ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. స్వర్గీయ రమేష్ బాబు కొడుకు జయకృష్ణ తెరంగేట్రం కోసం గ్రౌండ్ రెడీ చేశారు. ఆరెక్స్ 100, మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ద్వారా రవీనాటాండన్ కూతురు రషా తదాని టాలీవుడ్ కు పరిచయం కానుంది. ఇంకా ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించకపోయినా తెరవెనుక లాంఛనాలన్నీ ఒక కొలిక్కి వచ్చాయట. శ్రీనివాస మంగాపురం టైటిల్ ని దాదాపు లాక్ చేసినట్టు చెబుతున్నాడు. ఇదిలా ఉండగా కీలకమైన పాత్ర కోసం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓకే చెప్పారనే వార్త అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.
కొంచెం లోతుగా వెళ్తే మరిన్ని వివరాలు తెలుస్తున్నాయి. జయకృష్ణ లాంచింగ్ వ్యవహారాలు చూస్తున్న మహేష్, నమ్రతలు అతని కోసం మరీ సాఫ్ట్ లవ్ స్టోరీ కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్టుకే ఓకే చెప్పారట. అంటే మహేష్ బాబు సోలో హీరోగా డెబ్యూ చేసిన రాజకుమారుడు తరహాలో ఒక కంప్లీట్ ప్యాకేజీతో అన్ని ఉండేలా చూసుకున్నారని వినికిడి. బడ్జెట్ విషయంలో రాజీ ఉండదట. మోహన్ బాబు పాజిటివ్ గా స్పందించడానికి కారణముంది. గతంలో కృష్ణ, మహేష్ బాబుతో కలిసి ఆయన కొడుకు దిద్దిన కాపురం లాంటి సూపర్ హిట్స్ లో నటించారు. రమేష్ బాబుతో తెరను పంచుకున్న అనుభవముంది.
ఇప్పుడు జయకృష్ణ అంటే మూడో జనరేషన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న అరుదైన జ్ఞాపకం మిగులుతుంది. కొంచెం నెగటివ్ షేడ్ ఉంటుందని వినికిడి. క్లైమాక్స్ మాత్రం అజయ్ భూపతి స్టైల్ లో ఎవరూ ఊహించని ట్విస్టులతో ఉంటుందని, మహేష్ ఇంప్రెస్ కావడానికి కారణం అదే అంటున్నారు. ఎంత కష్టపడుతున్నా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతున్న సుధీర్ బాబు లాగా పొరపాట్లు రిపీట్ కాకుండా జయకృష్ణకు సంబంధించిన ప్లానింగ్ అంతా పిన్ని, బాబాయ్ చూసుకుంటారని అంతర్గత సమాచారం. షూటింగ్ దసరా నుంచి మొదలుపెట్టి వచ్చే వేసవికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.
This post was last modified on August 29, 2025 3:18 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…