‘రన్ రాజా రన్’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చాడు సుజీత్. ఆ చిన్న సినిమాలో అతడి టాలెంట్ చూసి ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ అతడికి కమిట్మెంట్ ఇచ్చాడు. ‘బాహుబలి’ లాంటి మెగా బ్లాక్బస్టర్ తర్వాత ప్రభాస్ సుజీత్తోనే సినిమా చేశాడు. కానీ అంచనాలను అందుకోవడంలో సుజీత్ విఫలమయ్యాడు.
‘సాహో’ అతడి కెరీర్ను తల్లకిందులు చేసింది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్తో ‘లూసిఫర్’ రీమేక్లో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఈ మధ్య ఏమో ‘ఛత్రపతి’ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలో సుజీత్ రీమేక్ చేయబోతున్నాడని.. దానికి మిగతా కాస్టింగ్ కూడా ఖరారైపోయిందని.. ప్రి ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగిపోతోందని మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. కానీ చివరికి చూస్తే అది ఫేక్ న్యూస్ అని తేలిపోయింది.
తాను ‘ఛత్రపతి’ బాలీవుడ్ రీమేక్ను డైరెక్ట్ చేయడం లేదని సుజీతే స్వయంగా స్పష్టత ఇచ్చాడు. ‘ఛత్రపతి’ ఊసు ఎత్తకుండా అతను ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇన్స్టాగ్రామ్లో ఒక ఫొటో పెట్టి ‘‘ఏ రీమేకూ చేయట్లేదు’’ అనే క్యాప్షన్ జోడించాడు సుజీత్. దీన్ని బట్టి ‘ఛత్రపతి’ అనే కాదు.. మరే రీమేక్ కోసమూ తాను పని చేయట్లేదని.. రీమేక్లు చేసే ఉద్దేశమే తనకు లేదని చెప్పకనే చెప్పినట్లయింది. ‘లూసిఫర్’ రీమేక్ నుంచి కూడా సుజీతే తప్పుకున్నట్లు చిరంజీవి వెల్లడించిన సంగతి తెలిసిందే.
అదే నిజమైతే.. ‘ఛత్రపతి’ రీమేక్ చేయడంలోనూ సుజీత్కు ఆసక్తి లేనట్లే. ప్రస్తుతం తన సొంత కథ మీదే సుజీత్ పని చేస్తున్నట్లుంది. ‘రన్ రాజా రన్’ తరహాలో మీడియం బడ్జెట్లో ఓ సినిమా చేసి తనేంటో రుజువు చేసుకుని ఆ తర్వాత స్టార్ల కోసం ప్రయత్నిద్దామని సుజీత్ భావిస్తుండొచ్చు. అతడి తొలి రెండు సినిమాలను నిర్మించిన యువి క్రియేషన్స్లోనే సుజీత్ తన తర్వాతి సినిమాను కూడా చేయొచ్చని అంటున్నారు.
This post was last modified on November 21, 2020 2:40 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…