సెప్టెంబర్ 5 విడుదల కాబోతున్న ఘాటీ ప్రమోషన్లకు అనుష్క బయటికి వస్తుందేమోనని ఎదురు చూస్తున్న అభిమానులకు షాక్ తప్పదు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తరహాలో దీనికి కూడా పబ్లిసిటీలో తను భాగం కాబోవడం లేదు. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన రాజీవ్ రెడ్డి స్పష్టం చేశారు. ముందే రాసుకున్న టర్మ్స్ ప్రకారం అనుష్క రావడం లేదని, ఒకవేళ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించినా ఎక్స్ పెక్ట్ చేయొద్దనే రీతిలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పోనీ ఏదైనా వీడియో ఇంటర్వ్యూ ఉండొచ్చనే ఆశలు కూడా దాదాపు లేనట్టే. సరే ఇదంతా బాగానే కానీ అనుష్క రాకపోవడం వల్ల ఏర్పడే చిక్కు ఒకటుంది.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి టైంలో ప్రమోషన్ల భారమంతా నవీన్ పోలిశెట్టి ఒంటి చేత్తో లాగించాడు. తన ఇమేజ్ దృష్ట్యా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని తనవైపు తిప్పుకునేలా చేశాడు. దీంతో అనుష్క రాని లోటు జనాలు పెద్దగా ఫీలవ్వలేదు. కానీ ఘాటీలో హీరో విక్రమ్ ప్రభు. తమిళ బాపతు. మనకు కనీస పరిచయం లేదు. గజరాజు లాంటి డబ్బింగ్ సినిమాలతో అప్పుడప్పుడు పలకరిస్తాడు కానీ అవేవి కనీస స్థాయిలో ఆడకపోవడంతో మన ఆడియన్స్ కి రిజిస్టర్ కాలేదు. సో తను వచ్చినా రాకపోయినా పెద్ద తేడా ఉండదు. ఇక దర్శకుడు క్రిష్ తన వంతుగా వీలైనన్ని విశేషాలు పంచుకోవాలి.
జగపతిబాబు, చైతన్య రావు లాంటి ఇతర క్యాస్టింగ్ ఉన్నప్పటికీ వాళ్ళెవరూ అనుష్క రాని లోటుని తీర్చలేరు. సరే ఇవన్నీ ఎలా ఉన్నా సినిమా బాగుంటే ఆటోమేటిక్ గా ఆడేస్తాదనే ధీమా నిర్మాతల్లో ఉండొచ్చు. యువి క్రియేషన్స్ కి ఇది చాలా కీలకమైన మూవీ. పలు వాయిదాల తర్వాత ఇప్పుడు మోక్షం దక్కించుకుంటోంది. విశ్వంభర లాంటి ప్యాన్ ఇండియా సినిమాల పనులు బ్యాలన్స్ ఉన్న నేపథ్యంలో ఘాటీ హిట్టయితే దాని వల్ల రెవిన్యూ మంచి బూస్ట్ గా పనికొస్తుంది. కొండల్లో చేసే గంజాయి బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఘాటీలో అనుష్క మునుపెన్నడూ చేయని వయొలెంట్ షేడ్ లో దర్శనమిస్తుందట.
This post was last modified on August 27, 2025 7:36 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…