బాలకృష్ణ కోసం క్రేజీ హీరోయిన్లను తీసుకురావాలని బోయపాటి శ్రీను చాలా ప్రయత్నించాడు. బాలీవుడ్ హీరోయిన్లను కూడా సంప్రదించాడు. అయితే కోవిడ్ కారణంగా ముంబయి హీరోయిన్లు దక్షిణాది సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. తెలుగు సినిమా చేస్తే హోటల్లో బస చేయాలి కనుక, అది ప్రమాదకరం కనుక హిందీ హీరోయిన్లు సౌత్ సినిమాలు చేయడానికి ఇష్టపడడం లేదు. దాంతో అందుబాటులో వున్న హీరోయిన్లతోనే చేయాలని బోయపాటి డిసైడ్ అయ్యాడు.
అందుకే అవుట్ డేటెడ్ అయిపోయిందనుకున్న ‘అవును’ ఫేమ్ పూర్ణను ఒక కథానాయిక పాత్రకు ఎంచుకున్నాడు. మరో యంగ్ క్యారెక్టర్కు మలయాళ నటి ప్రయాగ మార్టిన్ను తీసుకుంటే ఆమె బాలయ్య సరసన మరీ చిన్నపిల్లలా అనిపించడంతో తీసేసారని వార్తలొచ్చాయి. ఆమె స్థానంలో ‘అఖిల్’ హీరోయిన్ సయ్యేషాను ఎంచుకుంటే ఇప్పుడు ఆమె కూడా వాకౌట్ చేసిందని చెబుతున్నారు.
దీంతో ఆ పాత్రకు ముందుగా అనుకున్నట్టుగా ప్రగ్యా జైస్వాల్నే ఖరారు చేసుకున్నారని తెలిసింది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్కి హీరోయిన్ ఎవరయినా ఫరక్ పడదు కనుక ఫైనల్గా ఎవరు నటించినా ఆ పాయింట్ని ఎవరూ కేర్ చేయరు.
This post was last modified on November 20, 2020 10:31 pm
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వరుసగా తమిళ నటులు, టెక్నీషియన్లతో పని చేస్తున్నాడు. గత ఏడాది ధనుష్తో కలిసి…
అక్కడెక్కడో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాలు యుద్దం చేసుకుంటే.. వారికి వేలాది కిలోమీటర్ల ఇవతల ఉన్న బెంగళూరులోని టిఫిన్ సెంటర్లు..…
నిర్మాత కోన వెంకట్ బ్యాండ్ మేళంని చాలా సీరియస్ గా తీసుకున్న వైనం ప్రమోషన్లలో కనిపిస్తోంది. కోర్ట్ జంట హర్ష్…