కళ్యాణి ప్రియదర్శన్. పేరుకి మలయాళీనే కానీ తెరంగేట్రం చేసింది తెలుగు సినిమాలతోనే. అఖిల్ హలోతో ఎంట్రీ ఇచ్చి సాయి ధరమ్ తేజ్ చిత్రలహరితో హిట్ అందుకున్నాక శర్వానంద్ రణరంగం డిజాస్టర్ మళ్ళీ వెనక్కు రాకుండా చేసింది. తర్వాత తన స్వంత బాషలోనే కళ్యాణి బిజీ అయిపోయింది. ఈమె తండ్రి ప్రియదర్శన్ సుప్రసిద్ధ దర్శకుడన్న సంగతి తెలిసిందే. నాగార్జునతో నిర్ణయం తీసింది అభిమానులకు గుర్తే. ఆయన తీసిన ఎన్నో క్లాసిక్స్ టాలీవుడ్ లో రీమేకై బ్లాక్ బస్టర్స్ సాధించాయి. తండ్రి పేరుని జోడించుకున్న కళ్యాణికి ఈ వారం స్పెషల్ గా నిలిచిపోయింది. ఒక రోజు గ్యాప్ లో రెండు సినిమాలు రిలీజయ్యాయి.
మొదటిది లోక చాప్టర్ 1 చంద్ర. సూపర్ హీరో తరహా ఎలివేషన్ సబ్జెక్టుతో తెరకెక్కిన ఈ ఫాంటసీ డ్రామాకు మంచి రివ్యూస్ వచ్చాయి. పబ్లిక్ టాక్ డీసెంట్ గా ఉంది. థియేటర్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసే కంటెంట్ గా విశ్లేషకులు పేర్కొన్నారు. తెలుగులో కొంత ఆలస్యంగా నిన్న రాత్రి నుంచి షోలు మొదలైనప్పటికీ ఆక్యుపెన్సీలు బాగుండటం ట్రేడ్ ని ఆశ్చర్యపరిచింది. టైటిల్ కొత్త లోక అని అర్థమయ్యీ కానట్టు పెట్టినా టాక్ తెలుసుకున్న జనాలు టికెట్లు కొనేసుకుంటున్నారు. ఈ వీకెండ్ స్ట్రెయిట్ సినిమాలను కాదని మరీ ఈ కొత్త లోకనే ఫస్ట్ ఛాయస్ కావడం ఖాయం. సితార డిస్ట్రిబ్యూషన్ ప్లస్ అయ్యింది.
ఇక రెండో సినిమా ఒదుమ్ కుతిరా చాదుమ్ కుతిర. అంటే పరిగెత్తే గుర్రం ఎగిరే గుర్రం. పుష్ప విలన్ ఫాహద్ ఫాసిల్ ఇందులో హీరో. ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకున్న ఒక కుర్రాడి లైఫ్ స్టోరీని డిఫరెంట్ గా చూపించాలనుకున్న దర్శకుడి ప్రయత్నం అడ్డంగా బెడిసి కొట్టింది. భరించలేని తలనెప్పిగా ఉందని క్రిటిక్స్ ఓ రేంజ్ లో తలంటేశారు. ఎమోషన్స్, ఎంటర్ టైన్మెంట్, యాక్షన్ ఇవేవి లేకుండా ఊరికే సీన్లను పేర్చుకుంటూ పోయి సహనంతో ఆడుకున్నారని క్లాసులు పీకారు. రెండు మంచి అంచనాలున్న సినిమాలతో ఒకే టైంలో వచ్చిన కళ్యాణి ప్రియదర్శన్ కి ఒకటి తుక్కు కాగా మరొకటి కిక్కు ఇచ్చింది.
This post was last modified on August 30, 2025 2:43 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…