ఆదిత్య 999… నందమూరి బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్టు. తన కెరీర్లో ఒక మైలరాయిలా నిలిచిపోయిన ఆదిత్య 369కు సీక్వెల్ తీయాలని ఆయన ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. ఆదిత్య 369 దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతోనే ఈ సినిమా కూడా చేయాలనుకున్నారు. కానీ ఆయనకు వయసు మీద పడింది. ఫామ్ కూడా కోల్పోయారు. ఈ సీక్వెల్కు స్టోరీ బోర్డ్తో సహా స్క్రిప్టు రెడీగా ఉంది. ఒక దశలో బాలయ్యే స్వయంగా ఈ చిత్రాన్ని రూపొందించాలనుకున్నాడు. కానీ తర్వాత ఆ ఆలోచన మానుకున్నాడు.
ఐతే ఈ మధ్య దర్శకుడిగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. బాలయ్యతో గౌతమీపుత్ర శాతకర్ణి తీసిన క్రిష్ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బాలయ్య ప్రధాన పాత్ర పోషించే ఈ చిత్రంలో ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా నటిస్తాడని అంటున్నారు. ఈ ప్రచారం గురించి క్రిష్ను అడిగితే మాత్రం సమాధానం ఇవ్వలేదు. తన కొత్త చిత్రం ఘాటి ప్రమోషన్లలో భాగంగా ఆదిత్య 999 గురించి అడిగితే.. ఈ సినిమాను ప్రకటించాల్సింది బాలయ్యే అని.. తాను దాని గురించి మాట్లాడలేనని తేల్చేశాడు క్రిష్.
ఈ చిత్రంలో మోక్షజ్ఞ నటిస్తాడన్నది నిజమా అంటే అది కూడా బాలయ్యే చెప్పాలన్నాడు. ఏదైనా బాలయ్య నోటి నుంచే వినాలని ఆయన స్పష్టం చేశాడు. ఘాటి నిర్మాత అయిన క్రిష్ స్నేహితుడు రాజీవ్ రెడ్డిని ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు గురించి అడిగితే.. చర్చలు జరుగుతున్నాయని మాత్రమే చెప్పాడు కానీ అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. క్రిష్ అయితే ఆ మాత్రం సమాచారం కూడా చెప్పలేదు కానీ సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రాజెక్ట్ లాక్ ఐపోయి లాంచ్ కు సిద్ధంగా ఉంది.
ఇక హరిహర వీరమల్లు నుంచి తప్పుకోవడం, ఆ సినిమాకు ఆశించిన ఫలితం రాకపోవడం గురించి ప్రశ్నిస్తే.. తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ప్రేమ అని, నిర్మాత ఏఎం రత్నం అంటే ఎంతో గౌరవమని.. ఐతే షెడ్యూలింగ్ సమస్యలు, తన వ్యక్తిగత ఇబ్బందుల వల్లే ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని.. దీంతో జ్యోతికృష్ణ మిగతా భాగం పూర్తి చేశారని.. ఆ సినిమా నుంచి బయటికి వచ్చాక తన ఫోకస్ అంతా ఘాటి మీదే ఉందని చెబుతూ వీరమల్లు రిజల్ట్ గురించి ఏమీ కామెంట్ చేయలేదు క్రిష్.
This post was last modified on September 1, 2025 9:35 am
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ…
చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్ ఒక ఫుల్ లెన్త్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. అదే రంభ ఊర్వశి మేనక.…