తమ అభిమాన కథానాయకులను ఫ్యాన్స్ ఎంతగా ఆరాధిస్తారో.. వాళ్లను ఒక్కసారి నేరుగా చూడాలని ఎంతగా తపిస్తారో.. ఆ అవకాశం దక్కినపుడు ఎంత ఉద్వేగానికి గురవుతారో చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ అలాంటి అభిమానులను పెద్ద సంఖ్యలోనే సంపాదించుకున్నాడు. వీలైనపుడల్లా అభిమానులను కలిసి వారి కళ్లలో ఆనందం చూసేందుకు ప్రయత్నిస్తుంటాడు తారక్. ఐతే గత కొన్నేళ్లలో తారక్ చేసిన సినిమాలు తక్కువ కావడంతో ఎక్కువగా అభిమానులను కలిసే అవకాశం రాలేదు. పైగా ‘దేవర’ సినిమాకు ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా జరగకపోవడంతో ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు.
ఐతే తారక్ బాలీవుడ్లోకి అడుగు పెడుతున్న ‘వార్-2’ సినిమాకు ఆదివారం హైదరాబాద్లో భారీ ప్రి రిలీజ్ ఈవెంట్ చేశారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ హాజరయ్యారు. ఐతే పాసులు పరిమితం కావడంతో కోరుకున్న వాళ్లందరూ ఈ వేడుకకు రాలేకపోయి ఉండొచ్చు. కానీ ఒక స్పెషల్ ఫ్యాన్ మాత్రం ఈ ఈవెంట్కు హాజరై తన చిరకాల కోరిక నెరవేర్చుకున్నాడు. ఆ అభిమాని పుట్టు మూగవాడు, చెవిటి వాడు కావడం గమనార్హం. ఎన్టీఆర్ కోసం గుంటూరు జిల్లా మాచర్ల నుంచి వచ్చిన ఆ అభిమానికి ముందు ‘వార్-2’ ఈవెంట్ పాస్ దక్కలేదు.
దీని గురించి ఒక టీవీ ఛానెల్తో మొరపెట్టుకున్నాడు. అతణ్ని ఇంటర్వ్యూ చేసినపుడు సైగలతోనే ఎన్టీఆర్ మీద తన అభిమానం ఎలాంటిదో చాటి చెప్పాడు. తనకు ఈవెంట్ పాస్ లేని విషయాన్ని మీడియా ద్వారా తెలియజేయగా.. సోషల్ మీడియాలో దాన్ని ఫ్యాన్స్ వైరల్ చేశారు. ఎన్టీఆర్ పీఆర్ టీం ఈ పోస్టుకు స్పందించింది. అతడికి పాస్ ఇప్పించడమే కాదు.. తారక్ను కలిసే అవకాశం కూడా కల్పించింది. జూనియర్తో కలిసి ఫొటోలు దిగిన అతడి ఆనందానికి అవధుల్లేవు. ఈ ఫొటోలు చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ అభిమానిలాగే ఎగ్జైట్ అవుతున్నారు.
This post was last modified on August 10, 2025 9:41 pm
అఖండ 2 తాండవం వచ్చి తొమ్మిది నెలలు అయిపోయాయి. సీక్వెల్ అందులోనూ బ్లాక్ బస్టర్ కొనసాగింపు కాబట్టి బాలయ్య మరోసారి…
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక అనుబంధాన్ని…
ఒకప్పుడు సత్యం, గోదావరి, గౌరీ లాంటి హిట్లతో మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో సుమంత్ తర్వాత వరస ఫ్లాపుల దెబ్బకు…
స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య చిరాకులు, పరాకులకు అవకాశం ఉంటుందని.. తమకు అది మేలు చేస్తుందని భావిస్తున్న వైసీపీకి…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు విస్మయానికి గురి చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఇరాన్పై ఒంటికాలిపై లేచిన…
డీఎస్సీ నియమకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ కు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్…