టాలీవుడ్లో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న అరంగేట్రం.. నందమూరి మోక్షజ్ఞదే. నిన్నటితరం సూపర్ స్టార్లలో చిరంజీవి, నాగార్జునల వారసులు ఎప్పుడో సినిమాల్లోకి వచ్చారు కానీ.. నందమూరి బాలకృష్ణ కొడుకు అరంగేట్రం మాత్రం చాలా ఆలస్యం అవుతోంది. 2017లోనే మోక్షజ్ఞ సినిమాల్లోకి వచ్చేస్తాడని ప్రచారం సాగింది కానీ.. ఇప్పటికీ అది జరగలేదు. గత ఏడాది మోక్షజ్ఞ తొలి చిత్రం గురించి అధికారికంగా ప్రకటించి, అతడి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయడంతో నందమూరి అభిమానులు ఎగ్జైట్ అయ్యారు.
కానీ ముహూర్త కార్యమ్రానికి అంతా సిద్ధం చేసుకున్నాక అనివార్య కారణాలతో ఆ వేడుక వాయిదా పడింది. ఇక అప్పట్నుంచి మోక్షజ్ఞ తొలి చిత్రంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఐతే గత ఏడాది కాలంలో మోక్షజ్ఞ బయట ఎప్పుడు కనిపించినా.. సోషల్ మీడియాలో తన పేరు ట్రెండింగ్లోకి వచ్చేస్తోంది.
ప్రశాంత్ వర్మతో తన సినిమా ముహూర్త వేడుక రద్దయ్యాక పెద్దగా మీడియా దృష్టిలో పడని మోక్షజ్ఞ కొంచెం గ్యాప్ తర్వాత కెమెరాలకు చిక్కాడు. హైదరాబాద్లో నందమూరి, నారా కుటుంబాలు హాజరైన ఒక పెళ్లి వేడుకలో బాలయ్య తనయుడు అందరి దృష్టినీ ఆకర్షించాడు. షేర్వాణీలో తన లుక్ బాగుంది. గతంలో కంటే మరింత సన్నబడి, ట్రెండీ గడ్డంతో షార్ప్ లుక్లో దర్శనమిచ్చాడు మోక్షజ్ఞ. ఈ లుక్ను బట్టి చూస్తే అతను సినిమాలకు ఏమీ దూరం కావట్లేదని.. తన అరంగేట్రం కోసం ప్రిపరేషన్లోనే ఉన్నాడని అర్థమవుతోంది.
కాకపోతే తన మీద తనకు పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తుండొచ్చని అభిమానలు భావిస్తున్నారు. తన తొలి చిత్రం ముందు అనుకున్నట్లు ప్రశాంత్ వర్మతోనే ఉంటుందా.. లేక ఇంకో దర్శకుడిని ఏమైనా లైన్లో పెట్టారా అన్నది వారి కుటుంబ వర్గాలకే తెలియాలి. ఈ ఏడాది మోక్షు డెబ్యూ మూవీ మొదలు కాకపోవచ్చనే అనిపిస్తోంది. కొత్త ఏడాదిలో అయినా నిరీక్షణకు తెరదించితే బాగుండని అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on August 18, 2025 6:54 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…