పాతిక రోజుల ముందుగానే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ మొదలుపెట్టుకుంటున్న ఓజి రికార్డుల వేటకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఇంత ముందస్తుగా టికెట్స్ అమ్మడం వల్ల కలిగే లాభమేంటో ఇటీవలే కూలీ నిరూపించింది. బజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలు ప్రీమియర్ల కోసం ఎగబడతారు. అందుకే ఓజి డిస్ట్రిబ్యూటర్ ఈ విషయంలో తెలివిగా వ్యవహారించి ఆగస్ట్ 29 నుంచి టికెట్ సేల్స్ మొదలు పెట్టడం మంచి స్ట్రాటజీ. ఎంతలేదన్నా నార్త్ అమెరికాలో మొదటి షో పడేలోపు కనీసం రెండు మిలియన్ మార్కుని దాటించాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. హైప్ చూస్తుంటే అది నిజమైనా ఆశ్చర్యం లేదు.
ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం మరొకటి ఉంది. ఓజి మీద ఎంత బజ్ ఉన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని అమాంతం పెంచాలి. హరిహర వీరమల్లు డిజాస్టర్ ప్రభావం ఓజి మీద నేరుగా లేకపోయినప్పటికీ బయ్యర్లలో కొంత టెన్షన్ ఉండకపోదు. ఎందుకంటే ఇటీవలి కాలంలో విపరీతమైన అంచనాలు మోసుకొచ్చిన ప్యాన్ ఇండియా మూవీస్ నిరాశపరిచాయి. వార్ 2, కూలి లాంటివి మొదటి వీకెండ్ కావడం ఆలస్యం క్రాష్ అయ్యాయి. అసలే దర్శకుడు సుజిత్ సాహో తర్వాత చాలా గ్యాప్ తర్వాత చేసిన మూవీ ఇది. రెండు సినిమాల అనుభవమే ఉన్నా రాజమౌళి రేంజ్ లో ఫ్యాన్స్ నమ్మకం పెట్టుకున్నారు.
తెలుగు రాష్ట్రాల బిజినెస్ సైతం ఇంకో పది రోజుల్లో కొలిక్కి వచ్చేలా ఉంది. ఏపీ తెలంగాణ బ్రేక్ ఈవెన్ ఎంత లేదన్నా 200 కోట్ల గ్రాస్ ఉండొచ్చని ట్రేడ్ వర్గాల ప్రాధమిక అంచనా. టాక్ బాగుంటే పవన్ కళ్యాణ్ ఊచకోత నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే ఇప్పటిదాకా డబుల్ సెంచరీ మార్క్ అందని ద్రాక్షగా మారిన పవన్ కళ్యాణ్ ఈసారి దాన్ని ఎలాగైనా అందుకోవాలని కంకణం కట్టుకున్నారు. తమన్ కంపోజ్ చేసిన టైటిల్ సాంగ్ కు మంచి స్పందనే వచ్చింది. నెక్స్ట్ రాబోయే మెలోడీ పాట ఏం చేస్తుందో చూడాలి. అన్నింటి కన్నా ముఖ్యంగా ట్రైలర్ కట్ చాలా కీలకం కానుంది. సుజిత్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే.
This post was last modified on August 24, 2025 2:46 pm
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ కెరీర్ మంచి ఊపులో ఉండగానే.. బాలీవుడ్ నిర్మాత జాకీ…
టిడిపి తరఫున బలమైన గళం వినిపించే వారి కోసం పార్టీలో వెతుకుతున్నారు. వివాదరహితంగా పార్టీ పరంగా ప్రజలకు సంక్షేమ పథకాలు…
బాలీవుడ్లో వచ్చిన కల్ట్ బ్లాక్ బస్టర్ విక్కీ డోనర్ చూసిన ప్రేక్షకులు ఎవ్వరూ అందులో డాక్టర్ గా కీలక పాత్ర…
ఆరేళ్ల ముందు కొవిడ్ టైంలో థియేటర్లు మూతపడడంతో.. ఆ ఖాళీని భర్తీ చేయడం కోసం ఒక్కసారిగా ఓటీటీలు విజృంభించేశాయి. ఫిలిం…
వైసీపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్న మోషేన్ రాజుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే అంశంపై…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అదే పార్టీకి చెందిన సీనియర్లు గుర్రుగా ఉన్న నేపథ్యంలో అనేక ఫిర్యాదులు అధిష్టానానికి చేరుతున్నాయి. ముఖ్యంగా…