టాలీవుడ్లో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న అరంగేట్రం.. నందమూరి మోక్షజ్ఞదే. నిన్నటితరం సూపర్ స్టార్లలో చిరంజీవి, నాగార్జునల వారసులు ఎప్పుడో సినిమాల్లోకి వచ్చారు కానీ.. నందమూరి బాలకృష్ణ కొడుకు అరంగేట్రం మాత్రం చాలా ఆలస్యం అవుతోంది. 2017లోనే మోక్షజ్ఞ సినిమాల్లోకి వచ్చేస్తాడని ప్రచారం సాగింది కానీ.. ఇప్పటికీ అది జరగలేదు. గత ఏడాది మోక్షజ్ఞ తొలి చిత్రం గురించి అధికారికంగా ప్రకటించి, అతడి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయడంతో నందమూరి అభిమానులు ఎగ్జైట్ అయ్యారు.
కానీ ముహూర్త కార్యమ్రానికి అంతా సిద్ధం చేసుకున్నాక అనివార్య కారణాలతో ఆ వేడుక వాయిదా పడింది. ఇక అప్పట్నుంచి మోక్షజ్ఞ తొలి చిత్రంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఐతే గత ఏడాది కాలంలో మోక్షజ్ఞ బయట ఎప్పుడు కనిపించినా.. సోషల్ మీడియాలో తన పేరు ట్రెండింగ్లోకి వచ్చేస్తోంది.
ప్రశాంత్ వర్మతో తన సినిమా ముహూర్త వేడుక రద్దయ్యాక పెద్దగా మీడియా దృష్టిలో పడని మోక్షజ్ఞ కొంచెం గ్యాప్ తర్వాత కెమెరాలకు చిక్కాడు. హైదరాబాద్లో నందమూరి, నారా కుటుంబాలు హాజరైన ఒక పెళ్లి వేడుకలో బాలయ్య తనయుడు అందరి దృష్టినీ ఆకర్షించాడు. షేర్వాణీలో తన లుక్ బాగుంది. గతంలో కంటే మరింత సన్నబడి, ట్రెండీ గడ్డంతో షార్ప్ లుక్లో దర్శనమిచ్చాడు మోక్షజ్ఞ. ఈ లుక్ను బట్టి చూస్తే అతను సినిమాలకు ఏమీ దూరం కావట్లేదని.. తన అరంగేట్రం కోసం ప్రిపరేషన్లోనే ఉన్నాడని అర్థమవుతోంది.
కాకపోతే తన మీద తనకు పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చే వరకు వెయిట్ చేస్తుండొచ్చని అభిమానలు భావిస్తున్నారు. తన తొలి చిత్రం ముందు అనుకున్నట్లు ప్రశాంత్ వర్మతోనే ఉంటుందా.. లేక ఇంకో దర్శకుడిని ఏమైనా లైన్లో పెట్టారా అన్నది వారి కుటుంబ వర్గాలకే తెలియాలి. ఈ ఏడాది మోక్షు డెబ్యూ మూవీ మొదలు కాకపోవచ్చనే అనిపిస్తోంది. కొత్త ఏడాదిలో అయినా నిరీక్షణకు తెరదించితే బాగుండని అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on August 18, 2025 6:54 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…