‘రన్ రాజా రన్’ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్లోకి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చాడు సుజీత్. ఆ చిన్న సినిమాలో అతడి టాలెంట్ చూసి ప్రభాస్ లాంటి పెద్ద స్టార్ అతడికి కమిట్మెంట్ ఇచ్చాడు. ‘బాహుబలి’ లాంటి మెగా బ్లాక్బస్టర్ తర్వాత ప్రభాస్ సుజీత్తోనే సినిమా చేశాడు. కానీ అంచనాలను అందుకోవడంలో సుజీత్ విఫలమయ్యాడు.
‘సాహో’ అతడి కెరీర్ను తల్లకిందులు చేసింది. ఈ సినిమా తర్వాత మెగాస్టార్తో ‘లూసిఫర్’ రీమేక్లో అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది. ఈ మధ్య ఏమో ‘ఛత్రపతి’ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా హిందీలో సుజీత్ రీమేక్ చేయబోతున్నాడని.. దానికి మిగతా కాస్టింగ్ కూడా ఖరారైపోయిందని.. ప్రి ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగిపోతోందని మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. కానీ చివరికి చూస్తే అది ఫేక్ న్యూస్ అని తేలిపోయింది.
తాను ‘ఛత్రపతి’ బాలీవుడ్ రీమేక్ను డైరెక్ట్ చేయడం లేదని సుజీతే స్వయంగా స్పష్టత ఇచ్చాడు. ‘ఛత్రపతి’ ఊసు ఎత్తకుండా అతను ఈ విషయాన్ని వెల్లడించాడు. ఇన్స్టాగ్రామ్లో ఒక ఫొటో పెట్టి ‘‘ఏ రీమేకూ చేయట్లేదు’’ అనే క్యాప్షన్ జోడించాడు సుజీత్. దీన్ని బట్టి ‘ఛత్రపతి’ అనే కాదు.. మరే రీమేక్ కోసమూ తాను పని చేయట్లేదని.. రీమేక్లు చేసే ఉద్దేశమే తనకు లేదని చెప్పకనే చెప్పినట్లయింది. ‘లూసిఫర్’ రీమేక్ నుంచి కూడా సుజీతే తప్పుకున్నట్లు చిరంజీవి వెల్లడించిన సంగతి తెలిసిందే.
అదే నిజమైతే.. ‘ఛత్రపతి’ రీమేక్ చేయడంలోనూ సుజీత్కు ఆసక్తి లేనట్లే. ప్రస్తుతం తన సొంత కథ మీదే సుజీత్ పని చేస్తున్నట్లుంది. ‘రన్ రాజా రన్’ తరహాలో మీడియం బడ్జెట్లో ఓ సినిమా చేసి తనేంటో రుజువు చేసుకుని ఆ తర్వాత స్టార్ల కోసం ప్రయత్నిద్దామని సుజీత్ భావిస్తుండొచ్చు. అతడి తొలి రెండు సినిమాలను నిర్మించిన యువి క్రియేషన్స్లోనే సుజీత్ తన తర్వాతి సినిమాను కూడా చేయొచ్చని అంటున్నారు.
This post was last modified on November 21, 2020 2:40 pm
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…