‘బిగ్ బాస్’ హౌస్లో ఎవరుండాలి.. ఎవరు వెళ్లిపోవాలి అనేది నిర్ణయించేది ప్రేక్షకులే అని, ఎలిమినేషన్ పూర్తిగా వారి ఓటింగ్ ఆధారంగానే జరుగుతుందని షో నిర్వాహకులు ఎప్పుడూ నొక్కి వక్కాణిస్తుంటారు. ఐతే కంటెస్టెంట్ల ప్రవర్తన ఆధారంగా జనాల అభిప్రాయం ఏంటన్నది తెలిసిపోతూనే ఉంటుంది. మెజారిటీ అభిప్రాయాన్ని బట్టే ఎలిమినేషన్ జరుగుతుందని ఆశిస్తాం. సోషల్ మీడియాలో కూడా ట్రెండ్స్ తెలిసిపోతుంటాయి.
ఐతే నాలుగో సీజన్ ఆరంభం నుంచి జనాల వ్యతిరేకత ఎదుర్కొంటున్న వాళ్లలో మోనాల్ గుజ్జర్ ఒకరన్నది స్పష్టం. ఆమె ప్రతిదానికీ ఎమోషనల్ అయిపోవడం.. డబుల్ గేమ్ ఆడటం జనాలకు నచ్చట్లేదు. మోనాల్ పేరు ట్విట్టర్లో కొడితే ఆమెపై ఉన్న వ్యతిరేకత ఎలాంటిదన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఐతే ఆమె ఎలిమినేషన్లోకి రావడమే తక్కువ. వచ్చినా ప్రతిసారీ సేఫ్ అయిపోతూ ఉంటుంది. ఇది మెజారిటీ ప్రేక్షకులకు అస్సలు రుచించట్లేదు.
స్వతహాగా హీరోయిన్ కాబట్టి, గ్లామర్ అన్నది ఎసెట్ కాబట్టి షోలో ఉన్న అందరు అమ్మాయిల్లోకి రేంజ్ పరంగా మోనాల్ ఎక్కువే. ఆమెకు ఎక్కువ పారితోషకం ఇచ్చే షోకు తీసుకుని వచ్చి ఉంటారు. అలాంటి ఆకర్షణీయ అమ్మాయిని ఆరంభంలోనే పంపేయడం కరెక్ట్ కాదు. కానీ జనాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నా.. ఆమె కచ్చితంగా బయటికి వెళ్లిపోతుందన్న అంచనాలు కనిపిస్తున్నా సేఫ్ అయిపోతుండటం ఆశ్చర్యకరం.
ఇక్కడ బిగ్ బాస్ టీం మ్యానుపులేట్ చేస్తోందన్న అనుమానం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ వారం లాస్య ఎలిమినేట్ అయిందంటున్నారు. మోనాల్తో పోలిస్తే ఆమె బెటర్ కంటెస్టెంట్ అన్నది స్పష్టం. ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే జనాల మద్దతు లాస్యకే అని అర్థమవుతోంది. అయినా సరే.. మోనాల్ సేవ్ అయిపోవడమేంటో తెలియట్లేదు. ఈమెను బిగ్ బాస్ టీం ఎందుకు కాపాడుతోందంటూ జనాలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్న సంగతి నిర్వాహకులకు తెలుస్తోందా?
This post was last modified on November 23, 2020 8:12 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…