అధికారికంగా విశ్వంభర వాయిదా గురించి స్వయంగా చిరంజీవే చెప్పేశారు. 2026 వేసవిలో రిలీజ్ చేస్తామని రెండు నిమిషాల ప్రత్యేక వీడియోలో అనౌన్స్ మెంట్ ఇచ్చారు. సాయంత్రం రాబోయే టీజర్ గురించి ఊరించారు. విఎఫ్ఎక్స్ క్వాలిటీలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేస్తున్నామని, గొప్ప అనుభూతి ఇచ్చేందుకు ఈ మాత్రం సమయం అవసరమవుతుందని వివరించారు. దీంతో అక్టోబర్, డిసెంబర్ అంటూ జరుగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టినట్టయ్యింది. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ డ్రామాలో త్రిష హీరోయిన్ కాగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
చిరంజీవి కెరీర్ లో చాలా జాప్యం జరిగి విడుదల తేదీలు ఎక్కువగా మారిన సినిమా 2004లో వచ్చిన అంజి. సుమారు ఆరేళ్ళు నిర్మాణంలో ఉండి థియేటర్లకు రావడానికి అష్టకష్టాలు పడింది. కారణం గ్రాఫిక్స్ విషయంలో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకుడు కోడి రామకృష్ణ రాజీ పడకపోవడమే. రిలీజ్ నాటికి అంచనాలు విపరీతంగా పెరిగిపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. అయినా సరే విఎఫ్ఎక్స్ అద్భుతం అనిపించే సీన్స్ ఇందులో చాలా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే శివలింగం ఎపిసోడ్ ఈ రోజు చూసినా గూస్ బంప్స్ అనిపించే రేంజ్ లో గొప్ప ఫీలింగ్ కలిగిస్తుంది.
ఇప్పుడు విశ్వంభర కూడా ఇదే బాటలో వెళ్తోంది. గత ఏడాది టీజర్ చేసిన డ్యామేజ్, లిరికల్ సాంగ్ కు ఆశించిన స్పందన రాకపోవడం లాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వశిష్ఠ బృందం పోస్ట్ ప్రొడక్షన్ మీద ఎక్కుడ దృష్టి పెడుతోంది. దీని బడ్జెట్ రికవరీ కావాలంటే థియేటర్ రెవెన్యూతో పాటు ఓటిటిలాంటి ఇతర హక్కులకు సంబంధించిన రేట్లు పెద్ద ఎత్తున రావాలి. ప్రస్తుతానికి అవేవి ఇంకా జరగలేదు. చర్చల దశలోనే ఉన్నాయి. ఇవాళ వచ్చే టీజర్ కనక అన్ని వర్గాలను సంతృప్తి పరిస్తే అప్పుడు వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు ఊపందుకుంటాయి. చూడాలి వశిష్ఠ ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడో.
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…