పెద్ద హీరోల సినిమాలు అంటే మినిమం గ్యారెంటీ అనే పరిస్థితి ఉండేది ఒకప్పుడు. సినిమాకు టాక్ ఎలా ఉన్నా సరే.. తమ స్టార్ పవర్తో ఓపెనింగ్స్ రాబట్టడం ద్వారా సినిమాను సేఫ్ జోన్లోకి తీసుకెళ్లిపోయేవారు. టాక్ బాగుంటే మంచి లాభాలూ వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. పారితోషకాలు పెరిగిపోయి, మేకింగ్ ఆలస్యమై, బడ్జెట్లు లిమిట్ దాటిపోయి.. అందుకు తగ్గట్లుగా బిజినెస్ జరగక నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. టాక్ అటు ఇటు అయితే సినిమా వీకెండ్ తర్వాత సినిమా నిలబడడం లేదు. ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో రాక నిర్మాతలకు భారీ నష్టాలు తప్పట్లేదు.
ఐతే ఇలాంటి సందర్భాల్లో స్టార్ హీరోలు కూడా పెద్ద మనసు చేసుకుని నిర్మాతలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన హీరోలు ఆ దిశగా స్పందిస్తుండడం మంచి పరిణామం. గత నెలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘హరిహర వీరమల్లు’ విడుదల ముంగిట నిర్మాత ఏఎం రత్నం ఎంత ఇబ్బంది పడ్డారో తెలిసిందే. విపరీతమైన ఆలస్యం వల్ల సినిమాకు ఆశించినంత బజ్ క్రియేట్ కాక, బిజినెస్ పరంగా ఇబ్బందులు తలెత్తి.. ‘వీరమల్లు’ అసలు రిలీజవుతుందా లేదా అన్న సందేహాలు కలిగాయి. ఐతే ఆ సమయంలో పవన్ కళ్యాణ్ చొరవ తీసుకున్నారు. ప్రమోషన్లలో పాల్గొని సినిమాను గట్టిగా పుష్ చేశారు. దీంతో సినిమాకు హైప్ క్రియేట్ అయింది.
బిజినెస్ వర్గాల్లో కూడా కదలిక వచ్చింది. మైత్రీ లాంటి పెద్ద సంస్థ నైజాంలో సినిమాను రిలీజ్ చేసిందంటే అది పవన్ చొరవ వల్లే. మొత్తానికి సినిమా థియేటర్లలోకి వచ్చింది. చిన్న మొత్తంలో అడ్వాన్స్ మినహాయిస్తే పవన్ ఈ సినిమా కోసం పారితోషకమే తీసుకోలేదు. రిలీజ్ తర్వాత అడిగే పరిస్థితి అసలే లేదు. రిజల్ట్ ఏంటన్నది పక్కన పెడితే.. పవన్ పెద్ద మనసు వల్లే సినిమా వెలుగు చూసిందన్నది స్పష్టం. ఇక లేటెస్ట్గా మరో స్టార్ హీరో తన నిర్మాతను ఆదుకోవడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అతనే.. జూనియర్ ఎన్టీఆర్.
ఈ నందమూరి హీరో బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘వార్-2’ అంచనాలను అందుకోలేకపోయింది. తారక్ మీద అభిమానంతో, సినిమా మీద నమ్మకంతో ఏకంగా రూ.80 కోట్లు పెట్టి తెలుగు హక్కులు సొంతం చేసుకున్నాడు నాగవంశీ. కానీ అందులో సగానికి మించి వెనక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో నాగవంశీని ఆదుకోవడానికి ఎన్టీఆర్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. యశ్ రాజ్ ఫిలిమ్స్తో మాట్లాడి నాగవంశీకి సెటిల్ చేయించడంలో తారక్ చొరవ తీసుకున్నాడట.
అవసరమైతే తన పారితోషకంలో కొంత వెనక్కి ఇవ్వడానికి కూడా తారక్ రెడీ అయినట్లు తెలుస్తోంది. తమకు చెల్లించిన మొత్తంలో నాలుగో వంతుకు దాకా నాగవంశీకి వెనక్కి ఇవ్వడానికి యశ్ రాజ్ సంస్థ సిద్ధమైనట్లు సమాచారం. మరి తారక్ నుంచి ఏమైనా వెనక్కి తీసుకుంటారా లేదా అన్నది స్పష్టత లేదు కానీ.. నాగవంశీకి సాయం అందేలా చూడడంలో తారక్ కీలకంగా వ్యవహరిస్తున్న మాట అయితే నిజమని తెలుస్తోంది. ఇలా నిర్మాతలకు కష్ట కాలంలో అండగా నిలవడం ద్వారా మన స్టార్లు రియల్ హీరోలు అనిపించుకుంటున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…