ఒకసారి డేట్ ఇవ్వడం.. తర్వాత సినిమాను వాయిదా వేయడం.. ఈ వ్యవహారం చాలా మామూలైపోయింది సినీ పరిశ్రమలో. ఒకప్పుడు సినిమాను వాయిదా వేయడం అంటే నెగెటివ్ సెంటిమెంటుగా ఫీలయ్యేవాళ్లు కానీ.. కరోనా తర్వాత ఆ ఫీలింగ్ అంతా పక్కకు పోయింది. పెద్ద పెద్ద సినిమాలు కూడా రెండు మూడుసార్లు వాయిదా పడిపోతున్న నేపథ్యంలో… ఏదైనా ఇబ్బంది వస్తే రిలీజ్ పోస్ట్ పోన్ చేయడానికి ఎవ్వరూ సంకోచించడం లేదు.
సెప్టెంబరు మొదటి వారంలో రావాల్సిన మిరాయ్ సినిమాను కూడా ఇలాగే మరోసారి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమాకు రెండుసార్లు డేట్ మార్చారు. సెప్టెంబరు 5న ఫిక్స్ అని అనుకుంటుండగా.. ఈ చిత్రాన్ని వెనక్కి జరుపుతున్నట్లు సమాచారం. ఇది పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కావాల్సిన సినిమా. పెద్ద బడ్జెట్ పెట్టారు. కొన్ని రోజుల కిందటి వరకు సెప్టెంబరు 5కే ఫిక్స్ అనుకున్నారు. హీరో తేజ సజ్జా ప్రమోషనల్ ఇంటర్వ్యూలు కూడా మొదలుపెట్టాడు. కానీ ఇప్పుడు సీన్ మారినట్లు తెలుస్తోంది.
రిలీజ్ డేట్ అనుకూలంగా లేదా.. లేక ఆ సమయానికి సినిమాను రెడీ చేసే పరిస్థితి లేదా అన్నది తెలియదు కానీ.. సినిమా అయిదే సెప్టెంబరు 5న రాదని సమాచారం. ఇది అదే రోజుకు షెడ్యూల్ అయిన అనుష్క సినిమా ‘ఘాటి’కి కలిసొచ్చే విషయమే. ఆ సినిమా కూడా రెండు మూడుసార్లు వాయిదా పడి సెప్టెంబరు 5కు ఫిక్స్ అయింది. మిరాయ్ సెప్టెంబరు 5 మిస్ అయింది అంటే.. ఇక ఆ నెలలో వచ్చే అవకాశం లేనట్లే. అక్టోబరులోనే రిలీజ్ చేసే అవకాశముంది. త్వరలోనే ‘మిరాయ్’ వాయిదా గురించి అధికారిక ప్రకటన వస్తుందని భావిస్తున్నారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…