కనీసం యావరేజ్ అయినా సంతోషించే వాళ్ళు కానీ వార్ 2 డిజాస్టర్ కావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా టెంపర్ నుంచి కాపాడుకుంటూ వస్తున్న సక్సెస్ ట్రాక్ ని ఈ సినిమా బ్రేక్ చేయడం డైజెస్ట్ కావడం లేదు. వరస హిట్లతో పదేళ్లకు పైగా ఫ్లాప్ లేకుండా నడిచిన జూనియర్ ఎన్టీఆర్ స్పీడ్ కు ఇది పెద్ద అడ్డంకిగా నిలిచిపోయింది. అయితే వార్ 2 ఇద్దరు హీరోల్లో ఎవరికి ఎక్కువ నష్టం జరిగిందంటే నిస్సందేహంగా హృతిక్ రోషన్ కే అని చెప్పొచ్చు. ఎందుకంటే తను వేగంగా సినిమాలు చేయడం మానేశాడు. గత పది సంవత్సరాల్లో అతను చేసింది కేవలం ఏడు సినిమాలు మాత్రమే.
వాటిలో మూడు సూపర్ ఫ్లాపులు ఉన్నాయి. నెక్స్ట్ లైనప్ లో పెట్టుకున్న క్రిష్ 4కి ఎంత లేదన్నా రెండేళ్లకు పైగానే టైం పట్టేలా ఉంది. ఒకవేళ వార్ 2 బ్లాక్ బస్టర్ అయ్యుంటే క్రిష్ 4 బిజినెస్ కి చాలా హెల్ప్ అయ్యేది. కానీ ఇప్పుడు దర్శక నిర్మాత రాకేష్ రోషన్ కు నిధులు సమీకరించడం పెద్ద సవాల్ గా మారుతుంది. ఎందుకంటే మార్కెట్ కోణంలో చూసుకుంటే హృతిక్ గత సినిమాల్లో ఫైటర్ జస్ట్ హిట్ అనిపించుకోగా, విక్రమ్ వేదా దారుణంగా పోయింది. పెట్టుబడిదారులు తన విషయంలో చాలా క్యాలికులేటెడ్ గా ఉన్నారు. సో క్రిష్ 4 ఆశించిన వందల కోట్ల బడ్జెట్ మీద అనుమానాలు ముసురుకుంటాయి.
జూనియర్ ఎన్టీఆర్ వైపు చూస్తే వార్ 2 పరాజయం చిన్న డెంట్ లాంటిది. ఎందుకంటే నెక్స్ట్ రాబోయే ప్రశాంత్ నీల్ మూవీకి సరిపడా బజ్ షూటింగ్ స్టేజి నుంచే వచ్చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోయే ఫాంటసీ మూవీ గురించి నిర్మాత నాగవంశీ ఇస్తున్న హింట్లు అంచనాలను ఎక్కడికో తీసుకెళుతున్నాయి. జైలర్ 2 తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ ని తారక్ కోసం లాక్ చేయబోతున్నాడు. వీటికన్నా ముందు, నీల్ సినిమా తర్వాత దేవర 2కి సరిపడా ప్లానింగ్ తో కొరటాల శివ సిద్ధంగా ఉన్నారు. వార్ 2 వల్ల బాలీవుడ్ మార్కెట్ కోసం ట్రై చేయడం వృథా ప్రయాసని జూనియర్ ఎన్టీఆర్ కు అర్థమైపోయి ఉంటుంది.
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…
పెద్దిని ప్యాన్ ఇండియా స్థాయిలో ప్రమోట్ చేసే ఉద్దేశంతో భోపాల్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్, ముంబైలో ట్రైలర్…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా…
తెలంగాణలో జనసేన అస్థిత్వంపై అనేక విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే. అనేక ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించడం..ఆ తర్వాత…
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై భూకబ్జా ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోని శంకర్పల్లి…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉండే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా ఐమాక్స్ స్క్రీన్ లేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. గతంలో…