలతో చెప్పే ప్రయత్నం చేశాం’’ అని కార్తీక్ వెల్లడించాడు. ఆరేళ్ల కిందట మొదలైన ఆలోచన ఇదని.. స్క్రిప్టు రాయడానికి చాలా టైం పట్టిందని.. తర్వాత చిత్రీకరణకు మూడేళ్లు టైం పట్టిందని.. అనవసర ఖర్చును తగ్గించుకుని మేకింగ్ కోసం ఎక్కువ డబ్బులు పెట్టాలని ఆర్టిస్టులందరూ కారవాన్లు లేకుండా పని చేశారని.. పరిమిత బడ్జెట్లోనే గొప్ప ఔట్ పుట్ తీసుకొచ్చామని కార్తీక్ తెలిపాడు. ‘మిరాయ్’ ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ సినిమా ఎప్పుడో కన్ఫర్మ్ అయినా.. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి…
2026 సంవత్సరంలో ఆరు నెలలు గడిచిపోయాయి. ఏదో నిన్నా మొన్నా కొత్త సంవత్సరం జరుపుకున్నట్టు ఉంది కానీ కాలం కర్పూరంలా…
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్…
షాహిద్ కపూర్,కృతి సనన్, రష్మిక మందన్న కలయికలో రూపొందిన కాక్ టైల్ 2 వసూళ్లు బాగా పడిపోవడం నిర్మాతలను ఆందోళనకు…
ఒకవేళ సాహో పెద్ద హిట్టయ్యింటే హీరోయిన్ శ్రద్ధ కపూర్ తెలుగులో వరసగా కనిపించేదేమో కానీ అనుకున్న ఫలితం అందుకోకపోవడంతో పూర్తిగా…
అదేంటో గానీ… విషయం ఏదైనా జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరు తీయాల్సిందే. ఆయనపై విమర్శలు…