కనీసం యావరేజ్ అయినా సంతోషించే వాళ్ళు కానీ వార్ 2 డిజాస్టర్ కావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా టెంపర్ నుంచి కాపాడుకుంటూ వస్తున్న సక్సెస్ ట్రాక్ ని ఈ సినిమా బ్రేక్ చేయడం డైజెస్ట్ కావడం లేదు. వరస హిట్లతో పదేళ్లకు పైగా ఫ్లాప్ లేకుండా నడిచిన జూనియర్ ఎన్టీఆర్ స్పీడ్ కు ఇది పెద్ద అడ్డంకిగా నిలిచిపోయింది. అయితే వార్ 2 ఇద్దరు హీరోల్లో ఎవరికి ఎక్కువ నష్టం జరిగిందంటే నిస్సందేహంగా హృతిక్ రోషన్ కే అని చెప్పొచ్చు. ఎందుకంటే తను వేగంగా సినిమాలు చేయడం మానేశాడు. గత పది సంవత్సరాల్లో అతను చేసింది కేవలం ఏడు సినిమాలు మాత్రమే.
వాటిలో మూడు సూపర్ ఫ్లాపులు ఉన్నాయి. నెక్స్ట్ లైనప్ లో పెట్టుకున్న క్రిష్ 4కి ఎంత లేదన్నా రెండేళ్లకు పైగానే టైం పట్టేలా ఉంది. ఒకవేళ వార్ 2 బ్లాక్ బస్టర్ అయ్యుంటే క్రిష్ 4 బిజినెస్ కి చాలా హెల్ప్ అయ్యేది. కానీ ఇప్పుడు దర్శక నిర్మాత రాకేష్ రోషన్ కు నిధులు సమీకరించడం పెద్ద సవాల్ గా మారుతుంది. ఎందుకంటే మార్కెట్ కోణంలో చూసుకుంటే హృతిక్ గత సినిమాల్లో ఫైటర్ జస్ట్ హిట్ అనిపించుకోగా, విక్రమ్ వేదా దారుణంగా పోయింది. పెట్టుబడిదారులు తన విషయంలో చాలా క్యాలికులేటెడ్ గా ఉన్నారు. సో క్రిష్ 4 ఆశించిన వందల కోట్ల బడ్జెట్ మీద అనుమానాలు ముసురుకుంటాయి.
జూనియర్ ఎన్టీఆర్ వైపు చూస్తే వార్ 2 పరాజయం చిన్న డెంట్ లాంటిది. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే ప్రశాంత్ నీల్ మూవీకి సరిపడా బజ్ షూటింగ్ స్టేజి నుంచే వచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే ఫాంటసీ మూవీ గురించి నిర్మాత నాగవంశీ ఇస్తున్న హింట్లు అంచనాలను ఎక్కడికో తీసుకెళుతున్నాయి. జైలర్ 2 తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని తారక్ కోసం లాక్ చేయబోతున్నాడు. వీటికన్నా ముందు, నీల్ సినిమా తర్వాత దేవర 2కి సరిపడా ప్లానింగ్ తో కొరటాల శివ సిద్ధంగా ఉన్నారు. వార్ 2 వల్ల బాలీవుడ్ మార్కెట్ కోసం ట్రై చేయడం వృథా ప్రయాసని జూనియర్ ఎన్టీఆర్ కు అర్థమైపోయి ఉంటుంది.
This post was last modified on August 22, 2025 6:27 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…