Movie News

మూగ అభిమానికి ఎన్టీఆర్ దర్శన భాగ్యం

తమ అభిమాన కథానాయకులను ఫ్యాన్స్ ఎంతగా ఆరాధిస్తారో.. వాళ్లను ఒక్కసారి నేరుగా చూడాలని ఎంతగా తపిస్తారో.. ఆ అవకాశం దక్కినపుడు ఎంత ఉద్వేగానికి గురవుతారో చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ అలాంటి అభిమానులను పెద్ద సంఖ్యలోనే సంపాదించుకున్నాడు. వీలైనపుడల్లా అభిమానులను కలిసి వారి కళ్లలో ఆనందం చూసేందుకు ప్రయత్నిస్తుంటాడు తారక్. ఐతే గత కొన్నేళ్లలో తారక్ చేసిన సినిమాలు తక్కువ కావడంతో ఎక్కువగా అభిమానులను కలిసే అవకాశం రాలేదు. పైగా ‘దేవర’ సినిమాకు ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా జరగకపోవడంతో ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు.

ఐతే తారక్ బాలీవుడ్లోకి అడుగు పెడుతున్న ‘వార్-2’ సినిమాకు ఆదివారం హైదరాబాద్‌లో భారీ ప్రి రిలీజ్ ఈవెంట్ చేశారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ హాజరయ్యారు. ఐతే పాసులు పరిమితం కావడంతో కోరుకున్న వాళ్లందరూ ఈ వేడుకకు రాలేకపోయి ఉండొచ్చు. కానీ ఒక స్పెషల్ ఫ్యాన్ మాత్రం ఈ ఈవెంట్‌కు హాజరై తన చిరకాల కోరిక నెరవేర్చుకున్నాడు. ఆ అభిమాని పుట్టు మూగవాడు, చెవిటి వాడు కావడం గమనార్హం. ఎన్టీఆర్ కోసం గుంటూరు జిల్లా మాచర్ల నుంచి వచ్చిన ఆ అభిమానికి ముందు ‘వార్-2’ ఈవెంట్ పాస్ దక్కలేదు.

దీని గురించి ఒక టీవీ ఛానెల్‌తో మొరపెట్టుకున్నాడు. అతణ్ని ఇంటర్వ్యూ చేసినపుడు సైగలతోనే ఎన్టీఆర్ మీద తన అభిమానం ఎలాంటిదో చాటి చెప్పాడు. తనకు ఈవెంట్ పాస్ లేని విషయాన్ని మీడియా ద్వారా తెలియజేయగా.. సోషల్ మీడియాలో దాన్ని ఫ్యాన్స్ వైరల్ చేశారు. ఎన్టీఆర్ పీఆర్ టీం ఈ పోస్టుకు స్పందించింది. అతడికి పాస్ ఇప్పించడమే కాదు.. తారక్‌ను కలిసే అవకాశం కూడా కల్పించింది. జూనియర్‌తో కలిసి ఫొటోలు దిగిన అతడి ఆనందానికి అవధుల్లేవు. ఈ ఫొటోలు చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ అభిమానిలాగే ఎగ్జైట్ అవుతున్నారు.

This post was last modified on August 10, 2025 9:41 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

2 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

2 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

4 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

4 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

5 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago