మహావతార్ నరసింహ అయిదో వారంలో ఉంది. మాములుగా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఈపాటికి దుకాణం సర్దేయాలి. ఫైనల్ రన్ కు దగ్గరగా వచ్చి ఎప్పుడెప్పుడు సెలవు తీసుకుందామని ఎదురు చూస్తూ ఉండాలి. కానీ ఈ యానిమేటెడ్ మూవీ లెక్క వేరుగా ఉంది. లేటెస్ట్ గా రిలీజైన వార్ 2, కూలీలను దాటేసి బుక్ మై షో ట్రెండింగ్ లో కొనసాగుతూనే ఉండటం షాకింగ్ పరిణామం. మహావతార్ నరసింహకు సగటున గంటకు 6 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతు ఉండగా కూలి 5 వేలకు దగ్గరలో, వార్ టూ 3 వేల పై చిలుకు టికెట్లతో రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. సాయంత్రానికి ఈ వ్యత్యాసం మరింత పెరగనుంది.
ఒకరకంగా చెప్పాలంటే మల్టీస్టారర్స్ కు మహావతార్ పెద్ద గుణపాఠం నేర్పిస్తున్నాడు. థియేటర్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసే కంటెంట్ ఇస్తే ప్రేక్షకులు ఎగబడి చూస్తారని నిరూపిస్తున్నాడు. కొత్త రిలీజు పరదా, స్టాలిన్ లాంటి ఫ్రెష్ రీ రిలీజ్ వచ్చినా సరే వాటి ప్రభావం ఏ మాత్రం పడకపోవడం గమనించాల్సిన విషయం. జీవోల పేరుతో ఇష్టం టికెట్ రేట్లను విపరీతంగా పెంచేసుకున్న వార్ 2, కూలీలు ఆంధ్రలో ఎదురీదాల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ సాధారణ ధరలకే అందుబాటులో ఉన్న మహావతార్ నరసింహకు ఫ్యామిలీస్ కదిలి వస్తున్నాయి. కంటెంట్ తో పాటు రేటు కూడా ప్రభావం చూపిస్తోంది.
ఫైనల్ గా అర్థం చేసుకోవాల్సిన సత్యం ఒకటుంది. ఆడియన్స్ ఎప్పుడూ థియేటర్లకు వచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. వర్షాలు, ఓటిటిలు కేవలం మనం వెతికే సాకులు మాత్రమే. నిజంగా కంటెంట్ బాగుంటే ఎంత దూరమైనా ఎంత రిస్క్ అయినా టికెట్లు కొని మరీ సినిమాలు చూస్తారు. ఇప్పుడేదో మహావతార్ ఆడింది కాబట్టి ఇకపై అందరూ యానిమేటెడ్ మూవీస్ తీస్తే దెబ్బ తినక తప్పదు. ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. విఎఫ్ఎక్స్ లో క్వాలిటీ ఉండాలి. అన్నింటిని మించి జనాలకు ఏం కావాలో దర్శకులు గుర్తించాలి. లేదంటే ఇలాంటి గుణపాఠాలు ఎన్ని నేర్చుకున్నా ఫలితం దక్కదు. నీడ్ అఫ్ ది హవర్ అంటే ఇదే.
This post was last modified on August 23, 2025 11:17 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…