Movie News

AI సినిమాలతో ముంచుకొస్తున్న ప్రమాదం

మనుషులు అవసరం లేకుండా కేవలం ఒక ఆఫీస్ సెటప్, స్టాఫ్, కంప్యూటర్లు ఉంటే చాలు ఇకపై సినిమాలు తీయడం సులభమనిపించే రీతిలో కొందరు ఏఐ టెక్నాలజీని వాడుతుండటం ఆందోళనకు దారి తీస్తోంది. ఇటీవలే బాలీవుడ్ లో పురాణాలు ఇతిహాసాలను ఆధారంగా చేసుకుని కృత్రిమ మేధస్సుతో ప్యాన్ ఇండియా మూవీస్ తీయబోతున్నట్టు ప్రకటనలు వచ్చాయి. వాటిలో ఒకటి రామాయణం కాగా రెండోది చిరంజీవి హనుమాన్. మహావతార్ లాగా యానిమేషన్, విఎఫ్ఎక్స్ కాకుండా పూర్తిగా ఏఐ మాడ్యూల్ లో వీటిని తీస్తారట. సాఫ్ట్ వేర్లు, టూల్స్ ని అత్యధిక స్థాయికి వాడబోతున్నారు.

ఈ ట్రెండ్ పట్ల అనురాగ్ కశ్యప్ లాంటి ఫిలిం మేకర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనుషుల ద్వారా మాత్రమే ఎమోషన్స్ పండుతాయని, ఇలా ఖర్చు తక్కువనే ఉద్దేశంతో భావోద్వేగాలు లేని బొమ్మలను ఏఐలో సృష్టించి ప్రేక్షకులను అన్యాయం చేయడం మోసమంటూ సోషల్ మీడియాలో నిరసన తెలుపుతున్న వైనం వైరలవుతోంది. చిరంజీవి హనుమాన్ ప్రకటనను తప్పుబడుతూ సదరు దర్శక నిర్మాతల మీద ఫైర్ అయ్యాడు. లీగల్ గా, మోరల్ గా ఎవరూ వీటిని అడ్డుకోలేరు కానీ ఆడియన్స్ ని చీట్ చేసే ఇలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించకూడదనేది అనురాగ్ కశ్యప్ ఉద్దేశం.

నిజమే. క్రమంగా అన్నీ ఏఐతోనే చేసుకుంటే జనాలకు ఉపాధి లేకుండా పోతుంది. సినిమా ఎక్స్ పీరియన్స్ కు అర్థం మారిపోతుంది. భావోద్వేగాలను ఫీలయ్యే అవకాశం లేకుండా తెరపై చూపించే బొమ్మలకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడో ఒకసారి అంటే ఏదో అనుకోవచ్చు అందరూ ఇదే దారిలోకి వెళ్లాలనుకోవడం ప్రమాదకర పరిణామం. ఇదే కొనసాగితే హీరో హీరోయిన్లను కూడా ఏఐలో సృష్టించి ఫ్యాన్స్ ని పిచ్చోళ్లను చేస్తారు. ఇప్పటికే బాడీ డబుల్స్ తో మేనేజ్ చేసింది కాకుండా వీటికి ఏఐ తోడైతే అంతకన్నా పెద్ద స్కామ్ మరొకటి ఉండదు. రాబోయే కాలంలో చాలా విచిత్రమైన పరిణామాలు చూడాల్సి వచ్చేలా ఉంది.

Kumar

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

3 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

5 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

7 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

8 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

8 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

8 hours ago