రేపు మూడు సినిమాలు విడుదల కాబోతున్నా బుకింగ్స్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడం ఆశ్చర్యపరిచే విషయమే. అయితే ఈసారి సరిగ్గా రిలీజులు ఉన్న టైంలో వినాయక నిమజ్జనం రావడం ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించేలా ఉంది. ఈ రోజు సెప్టెంబర్ 4 పండగ తర్వాత తొమ్మిదో రోజు. చాలా చోట్ల భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటూ జనం ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. రాత్రి దాకా వీటిలో పాల్గొని అలిసిపోయిన యూత్ సహజంగానే థియేటర్లకు పరిగెత్తరు. ఏదో ప్రభాస్, మహేష్ బాబు లాంటి టయర్ 1 హీరోలైతే ఏదోలా ఓపిక తెచ్చుకుంటారు కానీ అనుష్క, శివ కార్తికేయన్, మౌళిలు అంత ఈజీగా జనాన్ని రాబట్టలేరు.
ఎల్లుండి సెప్టెంబర్ 6 హైదరాబాద్ తో పాటు నైజామ్, ఆంధ్రా తదితర ప్రాంతాల్లో నిమజ్జనం ఉండబోతోంది. ముందు రోజంతా ఏర్పాట్లలో నిర్వాహకులు బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళ తరఫున టీమ్స్ అన్నీ వేరే వాటి మీద ధ్యాస పెట్టవు. మరుసటి రోజు నిమజ్జనం కావడంతో ఆటా పాటలతో వేరే లోకం లేకుండా గడిపేస్తారు. దీంతో సహజంగానే సినిమాల మీద అంత ధ్యాస ఉండదు. పైగా పోటీలో ఉన్నవి స్టార్ హీరోలవి కాదు. అనుష్కకు ఫాలోయింగ్ ఉంది కానీ మరీ తన కోసమే థియేటర్లు కిక్కిరిసిపోయేంత జనం మొదటి రోజే రారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టికి నవీన్ ఉండటం ప్లస్ అయ్యింది కానీ ఘాటీకి ఆ ఛాన్స్ లేదు.
ప్రభాస్ తో రిలీజ్ టీజర్ లాంచ్ చేయించడం, అనుష్కకు సంబంధించిన విజువల్స్ ఎక్కువ చూపించడం ద్వారా అంచనాలను సెట్ చేసిన ఘాటీ టీమ్ పూర్తిగా టాక్ నే నమ్ముకుంది. అయితే ఊహించని విధంగా నిమజ్జనం ప్రభావం వసూళ్లలో కనిపించడంతో ప్రమోషన్ల గేరు మార్చేసింది. దీనికే ఇలా ఉంటే ఇక మదరాసి గురించి చెప్పేదేముంది. అసలే డబ్బింగ్ బొమ్మ. అదిరిపోయిందని మాట వినిపిస్తే తప్ప ఆడియన్స్ ముందుకు రారు. ఉన్నంతలో లిటిల్ హార్ట్స్ కొంచెం యూత్ అటెన్షన్ తీసుకుంటోంది. సో రేపు గెలవబోయే సినిమా చాలా బాగుందనే టాక్ తేవాలి. రిస్క్ ఉన్నా సరే ఎవరి క్యాలికులేషన్లు వాళ్లకు ఉన్నాయి.
This post was last modified on September 4, 2025 2:58 pm
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…
ఇది మార్కెటింగ్ యుగం. వస్తువైనా మనిషైనా జనాలకు త్వరగా చేరాలంటే పబ్లిసిటీ అవసరం. లేదంటే ఉనికిని చాటుకోవడం కష్టం. సినిమాలకు…
రాజమండ్రి జైలు నుంచి 18 రోజుల రిమాండ్ అనంతరం విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరుకు ర్యాలీగా బయలుదేరగా…
ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘దురంధర్-2’ ఒకటనడంలో సందేహం లేదు. గత ఏడాది ఓ మోస్తరు అంచనాల మధ్య…
గత ఏడాది తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి ఏమంత గొప్పగా లేదు. పెద్ద సినిమాలు అనుకున్న స్థాయిలో రిలీజ్ కాకపోవడం,…