ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజైన రెండు భారీ చిత్రాల్లో ‘కూలీ’ స్పష్టమైన పైచేయి సాధించింది. అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే ‘వార్-2’ మీద ఈ చిత్రం ఆధిపత్యం చలాయించింది. ఇక రిలీజ్ రోజు, తొలి వీకెండ్లో కూడా ‘కూలీ’ డామినేషనే చూశాం. అలా అని ఆ సినిమాకు గొప్ప టాకేమీ రాలేదు. కానీ ‘వార్-2’తో పోలిస్తే కొంచెం బెటర్ అని మాత్రమే అన్నారు అందరూ. కానీ టాక్తో సంబంధం లేకుండా ఈ చిత్రం వసూళ్ల మోత మోగించింది. ఆ ఊపు చూస్తే ‘కూలీ’ బయ్యర్లందరినీ సేఫ్ జోన్లోకి తెచ్చేస్తుందని, లాభాలు కూడా వస్తాయని అనుకున్నారంతా. కానీ ‘కూలీ’ ఊపంతా వీకెండ్ వరకే పరిమితమైంది.
సోమవారం నుంచి డ్రాప్ ఊహించిందే కానీ.. అది అంచనాలను దాటిపోయింది. ఒకేసారి ఆక్యుపెన్సీలు 10-15 శాతానికి పడిపోయాయి. ఆదివారం హౌస్ ఫుల్స్తో రన్ అయిన సినిమా కాస్తా.. తర్వాత రోజుకు ఖాళీ థియేటర్లతో దర్శనమిచ్చింది. తెలుగు, తమిళం, హిందీ అని తేడా లేకుండా అన్ని భాషల్లోనూ ‘కూలీ’ కలెక్షన్లు బాగా డ్రాప్ అయిపోయాయి. యుఎస్లో సైతం సినిమా జోరు తగ్గిపోయింది.
ఆదివారం వరల్డ్ వైడ్ రూ.60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సినిమా.. ఇప్పుడు రోజుకు పది కోట్లు రాబట్టడానికి కూడా కష్టపడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే షేర్ మరీ నామమాత్రంగా మారింది. మంచి లాభాలు వస్తాయని ఆశించిన బయ్యర్లు.. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అయితే చాలనుకుంటున్నారు. కొన్ని చోట్ల స్వల్ప నష్టాలు కూడా తప్పేలా లేవు. ఇక ‘వార్-2’ సినిమా అయితే తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా చల్లబడిపోయింది. కానీ హిందీలో మాత్రం ఓ మోస్తరుగా వసూళ్లు వస్తున్నాయి. ఓవరాల్ వసూళ్లలో ప్రస్తుతం ‘కూలీ’పై ‘వార్-2’నే కాస్త పైచేయి సాధిస్తోంది. ఈ వీకెండ్లో పెద్ద సినిమాలేవీ లేకపోవడం వల్ల రెండు చిత్రాలూ కాస్త పుంజుకుంటాయని ఆశిస్తున్నారు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…