తెలుగోళ్లు వట్టి వెధవలోయ్ అని ఓ పెద్దాయన సరదాగా అన్న మాటను డబ్బింగ్ సినిమాల నిర్మాతలు నిజం చేసేలా ఉన్నారు. ఇప్పటికే తమిళ టైటిల్స్ యధాతథంగా పెడుతూ వాటికి అర్థం తెలియకపోయినా సరే చచ్చినట్టు థియేటర్లకు వస్తారనే ధీమాతో దీన్నో ట్రెండ్ గా మార్చేశారు. ఏమైనా అడిగితే పేరులో ఏముంది, కంటెంట్ ముఖ్యం, ప్యాన్ ఇండియా కాబట్టి ఇలా పెట్టక తప్పదు అని కవర్ చేసుకుంటారు. సరే మన ఖర్మని జనాలు అడ్జస్ట్ అవుతూ వచ్చారు. ఇప్పుడీ ధోరణి కొత్త పుంతలు తొక్కుతోంది. విజయ్ ఆంటోనీ నిర్మాతగా రూపొందిన తమిళ సినిమాకు తెలుగులో కూడా అదే టైటిల్ పెట్టారు. సమస్య అది కాదు.
మన దగ్గరకు వచ్చేటప్పటికీ అది పచ్చి బూతుగా మారిపోయింది. ఒరిజినల్ వెర్షన్ లో ఆ పదం ఇబ్బంది కలిగించేది కాదు కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా అభ్యంతరం లేవనెత్తేదే. కనీసం డబ్బింగ్ చేస్తున్న టైంలో టీమ్ లో ఒక్క తెలుగు వారు కూడా లేరా అనే అనుమానం మీలో కలిగితే అది తప్పేం కాదు. సాధారణంగా విజయ్ ఆంటోనీకి తెలుగు ఆడియన్స్, మార్కెట్ అంటే చాలా గౌరవం. ఇప్పటికీ తన సినిమాలు ఏపీ, తెలంగాణలో బిజినెస్ చేస్తున్నాయంటే దానికి కారణం బిచ్చగాడు ఇచ్చిన ఇమేజ్. కానీ ఇప్పుడు పదాలకు అర్థం తెలుసుకోకుండా విజయ్ ఆంటోనీ తొందరపడిన మాట వాస్తవం.
ఇదొక సీరియస్ ఇష్యూ గా పరిగణించకపోతే రాను రాను ఇంకా తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది. తంగలాన్, తలైవి, వెట్టయాన్, మార్గన్, వలిమై అంటూ నోరు తిరగని పేర్లు పెట్టుకుంటూ వస్తే పోనిలే అంటూ సర్దుకుంటూ వచ్చిన జనాలను మరీ ఇంత లోకువగా చూడకూడదు. సోషల్ మీడియాలో నెటిజెన్లు అప్పుడే తలంటడం మొదలుపెట్టారు. ఒక్కసారి అర్థం కనుక్కుని ఆ తర్వాత ప్రమోషన్లు చేయమని కోరుతున్నారు. ఇందులో విజయ్ ఆంటోనీ హీరో కాదు. నిర్మాత మాత్రమే. అయినా సరే పూర్తి బాధ్యత దర్శకుడితో సమానంగా ఈయనకు దక్కుతుంది. మరి త్వరగా డ్యామేజ్ రిపేర్ చేసుకుంటే బెటర్.
This post was last modified on September 2, 2025 7:14 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…