విజయ్ దేవరకొండ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన కింగ్డమ్ థియేట్రికల్ గా ఎంత నష్టపరిచిందో చూశాం. నిర్మాత నాగవంశీ స్టేట్ మెంట్లకు, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కాన్ఫిడెన్స్ కి సంబంధం లేకుండా ఫలితం దక్కడం రౌడీ బాయ్ అభిమానులను కలవరపెట్టింది. కేవలం నాలుగు వారాల విండోతో ఇవాళ నెట్ ఫ్లిక్స్ ఓటిటి ద్వారా అందుబాటులోకి వచ్చేసింది. బిగ్ స్క్రీన్ మీద మిస్సైన హృదయం లోపల పాట డిజిటల్ లోనూ లేదు. అదనపు సీన్ల ఊసే లేదు. కొన్ని డివైజెస్ లో ఆడియో ప్రాబ్లమ్ వచ్చిందని సోషల్ మీడియాలో కంప్లయింట్స్ వచ్చాయి. వాటిని సరిచేసే పనిలో నెట్ ఫ్లిక్స్ టీమ్ ఉందట.
ఇదంతా పక్కనపెడితే అసలు కింగ్డమ్ గురించి ఏ చర్చ అయినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే అదనపు ఫుటేజ్ జోడిస్తే ఫ్యాన్స్ కొంచెం ఆసక్తి చూపించవచ్చేమో కానీ సాధారణ ప్రేక్షకుల్లో దాని మీద అంత ఇంటరెస్ట్ ఉండదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఓటిటి కోసం ఎడిట్ చేసిన సీన్లను జోడించే ఆలోచన చేశారట. కానీ అలా చేయడం వల్ల గంట దాకా నిడివి పెరిగే అవకాశం ఉండటంతో నెట్ ఫ్లిక్స్ నుంచే వద్దనే మాట వినిపించిందట. ఫ్లాప్ మూవీస్ కి ఈ మధ్య వ్యూస్ ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఇప్పుడు లెన్త్ మరింత పెంచితే వ్యూయర్ షిప్ పరంగా ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో నో చెప్పారనే టాక్ ఉంది.
అయినా గతంలోలా ఇప్పుడు ఓటిటి రిలీజులకు పెద్దగా సౌండ్ ఉండటం లేదు. జనాలు తెలివి మీరిపోయారు. వీటికి కూడా టాక్స్, రివ్యూలను ప్రామాణికంగా తీసుకుని సమయం కేటాయించాలా వద్దాని నిర్ణయించుకుంటున్నారు. ప్రమోషన్ టైంలో కింగ్డమ్ 2 గురించి టీమ్ చెప్పుకుంటూ వచ్చింది కానీ ఇప్పుడా సూచనలు తగ్గిపోతున్నాయి. బాక్సాఫీస్ ఫలితం సానుకూలంగా రాకపోవడంతో సీక్వెల్ ప్లాన్ ని డ్రాప్ చేశారని టాక్. అధికారికంగా చెప్పలేదు కానీ త్వరలో ఏదో ఒక ఇంటర్వ్యూలో దానికి సంబంధించిన క్లారిటీ రావొచ్చు. ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్, రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన…