తెలుగోళ్లు వట్టి వెధవలోయ్ అని ఓ పెద్దాయన సరదాగా అన్న మాటను డబ్బింగ్ సినిమాల నిర్మాతలు నిజం చేసేలా ఉన్నారు. ఇప్పటికే తమిళ టైటిల్స్ యధాతథంగా పెడుతూ వాటికి అర్థం తెలియకపోయినా సరే చచ్చినట్టు థియేటర్లకు వస్తారనే ధీమాతో దీన్నో ట్రెండ్ గా మార్చేశారు. ఏమైనా అడిగితే పేరులో ఏముంది, కంటెంట్ ముఖ్యం, ప్యాన్ ఇండియా కాబట్టి ఇలా పెట్టక తప్పదు అని కవర్ చేసుకుంటారు. సరే మన ఖర్మని జనాలు అడ్జస్ట్ అవుతూ వచ్చారు. ఇప్పుడీ ధోరణి కొత్త పుంతలు తొక్కుతోంది. విజయ్ ఆంటోనీ నిర్మాతగా రూపొందిన తమిళ సినిమాకు తెలుగులో కూడా అదే టైటిల్ పెట్టారు. సమస్య అది కాదు.
మన దగ్గరకు వచ్చేటప్పటికీ అది పచ్చి బూతుగా మారిపోయింది. ఒరిజినల్ వెర్షన్ లో ఆ పదం ఇబ్బంది కలిగించేది కాదు కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా అభ్యంతరం లేవనెత్తేదే. కనీసం డబ్బింగ్ చేస్తున్న టైంలో టీమ్ లో ఒక్క తెలుగు వారు కూడా లేరా అనే అనుమానం మీలో కలిగితే అది తప్పేం కాదు. సాధారణంగా విజయ్ ఆంటోనీకి తెలుగు ఆడియన్స్, మార్కెట్ అంటే చాలా గౌరవం. ఇప్పటికీ తన సినిమాలు ఏపీ, తెలంగాణలో బిజినెస్ చేస్తున్నాయంటే దానికి కారణం బిచ్చగాడు ఇచ్చిన ఇమేజ్. కానీ ఇప్పుడు పదాలకు అర్థం తెలుసుకోకుండా విజయ్ ఆంటోనీ తొందరపడిన మాట వాస్తవం.
ఇదొక సీరియస్ ఇష్యూ గా పరిగణించకపోతే రాను రాను ఇంకా తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది. తంగలాన్, తలైవి, వెట్టయాన్, మార్గన్, వలిమై అంటూ నోరు తిరగని పేర్లు పెట్టుకుంటూ వస్తే పోనిలే అంటూ సర్దుకుంటూ వచ్చిన జనాలను మరీ ఇంత లోకువగా చూడకూడదు. సోషల్ మీడియాలో నెటిజెన్లు అప్పుడే తలంటడం మొదలుపెట్టారు. ఒక్కసారి అర్థం కనుక్కుని ఆ తర్వాత ప్రమోషన్లు చేయమని కోరుతున్నారు. ఇందులో విజయ్ ఆంటోనీ హీరో కాదు. నిర్మాత మాత్రమే. అయినా సరే పూర్తి బాధ్యత దర్శకుడితో సమానంగా ఈయనకు దక్కుతుంది. మరి త్వరగా డ్యామేజ్ రిపేర్ చేసుకుంటే బెటర్.
This post was last modified on September 2, 2025 7:14 pm
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…