పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా సరే ఆఖరికి రాజకీయ సభల్లో కూడా నామస్మరణతో అంచనాలు అమాంతం పెంచేసుకున్న ఓజి విడుదల సంవత్సరాలు, నెలలు నుంచి రోజుల్లోకి వచ్చేసింది. సరిగ్గా ముప్పై రోజుల్లో సెప్టెంబర్ 25న ఓజాస్ గంభీర థియేటర్లలో అడుగు పెట్టబోతున్నాడు. ఇంకో నాలుగైదు రోజుల ప్యాచ్ వర్క్ ఉందని, దాని పవన్ హాజరు కావాల్సి ఉంటుందని బయట ప్రచారం జరుగుతున్నప్పటికీ టీమ్ వాటికి స్పందించడం లేదు. దర్శకుడు సుజిత్ ఈ కథనాలను తన సన్నిహితుల దగ్గర కొట్టి పారేస్తున్నాడు. ఆరు నూరైనా వచ్చే తీరతామని, ఎలాంటి పోస్ట్ పోన్ లేదని అంటున్నాడట.
ఇదిలా ఉంచితే ఈ నెల మొత్తం ఓజి రన్ రాజా రన్ అంటూ పరుగులు పెట్టాల్సిందే. వినాయకచవితి రోజు వదలబోయే పాటను కలుపుకుని ఇప్పటిదాకా రెండు సాంగ్స్ వచ్చేసినట్టే. ఇంకా ట్రైలర్ పెండింగ్ ఉంది. కట్ చేయడం మొదలుపెట్టారో లేదో సరైన సమాచారం లేదు. టైం తక్కువ కావడంతో పోస్ట్ ప్రొడక్షన్ ని పరుగులు పెట్టిస్తున్నారు. కొంత భాగానికి ఏఐ టెక్నాలజీ అవసరం పడటంతో ఆ పనుల్లో సుజిత్ తలమునకలై ఉన్నట్టు తెలిసింది. నిర్మాత డివివి దానయ్యకు పెద్ద ఎత్తున అడ్వాన్సులు ఇచ్చేందుకు బయ్యర్లు రెడీగా ఉన్నారు. నైజామ్ తో పాటు మరికొన్ని ఏరియాలు ఇంకా ఫైనల్ చేయలేదని టాక్.
ఎంత బజ్ ఉన్నా సరే పబ్లిసిటీని నిర్లక్ష్యం చేయకూడదు. హరిహర వీరమల్లు స్థాయిలో కాకపోయినా ఉన్నంతలో మంచి ప్రమోషన్లు చేసుకుంటే ఓజికి బయట మార్కెట్లలో మంచి ఓపెనింగ్స్ వస్తాయి. ఎందుకంటే డేట్ సోలో అయిపోయింది. పోటీగా వస్తుందనుకున్న అఖండ 2 తప్పుకోవడం దాదాపు ఖాయం కావడంతో ఓజికి గ్రాండ్ వెల్కమ్ ఇచ్చేందుకు థియేటర్లు రెడీ అవుతున్నాయి. అబోవ్ యావరేజ్ అనిపించుకున్నా చాలు రికార్డులు బద్దలైపోతాయి. తమన్ సంగీతం మీదున్న ఫ్యాన్స్ మాములు నమ్మకం పెట్టుకోలేదు. సీక్వెల్ గా ఉండదని సింగల్ పార్ట్ గానే ఓజిని సుజిత్ ముగించేస్తాడని విశ్వసనీయ సమాచారం.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన…
సౌత్ ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ ఒకడు. తెలుగు వరకు చూస్తే కొన్నేళ్ల నుంచి అతనే నంబర్ వన్.…