మనుషులు అవసరం లేకుండా కేవలం ఒక ఆఫీస్ సెటప్, స్టాఫ్, కంప్యూటర్లు ఉంటే చాలు ఇకపై సినిమాలు తీయడం సులభమనిపించే రీతిలో కొందరు ఏఐ టెక్నాలజీని వాడుతుండటం ఆందోళనకు దారి తీస్తోంది. ఇటీవలే బాలీవుడ్ లో పురాణాలు ఇతిహాసాలను ఆధారంగా చేసుకుని కృత్రిమ మేధస్సుతో ప్యాన్ ఇండియా మూవీస్ తీయబోతున్నట్టు ప్రకటనలు వచ్చాయి. వాటిలో ఒకటి రామాయణం కాగా రెండోది చిరంజీవి హనుమాన్. మహావతార్ లాగా యానిమేషన్, విఎఫ్ఎక్స్ కాకుండా పూర్తిగా ఏఐ మాడ్యూల్ లో వీటిని తీస్తారట. సాఫ్ట్ వేర్లు, టూల్స్ ని అత్యధిక స్థాయికి వాడబోతున్నారు.
ఈ ట్రెండ్ పట్ల అనురాగ్ కశ్యప్ లాంటి ఫిలిం మేకర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనుషుల ద్వారా మాత్రమే ఎమోషన్స్ పండుతాయని, ఇలా ఖర్చు తక్కువనే ఉద్దేశంతో భావోద్వేగాలు లేని బొమ్మలను ఏఐలో సృష్టించి ప్రేక్షకులను అన్యాయం చేయడం మోసమంటూ సోషల్ మీడియాలో నిరసన తెలుపుతున్న వైనం వైరలవుతోంది. చిరంజీవి హనుమాన్ ప్రకటనను తప్పుబడుతూ సదరు దర్శక నిర్మాతల మీద ఫైర్ అయ్యాడు. లీగల్ గా, మోరల్ గా ఎవరూ వీటిని అడ్డుకోలేరు కానీ ఆడియన్స్ ని చీట్ చేసే ఇలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించకూడదనేది అనురాగ్ కశ్యప్ ఉద్దేశం.
నిజమే. క్రమంగా అన్నీ ఏఐతోనే చేసుకుంటే జనాలకు ఉపాధి లేకుండా పోతుంది. సినిమా ఎక్స్ పీరియన్స్ కు అర్థం మారిపోతుంది. భావోద్వేగాలను ఫీలయ్యే అవకాశం లేకుండా తెరపై చూపించే బొమ్మలకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అంటే ఏదో అనుకోవచ్చు అందరూ ఇదే దారిలోకి వెళ్లాలనుకోవడం ప్రమాదకర పరిణామం. ఇదే కొనసాగితే హీరో హీరోయిన్లను కూడా ఏఐలో సృష్టించి ఫ్యాన్స్ ని పిచ్చోళ్లను చేస్తారు. ఇప్పటికే బాడీ డబుల్స్ తో మేనేజ్ చేసింది కాకుండా వీటికి ఏఐ తోడైతే అంతకన్నా పెద్ద స్కామ్ మరొకటి ఉండదు. రాబోయే కాలంలో చాలా విచిత్రమైన పరిణామాలు చూడాల్సి వచ్చేలా ఉంది.
విద్యాశాఖ మంత్రిగా టీడీపీ యువ నాయకుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్.. నారా లోకేష్ దూకుడు చూపిస్తున్నారు. నిజానికి విద్యా శాఖ…
రాష్ట్రంలో కూటమిప్రభుత్వంఏర్పడి జూన్ 12కు రెండేళ్లు పూర్తయ్యాయి. 2024లో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు జనసేన అధినేత…
ఏపీలో పెను కలకలం రేపిన మద్యం కుంభకోణంలో ఇప్పుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చేసింది. వైసీపీ…
తాను చేసే మాస్ మసాలా సినిమాల విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా, పట్టించుకోకుండా చాలా ఏళ్ల పాటు అదే రూట్లో…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ పోరాటం బరిలోకి దిగకుండానే ముగిసిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఆమెకు…
కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మొదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త ఇన్నింగ్స్లో అభిమానుల ఆకాంక్షలు, అంచనాలకు తగ్గ సినిమాలు…