ఆదిత్య 999… నందమూరి బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్టు. తన కెరీర్లో ఒక మైలరాయిలా నిలిచిపోయిన ఆదిత్య 369కు సీక్వెల్ తీయాలని ఆయన ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. ఆదిత్య 369 దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతోనే ఈ సినిమా కూడా చేయాలనుకున్నారు. కానీ ఆయనకు వయసు మీద పడింది. ఫామ్ కూడా కోల్పోయారు. ఈ సీక్వెల్కు స్టోరీ బోర్డ్తో సహా స్క్రిప్టు రెడీగా ఉంది. ఒక దశలో బాలయ్యే స్వయంగా ఈ చిత్రాన్ని రూపొందించాలనుకున్నాడు. కానీ తర్వాత ఆ ఆలోచన మానుకున్నాడు.
ఐతే ఈ మధ్య దర్శకుడిగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. బాలయ్యతో గౌతమీపుత్ర శాతకర్ణి తీసిన క్రిష్ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బాలయ్య ప్రధాన పాత్ర పోషించే ఈ చిత్రంలో ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా నటిస్తాడని అంటున్నారు. ఈ ప్రచారం గురించి క్రిష్ను అడిగితే మాత్రం సమాధానం ఇవ్వలేదు. తన కొత్త చిత్రం ఘాటి ప్రమోషన్లలో భాగంగా ఆదిత్య 999 గురించి అడిగితే.. ఈ సినిమాను ప్రకటించాల్సింది బాలయ్యే అని.. తాను దాని గురించి మాట్లాడలేనని తేల్చేశాడు క్రిష్.
ఈ చిత్రంలో మోక్షజ్ఞ నటిస్తాడన్నది నిజమా అంటే అది కూడా బాలయ్యే చెప్పాలన్నాడు. ఏదైనా బాలయ్య నోటి నుంచే వినాలని ఆయన స్పష్టం చేశాడు. ఘాటి నిర్మాత అయిన క్రిష్ స్నేహితుడు రాజీవ్ రెడ్డిని ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు గురించి అడిగితే.. చర్చలు జరుగుతున్నాయని మాత్రమే చెప్పాడు కానీ అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. క్రిష్ అయితే ఆ మాత్రం సమాచారం కూడా చెప్పలేదు కానీ సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రాజెక్ట్ లాక్ ఐపోయి లాంచ్ కు సిద్ధంగా ఉంది.
ఇక హరిహర వీరమల్లు నుంచి తప్పుకోవడం, ఆ సినిమాకు ఆశించిన ఫలితం రాకపోవడం గురించి ప్రశ్నిస్తే.. తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ప్రేమ అని, నిర్మాత ఏఎం రత్నం అంటే ఎంతో గౌరవమని.. ఐతే షెడ్యూలింగ్ సమస్యలు, తన వ్యక్తిగత ఇబ్బందుల వల్లే ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని.. దీంతో జ్యోతికృష్ణ మిగతా భాగం పూర్తి చేశారని.. ఆ సినిమా నుంచి బయటికి వచ్చాక తన ఫోకస్ అంతా ఘాటి మీదే ఉందని చెబుతూ వీరమల్లు రిజల్ట్ గురించి ఏమీ కామెంట్ చేయలేదు క్రిష్.
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…