పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా సరే ఆఖరికి రాజకీయ సభల్లో కూడా నామస్మరణతో అంచనాలు అమాంతం పెంచేసుకున్న ఓజి విడుదల సంవత్సరాలు, నెలలు నుంచి రోజుల్లోకి వచ్చేసింది. సరిగ్గా ముప్పై రోజుల్లో సెప్టెంబర్ 25న ఓజాస్ గంభీర థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు. ఇంకో నాలుగైదు రోజుల ప్యాచ్ వర్క్ ఉందని, దాని పవన్ హాజరు కావాల్సి ఉంటుందని బయట ప్రచారం జరుగుతున్నప్పటికీ టీమ్ వాటికి స్పందించడం లేదు. దర్శకుడు సుజిత్ ఈ కథనాలను తన సన్నిహితుల దగ్గర కొట్టి పారేస్తున్నాడు. ఆరు నూరైనా వచ్చే తీరతామని, ఎలాంటి పోస్ట్ పోన్ లేదని అంటున్నాడట.
ఇదిలా ఉంచితే ఈ నెల మొత్తం ఓజి రన్ రాజా రన్ అంటూ పరుగులు పెట్టాల్సిందే. వినాయకచవితి రోజు వదలబోయే పాటను కలుపుకుని ఇప్పటిదాకా రెండు సాంగ్స్ వచ్చేసినట్టే. ఇంకా ట్రైలర్ పెండింగ్ ఉంది. కట్ చేయడం మొదలుపెట్టారో లేదో సరైన సమాచారం లేదు. టైం తక్కువ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ ని పరుగులు పెట్టిస్తున్నారు. కొంత భాగానికి ఏఐ టెక్నాలజీ అవసరం పడటంతో ఆ పనుల్లో సుజిత్ తలమునకలై ఉన్నట్టు తెలిసింది. నిర్మాత డివివి దానయ్యకు పెద్ద ఎత్తున అడ్వాన్సులు ఇచ్చేందుకు బయ్యర్లు రెడీగా ఉన్నారు. నైజామ్ తో పాటు మరికొన్ని ఏరియాలు ఇంకా ఫైనల్ చేయలేదని టాక్.
ఎంత బజ్ ఉన్నా సరే పబ్లిసిటీని నిర్లక్ష్యం చేయకూడదు. హరిహర వీరమల్లు స్థాయిలో కాకపోయినా ఉన్నంతలో మంచి ప్రమోషన్లు చేసుకుంటే ఓజికి బయట మార్కెట్లలో మంచి ఓపెనింగ్స్ వస్తాయి. ఎందుకంటే డేట్ సోలో అయిపోయింది. పోటీగా వస్తుందనుకున్న అఖండ 2 తప్పుకోవడం దాదాపు ఖాయం కావడంతో ఓజికి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చేందుకు థియేటర్లు రెడీ అవుతున్నాయి. అబోవ్ యావరేజ్ అనిపించుకున్నా చాలు రికార్డులు బద్దలైపోతాయి. తమన్ సంగీతం మీదున్న ఫ్యాన్స్ మాములు నమ్మకం పెట్టుకోలేదు. సీక్వెల్ గా ఉండదని సింగల్ పార్ట్ గానే ఓజిని సుజిత్ ముగించేస్తాడని విశ్వసనీయ సమాచారం.
This post was last modified on August 25, 2025 11:06 am
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…