ఒకే హీరో రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం చాలా అరుదు. అందులోనూ మార్కెట్ రిస్కులు పెరిగిపోతున్న ట్రెండ్ లో అలాంటి సాహసానికి ఎవరూ ఒడిగట్టరు. లవ్ టుడేతో యూత్ సెన్సేషన్ గా మారిన ప్రదీప్ రంగనాధన్ కు ఈ అనుభవం ఎదురయ్యేలా ఉంది. చెన్నై రిపోర్ట్స్ ప్రకారం అతని కొత్త మూవీస్ లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, డ్యూడ్ అక్టోబర్ 17 విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయట. ఒకవేళ సేమ్ డేట్ అయినా కాకపోయినా చాలా తక్కువ గ్యాప్ ఉంటుందనే గుసగుస చెన్నై వర్గాల్లో వినిపిస్తోంది. ఇది ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి అరుదైన ఫీట్ ఇప్పుడున్న స్టార్లలో ఇద్దరికీ జరిగింది.
మొదటి హీరో నందమూరి బాలకృష్ణ. 1993 సెప్టెంబర్ 3 బంగారు బుల్లోడు, నిప్పురవ్వ ఒకే రోజు క్లాష్ అయ్యాయి. నిజానికి నిర్మాతలకు ఇష్టం లేకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల వేరే ఆప్షన్ లేక ఇలా చేశారు. వీటిలో మొదటిది సూపర్ హిట్ కాగా రెండోది అంచనాలు అందుకోలేకపోయింది. విడిగా వచ్చి ఉంటే నిప్పురవ్వ కొంచెం బెటర్ గా ఆడేదని ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటూ ఉంటారు. 2015 మార్చి 21 న్యాచురల్ స్టార్ నాని ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు పరస్పరం తలపడ్డాయి. బాలయ్య లాగే నానికి కూడా అదే ఫలితం రిపీట్ అయ్యింది. మీడియాలో ఈ సెల్ఫ్ క్లాష్ మీద రకరకాల కథనాలొచ్చాయి.
ఇప్పుడు ప్రదీప్ రంగనాధన్ దీన్ని ఎలా రిపీట్ చేస్తాడో చూడాలి. దీపావళి పండగ కోలీవుడ్ కు కీలకం కావడంతో ఇద్దరు ప్రొడ్యూసర్లు మేమంటే మేమని పోటీ పడుతున్నారు. లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. డ్యూడ్ నిర్మిస్తున్నది మైత్రి మూవీ మేకర్స్. ఇందులో మంచి గ్లామర్ కోటింగ్ ఉంది. కీర్తీశ్వరన్ దర్శకుడు. మరి ప్రదీప్ తనతో తనే తలపడతాడా లేక ఎవరినో ఒకరిని ఒప్పించి వెనక్కు తగ్గేలా చూస్తాడా అనేది వేచి చూడాలి. ఒకవేళ క్లాష్ నిజమే అయితే మాత్రం బాలయ్య,నాని సరసన నిలుస్తాడు.
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…