ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. స్వర్గీయ రమేష్ బాబు కొడుకు జయకృష్ణ తెరంగేట్రం కోసం గ్రౌండ్ రెడీ చేశారు. ఆరెక్స్ 100, మంగళవారం ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ద్వారా రవీనాటాండన్ కూతురు రషా తదాని టాలీవుడ్ కు పరిచయం కానుంది. ఇంకా ప్రాజెక్టుని అధికారికంగా ప్రకటించకపోయినా తెరవెనుక లాంఛనాలన్నీ ఒక కొలిక్కి వచ్చాయట. శ్రీనివాస మంగాపురం టైటిల్ ని దాదాపు లాక్ చేసినట్టు చెబుతున్నాడు. ఇదిలా ఉండగా కీలకమైన పాత్ర కోసం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓకే చెప్పారనే వార్త అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.
కొంచెం లోతుగా వెళ్తే మరిన్ని వివరాలు తెలుస్తున్నాయి. జయకృష్ణ లాంచింగ్ వ్యవహారాలు చూస్తున్న మహేష్, నమ్రతలు అతని కోసం మరీ సాఫ్ట్ లవ్ స్టోరీ కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్టుకే ఓకే చెప్పారట. అంటే మహేష్ బాబు సోలో హీరోగా డెబ్యూ చేసిన రాజకుమారుడు తరహాలో ఒక కంప్లీట్ ప్యాకేజీతో అన్ని ఉండేలా చూసుకున్నారని వినికిడి. బడ్జెట్ విషయంలో రాజీ ఉండదట. మోహన్ బాబు పాజిటివ్ గా స్పందించడానికి కారణముంది. గతంలో కృష్ణ, మహేష్ బాబుతో కలిసి ఆయన కొడుకు దిద్దిన కాపురం లాంటి సూపర్ హిట్స్ లో నటించారు. రమేష్ బాబుతో తెరను పంచుకున్న అనుభవముంది.
ఇప్పుడు జయకృష్ణ అంటే మూడో జనరేషన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న అరుదైన జ్ఞాపకం మిగులుతుంది. కొంచెం నెగటివ్ షేడ్ ఉంటుందని వినికిడి. క్లైమాక్స్ మాత్రం అజయ్ భూపతి స్టైల్ లో ఎవరూ ఊహించని ట్విస్టులతో ఉంటుందని, మహేష్ ఇంప్రెస్ కావడానికి కారణం అదే అంటున్నారు. ఎంత కష్టపడుతున్నా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతున్న సుధీర్ బాబు లాగా పొరపాట్లు రిపీట్ కాకుండా జయకృష్ణకు సంబంధించిన ప్లానింగ్ అంతా పిన్ని, బాబాయ్ చూసుకుంటారని అంతర్గత సమాచారం. షూటింగ్ దసరా నుంచి మొదలుపెట్టి వచ్చే వేసవికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.
This post was last modified on August 29, 2025 3:18 pm
టిడిపిలోనే కొందరు నాయకులకు మెజారిటీ సమస్య ఇప్పుడు కొంత గడబిడగా మారింది. గత ఎన్నికల సమయంలో భారీ స్థాయి మెజారిటీతో…
ఇటీవలే శ్వాసనాళానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రమంగా కోలుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం హైదరాబాద్…
ఎవరు ఔనన్నా కాదన్నా టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎగ్జిబిటర్లు ప్లస్ వాళ్లలోనే ఉన్న నిర్మాతలు, ప్రొడ్యూసర్లు ప్లస్ వాళ్లలోనే…
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)కు నిజంగానే ఉచ్చు బిగుస్తోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.…
జైలు.. ఈ మాట వినగానే సామాన్యులకు వామ్మో అనిపిస్తుంది. అక్కడి పరిస్థితుల గురించి అనుభవం ఉన్న వాళ్లు చెబుతుంటే.. సినిమాల్లో…
ఏపీలో ప్రదాన ప్రతిపక్ష హోదానూ దక్కించుకోలేకపోయిన వైసీపీ… తన పునరాగమనానికి భారీ కసరత్తే చేస్తోంది. అందులో భాగంగా ఏ చిన్న…