Movie News

పెళ్లి విషయంలో పంతం వదలని విశాల్

తెలుగువాడైన తమిళ స్టార్ హీరో విశాల్ వయసు ప్రస్తుతం 48 ఏళ్లు. ఇంత వయసుకు కానీ అతను పెళ్లికి రెడీ అవ్వలేదు. పదేళ్ల ముందే అతడి పెళ్లి జరుగుతుందని వార్తలు వచ్చాయి. కానీ వరలక్ష్మి శరత్ కుమార్‌తో పెళ్లి వరకు వెళ్లిన వ్యవహారానికి బ్రేక్ పడింది. తర్వాత ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ అనీషా రెడ్డితో అతను ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కానీ అది కూడా రద్దయింది. ఎట్టకేలకు విశాల్ పెళ్లికి రంగం సిద్ధమైంది. 

తమిళ నటి సాయి ధనుష్కతో అతను తాజాగా నిశ్చితార్థం చేసుకున్నాడు. కొన్నేళ్ల నుంచి వీళ్లిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని ఇప్పుడు పెళ్లికి సిద్ధమయ్యారు. విశాల్ పుట్టిన రోజు నాడే వీరి నిశ్చితార్థం జరిగింది. నిజానికి నిశ్చితార్థం కూడా లేకుండా ఆ రోజు నేరుగా పెళ్లే చేసుకుందామని ఈ జంట అనుకుందట. కానీ దశాబ్దం కిందట పెళ్లి విషయంలో తనకు తాను ఒక షరతు విధించుకున్నాడు విశాల్. ఆ షరతును అనుసరించే ఇప్పుడు పెళ్లిని వాయిదా వేసుకున్నాడు.

విశాల్ నడిగర్ సంఘానికి తొలిసారి కార్యదర్శిగా ఎన్నికైన సమయంలో.. సంఘం కోసం భవనాన్ని నిర్మించాక అందులోని కళ్యాణమండపంలోనే తన పెళ్లి జరుగుతుందని ప్రకటించాడు. ఇప్పటికి తొమ్మిదేళ్లు గడిచాయి. అనేక ప్రయత్నాల తర్వాత కొన్నేళ్ల కిందటే ఆ భవన నిర్మాణం మొదలైంది. ఇప్పుడు అది చివరి దశలో ఉంది. ఇంకో రెండు మూడు నెలల్లో ఆ భవనం అందుబాటులోకి వస్తుందట.

ఇంత కాలం ఎదురు చూసిన తాను.. ఆ కొన్ని రోజులు ఎదురు చూడలేనా అనుకుని తన పుట్టిన రోజు నాటికి అనుకున్న పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. నిశ్చితార్థంతో సరిపెట్టాడు. నడిగర్ సంఘం కోసం భవనం నిర్మిస్తానన్న హామీని నిలబెట్టకుని, తన పంతం ప్రకారం అందులో తొలి పెళ్లిగా తనదే చేసుకోబోతున్నాడు విశాల్. విశాల్ ఈ హామీ ఇచ్చినపుడు అతను పెళ్లి చేసుకోవాలనుకున్నది వరలక్ష్మి శరత్ కుమార్‌ను. కానీ ఇప్పుడు సాయి ధనుష్కతో తన పెళ్లి కాబోతుండడం విశేషం.

This post was last modified on August 30, 2025 4:04 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Vishal

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

33 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

12 hours ago