మహావతార్ నరసింహ అయిదో వారంలో ఉంది. మాములుగా ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ఈపాటికి దుకాణం సర్దేయాలి. ఫైనల్ రన్ కు దగ్గరగా వచ్చి ఎప్పుడెప్పుడు సెలవు తీసుకుందామని ఎదురు చూస్తూ ఉండాలి. కానీ ఈ యానిమేటెడ్ మూవీ లెక్క వేరుగా ఉంది. లేటెస్ట్ గా రిలీజైన వార్ 2, కూలీలను దాటేసి బుక్ మై షో ట్రెండింగ్ లో కొనసాగుతూనే ఉండటం షాకింగ్ పరిణామం. మహావతార్ నరసింహకు సగటున గంటకు 6 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతు ఉండగా కూలి 5 వేలకు దగ్గరలో, వార్ టూ 3 వేల పై చిలుకు టికెట్లతో రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. సాయంత్రానికి ఈ వ్యత్యాసం మరింత పెరగనుంది.
ఒకరకంగా చెప్పాలంటే మల్టీస్టారర్స్ కు మహావతార్ పెద్ద గుణపాఠం నేర్పిస్తున్నాడు. థియేటర్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసే కంటెంట్ ఇస్తే ప్రేక్షకులు ఎగబడి చూస్తారని నిరూపిస్తున్నాడు. కొత్త రిలీజు పరదా, స్టాలిన్ లాంటి ఫ్రెష్ రీ రిలీజ్ వచ్చినా సరే వాటి ప్రభావం ఏ మాత్రం పడకపోవడం గమనించాల్సిన విషయం. జీవోల పేరుతో ఇష్టం టికెట్ రేట్లను విపరీతంగా పెంచేసుకున్న వార్ 2, కూలీలు ఆంధ్రలో ఎదురీదాల్సిన పరిస్థితి తలెత్తింది. కానీ సాధారణ ధరలకే అందుబాటులో ఉన్న మహావతార్ నరసింహకు ఫ్యామిలీస్ కదిలి వస్తున్నాయి. కంటెంట్ తో పాటు రేటు కూడా ప్రభావం చూపిస్తోంది.
ఫైనల్ గా అర్థం చేసుకోవాల్సిన సత్యం ఒకటుంది. ఆడియన్స్ ఎప్పుడూ థియేటర్లకు వచ్చేందుకు సిద్ధంగా ఉంటారు. వర్షాలు, ఓటిటిలు కేవలం మనం వెతికే సాకులు మాత్రమే. నిజంగా కంటెంట్ బాగుంటే ఎంత దూరమైనా ఎంత రిస్క్ అయినా టికెట్లు కొని మరీ సినిమాలు చూస్తారు. ఇప్పుడేదో మహావతార్ ఆడింది కాబట్టి ఇకపై అందరూ యానిమేటెడ్ మూవీస్ తీస్తే దెబ్బ తినక తప్పదు. ఎమోషన్ కనెక్ట్ అవ్వాలి. విఎఫ్ఎక్స్ లో క్వాలిటీ ఉండాలి. అన్నింటిని మించి జనాలకు ఏం కావాలో దర్శకులు గుర్తించాలి. లేదంటే ఇలాంటి గుణపాఠాలు ఎన్ని నేర్చుకున్నా ఫలితం దక్కదు. నీడ్ అఫ్ ది హవర్ అంటే ఇదే.
This post was last modified on August 23, 2025 11:17 am
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…