Movie News

అంజిని గుర్తుకు తెస్తున్న విశ్వంభర

అధికారికంగా విశ్వంభర వాయిదా గురించి స్వయంగా చిరంజీవే చెప్పేశారు. 2026 వేసవిలో రిలీజ్ చేస్తామని రెండు నిమిషాల ప్రత్యేక వీడియోలో అనౌన్స్ మెంట్ ఇచ్చారు. సాయంత్రం రాబోయే టీజర్ గురించి ఊరించారు. విఎఫ్ఎక్స్ క్వాలిటీలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేస్తున్నామని, గొప్ప అనుభూతి ఇచ్చేందుకు ఈ మాత్రం సమయం అవసరమవుతుందని వివరించారు. దీంతో అక్టోబర్, డిసెంబర్ అంటూ జరుగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టినట్టయ్యింది. వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫాంటసీ డ్రామాలో త్రిష హీరోయిన్ కాగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.

చిరంజీవి కెరీర్ లో చాలా జాప్యం జరిగి విడుదల తేదీలు ఎక్కువగా మారిన సినిమా 2004లో వచ్చిన అంజి. సుమారు ఆరేళ్ళు నిర్మాణంలో ఉండి థియేటర్లకు రావడానికి అష్టకష్టాలు పడింది. కారణం గ్రాఫిక్స్ విషయంలో నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకుడు కోడి రామకృష్ణ రాజీ పడకపోవడమే. రిలీజ్ నాటికి అంచనాలు విపరీతంగా పెరిగిపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేదు. అయినా సరే విఎఫ్ఎక్స్ అద్భుతం అనిపించే సీన్స్ ఇందులో చాలా ఉంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో వచ్చే శివలింగం ఎపిసోడ్ ఈ రోజు చూసినా గూస్ బంప్స్ అనిపించే రేంజ్ లో గొప్ప ఫీలింగ్ కలిగిస్తుంది.

ఇప్పుడు విశ్వంభర కూడా ఇదే బాటలో వెళ్తోంది. గత ఏడాది టీజర్ చేసిన డ్యామేజ్, లిరికల్ సాంగ్ కు ఆశించిన స్పందన రాకపోవడం లాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని వశిష్ఠ బృందం పోస్ట్ ప్రొడక్షన్ మీద ఎక్కుడ దృష్టి పెడుతోంది. దీని బడ్జెట్ రికవరీ కావాలంటే థియేటర్ రెవెన్యూతో పాటు ఓటిటిలాంటి ఇతర హక్కులకు సంబంధించిన రేట్లు పెద్ద ఎత్తున రావాలి. ప్రస్తుతానికి అవేవి ఇంకా జరగలేదు. చర్చల దశలోనే ఉన్నాయి. ఇవాళ వచ్చే టీజర్ కనక అన్ని వర్గాలను సంతృప్తి పరిస్తే అప్పుడు వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు ఊపందుకుంటాయి. చూడాలి వశిష్ఠ ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడో.

This post was last modified on August 21, 2025 10:34 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago