Movie News

అంజిని గుర్తుకు తెస్తున్న విశ్వంభర

అధికారికంగా విశ్వంభర వాయిదా గురించి స్వయంగా చిరంజీవే చెప్పేశారు. 2026 వేసవిలో రిలీజ్ చేస్తామని రెండు నిమిషాల ప్రత్యేక వీడియోలో అనౌన్స్ మెంట్ ఇచ్చారు. సాయంత్రం రాబోయే టీజర్ గురించి ఊరించారు. విఎఫ్ఎక్స్ క్వాలిటీలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేస్తున్నామని, గొప్ప అనుభూతి ఇచ్చేందుకు ఈ మాత్రం సమయం అవసరమవుతుందని వివరించారు. దీంతో అక్టోబర్, డిసెంబర్ అంటూ జరుగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టినట్టయ్యింది. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ డ్రామాలో త్రిష హీరోయిన్ కాగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.

చిరంజీవి కెరీర్ లో చాలా జాప్యం జరిగి విడుదల తేదీలు ఎక్కువగా మారిన సినిమా 2004లో వచ్చిన అంజి. సుమారు ఆరేళ్ళు నిర్మాణంలో ఉండి థియేటర్లకు రావడానికి అష్టకష్టాలు పడింది. కారణం గ్రాఫిక్స్ విషయంలో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకుడు కోడి రామకృష్ణ రాజీ పడకపోవడమే. రిలీజ్ నాటికి అంచనాలు విపరీతంగా పెరిగిపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. అయినా సరే విఎఫ్ఎక్స్ అద్భుతం అనిపించే సీన్స్ ఇందులో చాలా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే శివలింగం ఎపిసోడ్ ఈ రోజు చూసినా గూస్ బంప్స్ అనిపించే రేంజ్ లో గొప్ప ఫీలింగ్ కలిగిస్తుంది.

ఇప్పుడు విశ్వంభర కూడా ఇదే బాటలో వెళ్తోంది. గత ఏడాది టీజర్ చేసిన డ్యామేజ్, లిరికల్ సాంగ్ కు ఆశించిన స్పందన రాకపోవడం లాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వశిష్ఠ బృందం పోస్ట్ ప్రొడక్షన్ మీద ఎక్కుడ దృష్టి పెడుతోంది. దీని బడ్జెట్ రికవరీ కావాలంటే థియేటర్ రెవెన్యూతో పాటు ఓటిటిలాంటి ఇతర హక్కులకు సంబంధించిన రేట్లు పెద్ద ఎత్తున రావాలి. ప్రస్తుతానికి అవేవి ఇంకా జరగలేదు. చర్చల దశలోనే ఉన్నాయి. ఇవాళ వచ్చే టీజర్ కనక అన్ని వర్గాలను సంతృప్తి పరిస్తే అప్పుడు వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు ఊపందుకుంటాయి. చూడాలి వశిష్ఠ ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడో.

This post was last modified on August 21, 2025 10:34 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

1 hour ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

1 hour ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

2 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

10 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

11 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

11 hours ago