తెలుగోళ్లు వట్టి వెధవలోయ్ అని ఓ పెద్దాయన సరదాగా అన్న మాటను డబ్బింగ్ సినిమాల నిర్మాతలు నిజం చేసేలా ఉన్నారు. ఇప్పటికే తమిళ టైటిల్స్ యధాతథంగా పెడుతూ వాటికి అర్థం తెలియకపోయినా సరే చచ్చినట్టు థియేటర్లకు వస్తారనే ధీమాతో దీన్నో ట్రెండ్ గా మార్చేశారు. ఏమైనా అడిగితే పేరులో ఏముంది, కంటెంట్ ముఖ్యం, ప్యాన్ ఇండియా కాబట్టి ఇలా పెట్టక తప్పదు అని కవర్ చేసుకుంటారు. సరే మన ఖర్మని జనాలు అడ్జస్ట్ అవుతూ వచ్చారు. ఇప్పుడీ ధోరణి కొత్త పుంతలు తొక్కుతోంది. విజయ్ ఆంటోనీ నిర్మాతగా రూపొందిన తమిళ సినిమాకు తెలుగులో కూడా అదే టైటిల్ పెట్టారు. సమస్య అది కాదు.
మన దగ్గరకు వచ్చేటప్పటికీ అది పచ్చి బూతుగా మారిపోయింది. ఒరిజినల్ వెర్షన్ లో ఆ పదం ఇబ్బంది కలిగించేది కాదు కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా అభ్యంతరం లేవనెత్తేదే. కనీసం డబ్బింగ్ చేస్తున్న టైంలో టీమ్ లో ఒక్క తెలుగు వారు కూడా లేరా అనే అనుమానం మీలో కలిగితే అది తప్పేం కాదు. సాధారణంగా విజయ్ ఆంటోనీకి తెలుగు ఆడియన్స్, మార్కెట్ అంటే చాలా గౌరవం. ఇప్పటికీ తన సినిమాలు ఏపీ, తెలంగాణలో బిజినెస్ చేస్తున్నాయంటే దానికి కారణం బిచ్చగాడు ఇచ్చిన ఇమేజ్. కానీ ఇప్పుడు పదాలకు అర్థం తెలుసుకోకుండా విజయ్ ఆంటోనీ తొందరపడిన మాట వాస్తవం.
ఇదొక సీరియస్ ఇష్యూ గా పరిగణించకపోతే రాను రాను ఇంకా తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది. తంగలాన్, తలైవి, వెట్టయాన్, మార్గన్, వలిమై అంటూ నోరు తిరగని పేర్లు పెట్టుకుంటూ వస్తే పోనిలే అంటూ సర్దుకుంటూ వచ్చిన జనాలను మరీ ఇంత లోకువగా చూడకూడదు. సోషల్ మీడియాలో నెటిజెన్లు అప్పుడే తలంటడం మొదలుపెట్టారు. ఒక్కసారి అర్థం కనుక్కుని ఆ తర్వాత ప్రమోషన్లు చేయమని కోరుతున్నారు. ఇందులో విజయ్ ఆంటోనీ హీరో కాదు. నిర్మాత మాత్రమే. అయినా సరే పూర్తి బాధ్యత దర్శకుడితో సమానంగా ఈయనకు దక్కుతుంది. మరి త్వరగా డ్యామేజ్ రిపేర్ చేసుకుంటే బెటర్.
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…