ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజైన రెండు భారీ చిత్రాల్లో ‘కూలీ’ స్పష్టమైన పైచేయి సాధించింది. అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే ‘వార్-2’ మీద ఈ చిత్రం ఆధిపత్యం చలాయించింది. ఇక రిలీజ్ రోజు, తొలి వీకెండ్లో కూడా ‘కూలీ’ డామినేషనే చూశాం. అలా అని ఆ సినిమాకు గొప్ప టాకేమీ రాలేదు. కానీ ‘వార్-2’తో పోలిస్తే కొంచెం బెటర్ అని మాత్రమే అన్నారు అందరూ. కానీ టాక్తో సంబంధం లేకుండా ఈ చిత్రం వసూళ్ల మోత మోగించింది. ఆ ఊపు చూస్తే ‘కూలీ’ బయ్యర్లందరినీ సేఫ్ జోన్లోకి తెచ్చేస్తుందని, లాభాలు కూడా వస్తాయని అనుకున్నారంతా. కానీ ‘కూలీ’ ఊపంతా వీకెండ్ వరకే పరిమితమైంది.
సోమవారం నుంచి డ్రాప్ ఊహించిందే కానీ.. అది అంచనాలను దాటిపోయింది. ఒకేసారి ఆక్యుపెన్సీలు 10-15 శాతానికి పడిపోయాయి. ఆదివారం హౌస్ ఫుల్స్తో రన్ అయిన సినిమా కాస్తా.. తర్వాత రోజుకు ఖాళీ థియేటర్లతో దర్శనమిచ్చింది. తెలుగు, తమిళం, హిందీ అని తేడా లేకుండా అన్ని భాషల్లోనూ ‘కూలీ’ కలెక్షన్లు బాగా డ్రాప్ అయిపోయాయి. యుఎస్లో సైతం సినిమా జోరు తగ్గిపోయింది.
ఆదివారం వరల్డ్ వైడ్ రూ.60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సినిమా.. ఇప్పుడు రోజుకు పది కోట్లు రాబట్టడానికి కూడా కష్టపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే షేర్ మరీ నామమాత్రంగా మారింది. మంచి లాభాలు వస్తాయని ఆశించిన బయ్యర్లు.. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అయితే చాలనుకుంటున్నారు. కొన్ని చోట్ల స్వల్ప నష్టాలు కూడా తప్పేలా లేవు. ఇక ‘వార్-2’ సినిమా అయితే తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా చల్లబడిపోయింది. కానీ హిందీలో మాత్రం ఓ మోస్తరుగా వసూళ్లు వస్తున్నాయి. ఓవరాల్ వసూళ్లలో ప్రస్తుతం ‘కూలీ’పై ‘వార్-2’నే కాస్త పైచేయి సాధిస్తోంది. ఈ వీకెండ్లో పెద్ద సినిమాలేవీ లేకపోవడం వల్ల రెండు చిత్రాలూ కాస్త పుంజుకుంటాయని ఆశిస్తున్నారు.
This post was last modified on August 21, 2025 2:28 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…