‘రన్ రాజా రన్’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చాడు సుజీత్. ఆ చిన్న సినిమాలో అతడి టాలెంట్ చూసి ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ అతడికి కమిట్మెంట్ ఇచ్చాడు. ‘బాహుబలి’ లాంటి మెగా బ్లాక్బస్టర్ తర్వాత ప్రభాస్ సుజీత్తోనే సినిమా చేశాడు. కానీ అంచనాలను అందుకోవడంలో సుజీత్ విఫలమయ్యాడు.
‘సాహో’ అతడి కెరీర్ను తల్లకిందులు చేసింది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్తో ‘లూసిఫర్’ రీమేక్లో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఈ మధ్య ఏమో ‘ఛత్రపతి’ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలో సుజీత్ రీమేక్ చేయబోతున్నాడని.. దానికి మిగతా కాస్టింగ్ కూడా ఖరారైపోయిందని.. ప్రి ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగిపోతోందని మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. కానీ చివరికి చూస్తే అది ఫేక్ న్యూస్ అని తేలిపోయింది.
తాను ‘ఛత్రపతి’ బాలీవుడ్ రీమేక్ను డైరెక్ట్ చేయడం లేదని సుజీతే స్వయంగా స్పష్టత ఇచ్చాడు. ‘ఛత్రపతి’ ఊసు ఎత్తకుండా అతను ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇన్స్టాగ్రామ్లో ఒక ఫొటో పెట్టి ‘‘ఏ రీమేకూ చేయట్లేదు’’ అనే క్యాప్షన్ జోడించాడు సుజీత్. దీన్ని బట్టి ‘ఛత్రపతి’ అనే కాదు.. మరే రీమేక్ కోసమూ తాను పని చేయట్లేదని.. రీమేక్లు చేసే ఉద్దేశమే తనకు లేదని చెప్పకనే చెప్పినట్లయింది. ‘లూసిఫర్’ రీమేక్ నుంచి కూడా సుజీతే తప్పుకున్నట్లు చిరంజీవి వెల్లడించిన సంగతి తెలిసిందే.
అదే నిజమైతే.. ‘ఛత్రపతి’ రీమేక్ చేయడంలోనూ సుజీత్కు ఆసక్తి లేనట్లే. ప్రస్తుతం తన సొంత కథ మీదే సుజీత్ పని చేస్తున్నట్లుంది. ‘రన్ రాజా రన్’ తరహాలో మీడియం బడ్జెట్లో ఓ సినిమా చేసి తనేంటో రుజువు చేసుకుని ఆ తర్వాత స్టార్ల కోసం ప్రయత్నిద్దామని సుజీత్ భావిస్తుండొచ్చు. అతడి తొలి రెండు సినిమాలను నిర్మించిన యువి క్రియేషన్స్లోనే సుజీత్ తన తర్వాతి సినిమాను కూడా చేయొచ్చని అంటున్నారు.
This post was last modified on November 21, 2020 2:40 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…