Movie News

అనుష్క దర్శనానికి వేళాయెరా

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత దర్శనం లేకుండా పోయిన అనుష్క సెప్టెంబర్ 5 విడుదల కాబోయే ఘాటీ ప్రమోషన్ల కోసం బయటికి వస్తుందని లేటెస్ట్ అప్డేట్. అయితే మీడియాకు నేరుగా కలుసుకుంటుందన్న గ్యారెంటీ లేదు కానీ విడిగా రికార్డు చేసిన ఇంటర్వ్యూలలో కనిపిస్తుందని సమాచారం. ఘాటీ సక్సెస్ తనకు చాలా కీలకం. మొదటిసారి గంజాయి అమ్మే లేడీ డాన్ గా పవర్ ఫుల్ క్యారెక్టర్ చేసింది. గతంలో అరుంధతి లాంటి పాత్రలు చేసినప్పటికీ ఇది స్పెషల్ కానుంది. ఒకరకంగా చెప్పాలంటే పుష్పకు ఫిమేల్ వెర్షన్ లా ఉంటుంది ఈ ఘాటీ. దర్శకుడు క్రిష్ దీని విజయం కోసం బాగా కష్టపడ్డారు.

ఇక బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ పబ్లిసిటీ ఏదో కొత్త సినిమా వస్తుందనే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. స్వయంగా రాజమౌళినే రంగంలోకి దిగబోతున్నారు. అక్టోబర్ లో దీని ప్లానింగ్ ఉంటుంది. రిలీజ్ 31 కాబట్టి దానికి రెండు వారాల ముందు ప్రమోషన్స్ ని పీక్స్ కు తీసుకెళ్తారు. ప్రభాస్, అనుష్క ఒకేసారి కలిసి కెమెరా ముందుకు రాబోతున్నట్టు లీక్ ఉంది. అయితే షూటింగులకు తప్ప కనీసం బయట కనిపించడం మానేసిన అనుష్క లైవ్ లో ఎలా ఉంటుందనే ఎగ్జైట్ మెంట్ అభిమానుల్లో విపరీతంగా ఉంది. ఘాటీకి బిజినెస్ జరుగుతోందంటే దానికి ప్రధాన కారణం ఆమె ఇమేజ్. తర్వాతే క్రిష్ బ్రాండ్.

అనుష్క నటించిన మరో మలయాళ మూవీ కథనర్ సైతం వాయిదాల పర్వంలో ఆలస్యమవుతూ వస్తోంది. ఇది పీరియాడిక్ డ్రామా. పెద్ద బడ్జెట్ తో ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఈ ఏడాది విడుదల చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ నిర్మాతల వైపు నుంచి ఏవో ఆర్థిక చిక్కుల వల్ల లేట్ అవుతోందని మల్లువుడ్ టాక్. ఘాటీ, కథానర్ తర్వాత అనుష్క ఇంకే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఒకరిద్దరు కథలతో ఒప్పించారు కానీ అవి సెట్స్ పైకి వెళ్లలేకపోయాయి. నలభై వచ్చినా స్టిల్ బ్యాచిలర్ గా ఉన్న అనుష్కను నిజ జీవితంలో పెళ్లి కూతురిగా చూడాలనే ఫ్యాన్స్ కోరిక ఎప్పుడు తీరుతుందో.

This post was last modified on August 25, 2025 8:02 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

హిర‌ణ్య క‌శ్య‌ప‌ను వ‌ద‌ల‌ని గుణ‌శేఖర్

హిర‌ణ్య‌క‌శ్య‌ప‌.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చ‌ర్చ‌ల్లో ఉన్న చిత్రం. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తీయాల‌నుకున్న సినిమా…

4 minutes ago

పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…

5 minutes ago

వైసీపీ మాజీ ఎంపీ నుంచే వైసీపీ కార్యకర్తకు బెదిరింపులా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…

3 hours ago

మొదటి దెబ్బ తిన్న టీం ఇండియా

​విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్‌కు న్యూజిలాండ్ షాక్…

6 hours ago

వారి బాధ వర్ణనాతీతం ‘బంగారం’

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…

8 hours ago

తెలంగాణలో మరో కుంభకోణం: హరీష్ రావు

తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…

8 hours ago