ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఒక వెలుగు వెలిగాడు మురుగదాస్. రమణ, గజిని, తుపాకి, కత్తి లాంటి బ్లాక్బస్టర్లు ఆయనకు గొప్ప పేరు తెచ్చిపెట్టాయి. హిందీలో ‘గజిని’ సినిమాను రీమేక్ చేస్తే అక్కడా రికార్డ్ బ్రేకింగ్ హిట్టయింది. కానీ గత దశాబ్ద కాలంలో మురుగదాస్కు ఏదీ కలిసి రావడం లేదు. ‘స్పైడర్’ దగ్గర్నుంచి అన్నీ పరాజయాలే.
ఈ మధ్య ఆయన సినిమాల ఫ్రీక్వెన్సీ కూడా బాగా తగ్గిపోయింది. 2020లో సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ ‘దర్బార్’తో పలకరించిన ఆయన.. ఇంకో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి నాలుగేళ్లు పట్టింది. ఈ ఏడాది ఆరంభంలో ఆయన్నుంచి ‘సికిందర్’ సినిమా వచ్చింది. ఇప్పుడు శివకార్తికేయన్ చిత్రం ‘మదరాసి’తో వస్తున్నాడు మురుగదాస్. తన కెరీర్లో ఇంత గ్యాప్ రావడానికి ఒక యానిమేషన్ మూవీయే కారణమని మురుగదాస్ తెలిపాడు.
‘దర్బార్’ కంటే ముందు నుంచి ఒక పెద్ద యానిమేషన్ మూవీ మీద పని చేస్తున్నాడట మురుగదాస్. దాని కోసం చాలా కష్టపడ్డానని.. కానీ చివరికి ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదని మురుగదాస్ తెలిపాడు. ఆ సినిమా వల్ల దాదాపు ఐదు సంవత్సరాల సమయం వృథా అయిందని మురుగదాస్ తెలిపాడు.
ఇక మదరాసి సినిమా గురించి మురుగదాస్ మాట్లాడుతూ.. దక్షిణాది వాళ్లందరినీ నార్త్ వాళ్లు మదరాసి అని పిలుస్తుంటారని.. ఈ చిత్రంలో విలన్ కూడా హీరోను అలాగే సంబోధిస్తాడని.. అందుకే ఈ టైటిల్ ఖరారు చేశామని చెప్పాడు. మన దేశంలోకి వస్తున్న ఒక కొత్త సమస్యను ఈ చిత్రంలో చర్చించామని.. ఆ పాయింటే సినిమాకు హైలైట్గా ఉంటుందని అన్నాడు. హీరోతో పాటు హీరోయిన్, విలన్ పాత్రలు చాలా బలంగా ఉంటాయని.. సినిమాలో నాన్ స్టాప్ యాక్షన్ ఉంటుందని మురుగదాస్ తెలిపాడు.
This post was last modified on September 4, 2025 2:52 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…