కళ్యాణి ప్రియదర్శన్. పేరుకి మలయాళీనే కానీ తెరంగేట్రం చేసింది తెలుగు సినిమాలతోనే. అఖిల్ హలోతో ఎంట్రీ ఇచ్చి సాయి ధరమ్ తేజ్ చిత్రలహరితో హిట్ అందుకున్నాక శర్వానంద్ రణరంగం డిజాస్టర్ మళ్ళీ వెనక్కు రాకుండా చేసింది. తర్వాత తన స్వంత బాషలోనే కళ్యాణి బిజీ అయిపోయింది. ఈమె తండ్రి ప్రియదర్శన్ సుప్రసిద్ధ దర్శకుడన్న సంగతి తెలిసిందే. నాగార్జునతో నిర్ణయం తీసింది అభిమానులకు గుర్తే. ఆయన తీసిన ఎన్నో క్లాసిక్స్ టాలీవుడ్ లో రీమేకై బ్లాక్ బస్టర్స్ సాధించాయి. తండ్రి పేరుని జోడించుకున్న కళ్యాణికి ఈ వారం స్పెషల్ గా నిలిచిపోయింది. ఒక రోజు గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజయ్యాయి.
మొదటిది లోక చాప్టర్ 1 చంద్ర. సూపర్ హీరో తరహా ఎలివేషన్ సబ్జెక్టుతో తెరకెక్కిన ఈ ఫాంటసీ డ్రామాకు మంచి రివ్యూస్ వచ్చాయి. పబ్లిక్ టాక్ డీసెంట్ గా ఉంది. థియేటర్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసే కంటెంట్ గా విశ్లేషకులు పేర్కొన్నారు. తెలుగులో కొంత ఆలస్యంగా నిన్న రాత్రి నుంచి షోలు మొదలైనప్పటికీ ఆక్యుపెన్సీలు బాగుండటం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది. టైటిల్ కొత్త లోక అని అర్థమయ్యీ కానట్టు పెట్టినా టాక్ తెలుసుకున్న జనాలు టికెట్లు కొనేసుకుంటున్నారు. ఈ వీకెండ్ స్ట్రెయిట్ సినిమాలను కాదని మరీ ఈ కొత్త లోకనే ఫస్ట్ ఛాయస్ కావడం ఖాయం. సితార డిస్ట్రిబ్యూషన్ ప్లస్ అయ్యింది.
ఇక రెండో సినిమా ఒదుమ్ కుతిరా చాదుమ్ కుతిర. అంటే పరిగెత్తే గుర్రం ఎగిరే గుర్రం. పుష్ప విలన్ ఫాహద్ ఫాసిల్ ఇందులో హీరో. ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకున్న ఒక కుర్రాడి లైఫ్ స్టోరీని డిఫరెంట్ గా చూపించాలనుకున్న దర్శకుడి ప్రయత్నం అడ్డంగా బెడిసి కొట్టింది. భరించలేని తలనెప్పిగా ఉందని క్రిటిక్స్ ఓ రేంజ్ లో తలంటేశారు. ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ ఇవేవి లేకుండా ఊరికే సీన్లను పేర్చుకుంటూ పోయి సహనంతో ఆడుకున్నారని క్లాసులు పీకారు. రెండు మంచి అంచనాలున్న సినిమాలతో ఒకే టైంలో వచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ కి ఒకటి తుక్కు కాగా మరొకటి కిక్కు ఇచ్చింది.
This post was last modified on August 30, 2025 2:43 pm
అసెంబ్లీ సమావేశాల వేళ మంత్రి నారా లోకేష్ సరికొత్త రాజకీయ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు…
తెలుగు సినిమాలకు మార్కెట్ పరంగా అతి పెద్ద ఏరియా అయిన నైజాంలో ఉన్నట్లుండి కొత్త కొత్త డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు మొదలు కావడం…
మాములుగా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఓటిటిలో వచ్చినప్పుడు సోషల్ మీడియాలో మంచి హడావిడి ఉంటుంది. కానీ మన శంకరవరప్రసాద్…
ఇంకా ఏడాది సమయం ఉండగానే టాలీవుడ్ సంక్రాంతి మీద విపరీతమైన హైప్ నెలకొంది. షూటింగులు మొదలుపెట్టకుండా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్,…
ఇండియాలో వెబ్ సిరీస్లు చేయడంలో బాలీవుడ్ స్టార్లు ముందు నుంచి చురకే. ట్రెండును అందిపుచ్చుకుంటూ సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్,…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించిన వ్యవహారం రాజకీయంగా రచ్చ రేపిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టు…