హృతిక్ రోషన్ పాన్ ఇండియా స్థాయిలో సూపర్ స్టార్. తొలి సినిమా ‘కహోనా ప్యార్ హై’తోనే పెద్ద స్టార్ అయిపోయిన హీరో అతను. అప్పట్నుంచి టాప్లోనే ఉంటూ వస్తున్నాడు. అలాంటి హీరో.. మన జూనియర్ ఎన్టీఆర్ను కొనియాడిన తీరు టాలీవుడ్కే గర్వకారణం అని చెప్పాలి. తారక్ తనకు గురువు అన్నట్లుగా ‘వార్-2’ ప్రి రిలీజ్ ఈవెంట్లో హృతిక్ మాట్లాడాడు. తారక్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని.. అందుకు అతడికి కృతజ్ఞుడినని హృతిక్ పేర్కొన్నాడు. తారక్ది, తనది ఒకే రకమైన ప్రయాణం అని.. అతడిలో తనను చూసుకుంటానని హృతిక్ చెప్పాడు.
అలాగే తారక్ కూడా తనలో అతణ్ని చూసుకుంటాడనుకుంటున్నట్లు చెప్పాడు. తారక్, తాను కోస్టార్లుగా మొదలుపెట్టి.. సోదరులం అయిపోయామని.. ఇప్పుడు తన అభిమానులు కూడా తన సోదరులే అని హృతిక్ వ్యాఖ్యానించాడు. ఇక తారక్ ప్రతిభ గురించి హృతిక్ గొప్ప ఎలివేషనే ఇచ్చాడు. తారక్ వన్ టేక్-ఫైనల్ టేక్ స్టార్ అని హృతిక్ అన్నాడు. ఒక పాత్రలోకి అతను లీనమయ్యే తీరు అద్భుతమని.. షాట్లోకి వెళ్లాడంటే నూటికి నూరు శాతం దాని కోసం ఏం చేయాలో అది చేస్తాడని.. 99.9 కూడా కాదు 100 పర్సంట్ ఇస్తాడని హృతిక్ కొనియాడాడు.
సన్నివేశం పూర్తయ్యాక దాన్ని జడ్జ్ చేసే అవకాశమే ఉండదని.. పర్ఫెక్ట్గా ఉంటుందని హృతిక్ చెప్పాడు. తారక్లోని ఈ లక్షణాలను తాను కూడా నేర్చుకున్నానని.. తన తర్వాతి చిత్రాల్లో వాటిని అమల్లో పెట్టడానికి ప్రయత్నిస్తానని హృతిక్ అన్నాడు. తారక్ వ్యక్తిగా ఎంతో స్ట్రాంగ్ అని.. ‘వార్-2’ చేస్తూ తామిద్దరం ఎన్నో దెబ్బలు కూడా తిన్నామని.. కానీ తారక్ దృఢంగా నిలవడం చూసి తాను ఇన్స్పైర్ అయ్యానని.. అది తనలో నేర్చుకున్న మరో విషయం అని హృతిక్ చెప్పాడు. వార్-2 తన కెరీర్లో టాప్లో ఉంటుందని.. కహోనా ప్యార్ హై, క్రిష్, ధూమ్-2 చిత్రాలకు ఎంత అప్రిషియేషన్ వచ్చిందో ‘వార్’కు అంత పొగడ్తలు వచ్చాయని.. ‘వార్-2’ కూడా అదే స్థాయిలో స్పందన తెచ్చుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు హృతిక్.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…