తెలుగోళ్లు వట్టి వెధవలోయ్ అని ఓ పెద్దాయన సరదాగా అన్న మాటను డబ్బింగ్ సినిమాల నిర్మాతలు నిజం చేసేలా ఉన్నారు. ఇప్పటికే తమిళ టైటిల్స్ యధాతథంగా పెడుతూ వాటికి అర్థం తెలియకపోయినా సరే చచ్చినట్టు థియేటర్లకు వస్తారనే ధీమాతో దీన్నో ట్రెండ్ గా మార్చేశారు. ఏమైనా అడిగితే పేరులో ఏముంది, కంటెంట్ ముఖ్యం, ప్యాన్ ఇండియా కాబట్టి ఇలా పెట్టక తప్పదు అని కవర్ చేసుకుంటారు. సరే మన ఖర్మని జనాలు అడ్జస్ట్ అవుతూ వచ్చారు. ఇప్పుడీ ధోరణి కొత్త పుంతలు తొక్కుతోంది. విజయ్ ఆంటోనీ నిర్మాతగా రూపొందిన తమిళ సినిమాకు తెలుగులో కూడా అదే టైటిల్ పెట్టారు. సమస్య అది కాదు.
మన దగ్గరకు వచ్చేటప్పటికీ అది పచ్చి బూతుగా మారిపోయింది. ఒరిజినల్ వెర్షన్ లో ఆ పదం ఇబ్బంది కలిగించేది కాదు కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా అభ్యంతరం లేవనెత్తేదే. కనీసం డబ్బింగ్ చేస్తున్న టైంలో టీమ్ లో ఒక్క తెలుగు వారు కూడా లేరా అనే అనుమానం మీలో కలిగితే అది తప్పేం కాదు. సాధారణంగా విజయ్ ఆంటోనీకి తెలుగు ఆడియన్స్, మార్కెట్ అంటే చాలా గౌరవం. ఇప్పటికీ తన సినిమాలు ఏపీ, తెలంగాణలో బిజినెస్ చేస్తున్నాయంటే దానికి కారణం బిచ్చగాడు ఇచ్చిన ఇమేజ్. కానీ ఇప్పుడు పదాలకు అర్థం తెలుసుకోకుండా విజయ్ ఆంటోనీ తొందరపడిన మాట వాస్తవం.
ఇదొక సీరియస్ ఇష్యూ గా పరిగణించకపోతే రాను రాను ఇంకా తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది. తంగలాన్, తలైవి, వెట్టయాన్, మార్గన్, వలిమై అంటూ నోరు తిరగని పేర్లు పెట్టుకుంటూ వస్తే పోనిలే అంటూ సర్దుకుంటూ వచ్చిన జనాలను మరీ ఇంత లోకువగా చూడకూడదు. సోషల్ మీడియాలో నెటిజెన్లు అప్పుడే తలంటడం మొదలుపెట్టారు. ఒక్కసారి అర్థం కనుక్కుని ఆ తర్వాత ప్రమోషన్లు చేయమని కోరుతున్నారు. ఇందులో విజయ్ ఆంటోనీ హీరో కాదు. నిర్మాత మాత్రమే. అయినా సరే పూర్తి బాధ్యత దర్శకుడితో సమానంగా ఈయనకు దక్కుతుంది. మరి త్వరగా డ్యామేజ్ రిపేర్ చేసుకుంటే బెటర్.
This post was last modified on September 2, 2025 7:14 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…