అన్ని సవ్యంగా అనుకున్న టైం ప్రకారం జరిగి ఉంటే ఈ వారం ఆగస్ట్ 27 మాస్ జాతర థియేటర్లలో ఉండేది. కానీ ఫెడరేషన్ సమ్మె, నిర్మాతకు కింగ్డమ్ ఫెయిల్యూర్ – వార్ 2 డిస్ట్రిబ్యూషన్ వల్ల తలెత్తిన ఇబ్బందులు, ఇలా రకరకాల కారణాల వల్ల వాయిదా వేయాల్సి వచ్చింది. అయితే రవితేజ అభిమానులు సెప్టెంబర్ లో రావొచ్చనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు కానీ పరిస్థితి మాత్రం దానికి అనుకూలంగా లేదట. ప్రస్తుతమున్న సమాచారం మేరకు మాస్ జాతర కొత్త డేట్ అక్టోబర్ 31 కావొచ్చని లేటెస్ట్ అప్డేట్. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారని వినికిడి.
ఇన్ సైడ్ ఇన్ఫో ప్రకారం మాస్ జాతర వర్క్ ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. ఒక పాట చిత్రీకరించాల్సి ఉందట. ఒకవేళ పాత డేట్ కే కట్టుబడి ఉంటే అది లేకుండానే రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఇప్పుడు టైం దొరుకుతుంది కాబట్టి షూట్ చేయొచ్చని అంటున్నారు. అసలు సమస్య మరొకటి ఉంది. మాస్ జాతరకు బజ్ లేదు. టీజర్ మీద రొటీన్ అనే ఫీడ్ బ్యాక్ వచ్చింది. లిరికల్ సాంగ్ లో బూతుల గురించి విమర్శకులు తలంటారు. నిర్మాణంలో ఉన్నప్పటికీ దీని మీద స్పెషల్ ఇంటరెస్ట్ కలిగేలా స్పెషల్ ప్రమోషన్లు చేయలేదు. సో ఇదంతా మార్చాల్సిన పెద్ద బాధ్యత ప్రొడక్షన్ టీమ్ మీద ఉంది.
సెప్టెంబర్ లో వరసగా ఘాటీ, లిటిల్ హార్ట్స్, కాంత, కిష్కిందపురి, మిరాయ్, మదరాసి, భద్రకాళి, ఓజిలు క్యూ కట్టి ఉన్నాయి. అక్టోబర్ మొదటి వారంలో కాంతారా చాప్టర్ 1 ఉంది. వీటితో పోటీకి దిగడం కంటే మాస్ జాతర సోలోగా వస్తేనే ఎక్కువ లాభం ఉంటుంది. అయితే రవితేజ దీని గురించి ఏమనుకుంటున్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూట్ లో బిజీగా ఉన్న మాస్ రాజా దాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలనే టార్గెట్ తో పరుగులు పెట్టిస్తున్నారు. మరి దానికన్నా ముందు వచ్చే మాస్ జాతరకు కనీస గ్యాప్ ఉండటం అవసరం. వీలైనంత త్వరగా డేట్ లాక్ చేయడం మంచిది.
This post was last modified on August 23, 2025 3:44 pm
వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టైంలో రవితేజకు ఇరుముడి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. విజయం ఊహించిందే కానీ మరీ రికార్డులు బద్దలు…
తెలుగు దర్శకుల్లో కొందరు మాత్రమే ఒక జనరేషన్ ని ప్రభావితం చేసే స్థాయిలో సినిమాలు తీస్తారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో…
ఏ పార్టీ అయినా.. తీసుకునే నిర్ణయాలు.. చేసే ప్రకటనల విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. సమయం వచ్చిందనో.. సందర్భం చిక్కిందనో…
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలను పూర్తిస్థాయిలో బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ఎన్నికల సంఘం కూడా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ కుటుంబం సృష్టించిన దుమారం ఇంకా కొనసాగుతుంది. పరకాల సీటు విషయంలో…
సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఆలోచనతో యువత చేస్తున్న కొన్ని ప్రయత్నాలు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. జార్ఖండ్లో రీల్ తీసుకునేందుకు…