ఆదిత్య 999… నందమూరి బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్టు. తన కెరీర్లో ఒక మైలరాయిలా నిలిచిపోయిన ఆదిత్య 369కు సీక్వెల్ తీయాలని ఆయన ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. ఆదిత్య 369 దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతోనే ఈ సినిమా కూడా చేయాలనుకున్నారు. కానీ ఆయనకు వయసు మీద పడింది. ఫామ్ కూడా కోల్పోయారు. ఈ సీక్వెల్కు స్టోరీ బోర్డ్తో సహా స్క్రిప్టు రెడీగా ఉంది. ఒక దశలో బాలయ్యే స్వయంగా ఈ చిత్రాన్ని రూపొందించాలనుకున్నాడు. కానీ తర్వాత ఆ ఆలోచన మానుకున్నాడు.
ఐతే ఈ మధ్య దర్శకుడిగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. బాలయ్యతో గౌతమీపుత్ర శాతకర్ణి తీసిన క్రిష్ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. బాలయ్య ప్రధాన పాత్ర పోషించే ఈ చిత్రంలో ఆయన తనయుడు మోక్షజ్ఞ కూడా నటిస్తాడని అంటున్నారు. ఈ ప్రచారం గురించి క్రిష్ను అడిగితే మాత్రం సమాధానం ఇవ్వలేదు. తన కొత్త చిత్రం ఘాటి ప్రమోషన్లలో భాగంగా ఆదిత్య 999 గురించి అడిగితే.. ఈ సినిమాను ప్రకటించాల్సింది బాలయ్యే అని.. తాను దాని గురించి మాట్లాడలేనని తేల్చేశాడు క్రిష్.
ఈ చిత్రంలో మోక్షజ్ఞ నటిస్తాడన్నది నిజమా అంటే అది కూడా బాలయ్యే చెప్పాలన్నాడు. ఏదైనా బాలయ్య నోటి నుంచే వినాలని ఆయన స్పష్టం చేశాడు. ఘాటి నిర్మాత అయిన క్రిష్ స్నేహితుడు రాజీవ్ రెడ్డిని ఇంటర్వ్యూలో ఈ ప్రాజెక్టు గురించి అడిగితే.. చర్చలు జరుగుతున్నాయని మాత్రమే చెప్పాడు కానీ అంతకుమించి వివరాలు వెల్లడించలేదు. క్రిష్ అయితే ఆ మాత్రం సమాచారం కూడా చెప్పలేదు కానీ సినీ వర్గాల సమాచారం ప్రకారం ప్రాజెక్ట్ లాక్ ఐపోయి లాంచ్ కు సిద్ధంగా ఉంది.
ఇక హరిహర వీరమల్లు నుంచి తప్పుకోవడం, ఆ సినిమాకు ఆశించిన ఫలితం రాకపోవడం గురించి ప్రశ్నిస్తే.. తనకు పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ప్రేమ అని, నిర్మాత ఏఎం రత్నం అంటే ఎంతో గౌరవమని.. ఐతే షెడ్యూలింగ్ సమస్యలు, తన వ్యక్తిగత ఇబ్బందుల వల్లే ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని.. దీంతో జ్యోతికృష్ణ మిగతా భాగం పూర్తి చేశారని.. ఆ సినిమా నుంచి బయటికి వచ్చాక తన ఫోకస్ అంతా ఘాటి మీదే ఉందని చెబుతూ వీరమల్లు రిజల్ట్ గురించి ఏమీ కామెంట్ చేయలేదు క్రిష్.
This post was last modified on September 1, 2025 9:35 am
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…