అక్కినేని నాగార్జునను చూసిన ఎవ్వరికైనా ఆయన వయసు 65 ఏళ్లని ఎంతమాత్రం అనిపించరు. ఇప్పటికీ ఎంతో ఫిట్గా, కుర్రాళ్లకు దీటైన లుక్స్తో దర్శనమిస్తుంటారాయన. తన కొత్త చిత్రం కూలీలోనూ నాగ్ సూపర్ స్టైలిష్గా కనిపిస్తూ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. నాగ్ ఏదైనా ఈవెంట్కు హాజరైనా, మీడియాకు ఇంటర్వ్వూ ఇచ్చినా ఆయన ఫిట్నెస్ గురించి ప్రశ్నలు ఉంటాయి. వాటికి ఆయన సమాధానం ఇస్తుంటారు. సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం నాగ్ను ఇదే ప్రశ్న అడిగాడట కూలీ షూటింగ్ టైంలో కలిసినపుడు. నాగ్ ఫిట్నెస్ చూసి తాను ఎంత అబ్బురపడ్డానో.. యవ్వన రహస్యం గురించి తాను అడిగితే నాగ్ ఏం సమాధానం ఇచ్చాడో చెన్నైలో జరిగిన కూలీ అన్లీష్డ్ ఈవెంట్లో రజినీ వెల్లడించారు.
తాను, నాగార్జున నాట్టుకు ఒరు నల్లవన్ అనే సినిమాలో కలిసి నటించామని.. మళ్లీ 34-35 ఏళ్ల తర్వాత కూలీ కోసం కలిసి పని చేశామని రజినీ చెప్పాడు. నాగ్ తనలాగే ఎక్కువ బయటికి రాడు కాబట్టి మళ్లీ కలిసే అవకాశం రాలేదని.. చాలా ఏళ్ల పాటు తనను చూడలేదని రజినీ తెలిపాడు. ఐతే కూలీ కోసం పని చేస్తున్నపుడు చూస్తే అప్పటికంటే నాగ్ ఇప్పుడు ఇంకా యంగ్గా కనిపించాడని.. తన ఫిట్నెస్, స్కిన్ టోన్, జుట్టు చూసి ఆశ్చర్యపోయానని రజినీ చెప్పాడు. తన లాంటి వాళ్లకు జుట్టు మొత్తం ఊడిపోతే.. నాగ్కు ఇంకా పొడవైన జుట్టు ఉందని.. ఇలా ఎలా మెయింటైన్ చేస్తున్నాడో అర్థం కాక ఆ సీక్రెట్ ఏంటో చెప్పమని తాను అడిగానని రజినీ చెప్పాడు.
అందుకు నాగ్ బదులిస్తూ.. 40-45ఏళ్లుగా తాను ఎప్పుడూ వ్యాయామం మానలేదని. ప్రతి రోజూ ఎక్సర్సైజ్ తప్పని సరి అని చెప్పాడని రజినీ వెల్లడించాడు. దీంతో పాటు ఆరోగ్యవంతమైన తిండి తినడం.. సాయంత్రం ఆరున్నరకే డిన్నర్ పూర్తి చేయడం.. ఏ టెన్షన్స్ పెట్టుకోకపోవడం.. అన్నింటికీ మించి తన తండ్రి నాగేశ్వరరావు నుంచి వచ్చిన జీన్స్ తాను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణాలని నాగ్ వెల్లడించినట్లు రజినీ తెలిపాడు. మన ఒంట్లో అవయవాలను కాపాడుకోవడానికి ఎక్సర్సైజ్ ఎంతో ముఖ్యం అని ఈ సందర్భంగా నాగ్ను ఉదాహరణగా చూపిస్తూ అభిమానులకు సలహా ఇచ్చాడు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…
తమ సినిమాల మీద, దాని కోసం పనిచేసిన ఆర్టిస్టులు, టెక్నీషియన్ల మీద ఆయా చిత్ర బృందాలకు అపారమైన నమ్మకం ఉండొచ్చు.…