Movie News

ఈసారి ‘బిగ్ బాస్’లో బిగ్ బాస్ మారిపోయాడా?

లండన్‌లో ‘బిగ్ బ్రదర్’ పేరుతో మొదలై రియాలిటీ టీవీ షో.. ఆ తర్వాత హిందీలో ‘బిగ్ బాస్’ పేరుతో అరంగేట్రం చేసి.. ఆపై సౌత్ భాషల్లోకి కూడా అడుగు పెట్టింది. తెలుగులో ఇప్పటికే 8 సీజన్ల పాటు అలరించిన ఈ షో.. తొమ్మిదో సీజన్‌తో పలకరించబోతోంది. గత ఆరు సీజన్లలో షోను నడిపించిన అక్కినేని నాగార్జుననే ఈ సీజన్లో కూడా హోస్ట్‌‌గా వ్యవహరించబోతున్నాడు. త్వరలోనే కంటెస్టెంట్లను ప్రకటించనుండగా.. ముందుగా ఒక ఇంట్రెస్టింగ్ ప్రోమో వదిలారు.

అందులో నాగ్‌తో పాటు స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా కనిపించడం విశేషం. తాను కూడా షోలో పాల్గొనాలని కిషోర్ ఉత్సాహంగా వస్తే.. అతడికి షాకుల మీద షాకులు ఇచ్చాడు నాగ్. ఇప్పటిదాకా జరిగిన సీజన్లన్నింటితో పోలిస్తే బిగ్ బాస్-9 చాలా భిన్నంగా ఉండబోతోందని ఈ ప్రోమోతో సంకేతాలు ఇచ్చారు. ఇది డ్రీమ్ హౌస్ కావచ్చు కానీ, సేమ్ హౌసే కదా అని కిషోర్ అంటే.. ‘‘నాట్ ఎనీ మోర్.. ఈసారి డబుల్ హౌస్ డబుల్ డోస్’’ అని నాగ్ పేర్కొన్నాడు. దీన్ని బట్టి ఈసారి షోలో రెండు హౌస్‌లు ఉంటాయని అర్థమవుతోంది. 

ఇలా ఇద్దరి మధ్య సంభాషణ కొనసాగి.. చివరికి ‘‘నేను డైరెక్ట్‌గా బిగ్ బాస్‌తోనే మాట్లాడుకుంటా’’ అని కిషోర్ అంటే.. ‘‘ఈసారి బిగ్ బాస్‌నే మార్చేశాం.. అందరి సరదాలు తీరిపోతాయి.. ఈసారి చదరంగం కాదు రణరంగమే’’ అని నాగ్ అనడంతో ప్రోమో ముగిసింది. ఇందులో ‘‘బిగ్ బాస్‌నే మార్చేశాం’’ అనే మాట ఆసక్తి రేకెత్తిస్తోంది. అంటే ‘బిగ్ బాస్’ కొత్త వాయిస్‌తో వినిపించనుందా.. లేక ఇంకేదైనా మార్పు చేశారా అన్నది ప్రశ్న. ఈసారి షోలో సెలబ్రెటీల కంటే సామాన్యులే ఎక్కువమంది ఉంటారని ఇప్పటికే హింట్ ఇచ్చారు. ‘బిగ్ బాస్-9’ వచ్చే నెల నుంచి ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.

Kumar

Recent Posts

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…

9 minutes ago

పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…

1 hour ago

ఏనుగు ఇంతలా పగబట్టేసిందా

పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…

1 hour ago

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

3 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

3 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

4 hours ago