తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఉద్యోగులు, ఫిలిం ఛాంబర్ పెద్దల మధ్య వేతనాలకు సంబంధించి జరుగుతున్న వివాదం అంత సులభంగా తేలేలా లేదు. వేతనాల్లో 30 శాతం పెంపు ఇచ్చి తీరాల్సిందేనని కార్మిక నాయకులు పట్టు మీదుండగా, అలా సాధ్యం కాదని వర్కర్ ఆదాయంని బట్టి స్లాట్స్ ప్రకారం పెంచుకుంటూ వెళ్తామని నిర్మాతలు ప్రతిపాదించారు. అయితే రెండు వర్గాలు ఏకాభిప్రాయం మీదకు రాకపోవడంతో సమస్య ఇంకా జఠిలంగానే ఉంది. ఎక్కడ లేని జీతాలు టాలీవుడ్ లోనే ఉన్నాయని ఇండస్ట్రీ పెద్దల వాదన. లేదూ తమకు పెంచడం న్యాయమేనని, ఏళ్ళ తరబడి హైక్ లేదని కార్మికులు వాదిస్తున్నారు.
షూటింగులు ఎక్కడికక్కడ ఆగిపోవడం చిన్నా పెద్ద ప్రొడ్యూసర్లకు భారంగా మారింది. ముఖ్యంగా సెప్టెంబర్, అక్టోబర్ రిలీజ్ డేట్లు ప్రకటించుకున్న సినిమాలు డెడ్ లైన్ ని చేరుకుంటామో లేదోననే ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకవేళ తేదీలు మిస్ అయితే ఓటిటి నుంచి ఒత్తిళ్లు, అడ్వాన్సుల కోసం బయ్యర్ల నుంచి ప్రెజర్లు మొదలవుతాయి. వీటికి తోడు మళ్ళీ కొత్త డేట్ వేసుకోవడం పెద్ద తలనెప్పిగా మారుతుంది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు నిర్మాతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నా పనవ్వడం లేదు. వీలైనంతగా నాలుగైదు రోజుల్లోపు దీనికో ముగింపు దక్కాలని పరిశ్రమ వర్గాలు కోరుకుంటున్నాయి. నిన్న నిర్మాతలంతా తీసుకున్న ఒక నిర్ణయాన్ని కూడా కార్మిక సంఘాలు తిరస్కరించాయి.
ఇదంతా ఒక ఎత్తు అయితే తనను ఏ ఫెడరేషన్ నాయకులు సంప్రదించలేదని, సాల్వ్ చేయాల్సింది ఫిలిం ఛాంబరేనంటూ, తన ప్రమేయం ఆశించవద్దంటూ చిరంజీవి చేసిన ట్వీట్ సైతం చిన్నపాటి సెన్సేషన్ అయ్యింది. ఇప్పుడు పెద్దగా ఎవరు ముందుకు వచ్చి ఈ గొడవకు శుభం కార్డు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ పరస్పరం ఒకే పట్టుతో ఉండటం వల్ల థర్డ్ పార్టీ (మూడో వ్యక్తి) ప్రమేయం అవసరమవుతోంది. అది ఎవరైనా మంత్రి రూపంలో వస్తారా లేక ఇంకెవరైనా అగ్ర హీరో చొరవ తీసుకుంటారా అనేది ఇంకొద్ది రోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా లెట్ వెయిట్ అండ్ సీ.
This post was last modified on August 10, 2025 10:22 am
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…