ఒకే హీరో రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం చాలా అరుదు. అందులోనూ మార్కెట్ రిస్కులు పెరిగిపోతున్న ట్రెండ్ లో అలాంటి సాహసానికి ఎవరూ ఒడిగట్టరు. లవ్ టుడేతో యూత్ సెన్సేషన్ గా మారిన ప్రదీప్ రంగనాధన్ కు ఈ అనుభవం ఎదురయ్యేలా ఉంది. చెన్నై రిపోర్ట్స్ ప్రకారం అతని కొత్త మూవీస్ లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, డ్యూడ్ అక్టోబర్ 17 విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయట. ఒకవేళ సేమ్ డేట్ అయినా కాకపోయినా చాలా తక్కువ గ్యాప్ ఉంటుందనే గుసగుస చెన్నై వర్గాల్లో వినిపిస్తోంది. ఇది ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి అరుదైన ఫీట్ ఇప్పుడున్న స్టార్లలో ఇద్దరికీ జరిగింది.
మొదటి హీరో నందమూరి బాలకృష్ణ. 1993 సెప్టెంబర్ 3 బంగారు బుల్లోడు, నిప్పురవ్వ ఒకే రోజు క్లాష్ అయ్యాయి. నిజానికి నిర్మాతలకు ఇష్టం లేకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల వేరే ఆప్షన్ లేక ఇలా చేశారు. వీటిలో మొదటిది సూపర్ హిట్ కాగా రెండోది అంచనాలు అందుకోలేకపోయింది. విడిగా వచ్చి ఉంటే నిప్పురవ్వ కొంచెం బెటర్ గా ఆడేదని ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటూ ఉంటారు. 2015 మార్చి 21 న్యాచురల్ స్టార్ నాని ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు పరస్పరం తలపడ్డాయి. బాలయ్య లాగే నానికి కూడా అదే ఫలితం రిపీట్ అయ్యింది. మీడియాలో ఈ సెల్ఫ్ క్లాష్ మీద రకరకాల కథనాలొచ్చాయి.
ఇప్పుడు ప్రదీప్ రంగనాధన్ దీన్ని ఎలా రిపీట్ చేస్తాడో చూడాలి. దీపావళి పండగ కోలీవుడ్ కు కీలకం కావడంతో ఇద్దరు ప్రొడ్యూసర్లు మేమంటే మేమని పోటీ పడుతున్నారు. లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. డ్యూడ్ నిర్మిస్తున్నది మైత్రి మూవీ మేకర్స్. ఇందులో మంచి గ్లామర్ కోటింగ్ ఉంది. కీర్తీశ్వరన్ దర్శకుడు. మరి ప్రదీప్ తనతో తనే తలపడతాడా లేక ఎవరినో ఒకరిని ఒప్పించి వెనక్కు తగ్గేలా చూస్తాడా అనేది వేచి చూడాలి. ఒకవేళ క్లాష్ నిజమే అయితే మాత్రం బాలయ్య,నాని సరసన నిలుస్తాడు.
This post was last modified on August 22, 2025 10:36 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…