ఒకే హీరో రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం చాలా అరుదు. అందులోనూ మార్కెట్ రిస్కులు పెరిగిపోతున్న ట్రెండ్ లో అలాంటి సాహసానికి ఎవరూ ఒడిగట్టరు. లవ్ టుడేతో యూత్ సెన్సేషన్ గా మారిన ప్రదీప్ రంగనాధన్ కు ఈ అనుభవం ఎదురయ్యేలా ఉంది. చెన్నై రిపోర్ట్స్ ప్రకారం అతని కొత్త మూవీస్ లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, డ్యూడ్ అక్టోబర్ 17 విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నాయట. ఒకవేళ సేమ్ డేట్ అయినా కాకపోయినా చాలా తక్కువ గ్యాప్ ఉంటుందనే గుసగుస చెన్నై వర్గాల్లో వినిపిస్తోంది. ఇది ఫ్యాన్స్ కి ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి అరుదైన ఫీట్ ఇప్పుడున్న స్టార్లలో ఇద్దరికీ జరిగింది.
మొదటి హీరో నందమూరి బాలకృష్ణ. 1993 సెప్టెంబర్ 3 బంగారు బుల్లోడు, నిప్పురవ్వ ఒకే రోజు క్లాష్ అయ్యాయి. నిజానికి నిర్మాతలకు ఇష్టం లేకపోయినా పరిస్థితుల ప్రభావం వల్ల వేరే ఆప్షన్ లేక ఇలా చేశారు. వీటిలో మొదటిది సూపర్ హిట్ కాగా రెండోది అంచనాలు అందుకోలేకపోయింది. విడిగా వచ్చి ఉంటే నిప్పురవ్వ కొంచెం బెటర్ గా ఆడేదని ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటూ ఉంటారు. 2015 మార్చి 21 న్యాచురల్ స్టార్ నాని ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు పరస్పరం తలపడ్డాయి. బాలయ్య లాగే నానికి కూడా అదే ఫలితం రిపీట్ అయ్యింది. మీడియాలో ఈ సెల్ఫ్ క్లాష్ మీద రకరకాల కథనాలొచ్చాయి.
ఇప్పుడు ప్రదీప్ రంగనాధన్ దీన్ని ఎలా రిపీట్ చేస్తాడో చూడాలి. దీపావళి పండగ కోలీవుడ్ కు కీలకం కావడంతో ఇద్దరు ప్రొడ్యూసర్లు మేమంటే మేమని పోటీ పడుతున్నారు. లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ చాలా కాలంగా నిర్మాణంలో ఉంది. నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. డ్యూడ్ నిర్మిస్తున్నది మైత్రి మూవీ మేకర్స్. ఇందులో మంచి గ్లామర్ కోటింగ్ ఉంది. కీర్తీశ్వరన్ దర్శకుడు. మరి ప్రదీప్ తనతో తనే తలపడతాడా లేక ఎవరినో ఒకరిని ఒప్పించి వెనక్కు తగ్గేలా చూస్తాడా అనేది వేచి చూడాలి. ఒకవేళ క్లాష్ నిజమే అయితే మాత్రం బాలయ్య,నాని సరసన నిలుస్తాడు.
This post was last modified on August 22, 2025 10:36 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…