తమ అభిమాన కథానాయకులను ఫ్యాన్స్ ఎంతగా ఆరాధిస్తారో.. వాళ్లను ఒక్కసారి నేరుగా చూడాలని ఎంతగా తపిస్తారో.. ఆ అవకాశం దక్కినపుడు ఎంత ఉద్వేగానికి గురవుతారో చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ అలాంటి అభిమానులను పెద్ద సంఖ్యలోనే సంపాదించుకున్నాడు. వీలైనపుడల్లా అభిమానులను కలిసి వారి కళ్లలో ఆనందం చూసేందుకు ప్రయత్నిస్తుంటాడు తారక్. ఐతే గత కొన్నేళ్లలో తారక్ చేసిన సినిమాలు తక్కువ కావడంతో ఎక్కువగా అభిమానులను కలిసే అవకాశం రాలేదు. పైగా ‘దేవర’ సినిమాకు ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా జరగకపోవడంతో ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు.
ఐతే తారక్ బాలీవుడ్లోకి అడుగు పెడుతున్న ‘వార్-2’ సినిమాకు ఆదివారం హైదరాబాద్లో భారీ ప్రి రిలీజ్ ఈవెంట్ చేశారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ హాజరయ్యారు. ఐతే పాసులు పరిమితం కావడంతో కోరుకున్న వాళ్లందరూ ఈ వేడుకకు రాలేకపోయి ఉండొచ్చు. కానీ ఒక స్పెషల్ ఫ్యాన్ మాత్రం ఈ ఈవెంట్కు హాజరై తన చిరకాల కోరిక నెరవేర్చుకున్నాడు. ఆ అభిమాని పుట్టు మూగవాడు, చెవిటి వాడు కావడం గమనార్హం. ఎన్టీఆర్ కోసం గుంటూరు జిల్లా మాచర్ల నుంచి వచ్చిన ఆ అభిమానికి ముందు ‘వార్-2’ ఈవెంట్ పాస్ దక్కలేదు.
దీని గురించి ఒక టీవీ ఛానెల్తో మొరపెట్టుకున్నాడు. అతణ్ని ఇంటర్వ్యూ చేసినపుడు సైగలతోనే ఎన్టీఆర్ మీద తన అభిమానం ఎలాంటిదో చాటి చెప్పాడు. తనకు ఈవెంట్ పాస్ లేని విషయాన్ని మీడియా ద్వారా తెలియజేయగా.. సోషల్ మీడియాలో దాన్ని ఫ్యాన్స్ వైరల్ చేశారు. ఎన్టీఆర్ పీఆర్ టీం ఈ పోస్టుకు స్పందించింది. అతడికి పాస్ ఇప్పించడమే కాదు.. తారక్ను కలిసే అవకాశం కూడా కల్పించింది. జూనియర్తో కలిసి ఫొటోలు దిగిన అతడి ఆనందానికి అవధుల్లేవు. ఈ ఫొటోలు చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ అభిమానిలాగే ఎగ్జైట్ అవుతున్నారు.
This post was last modified on August 10, 2025 9:41 pm
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…