కొన్నేళ్ల పాటు తెలుగులో తిరుగులేని హవా సాగించింది బాలీవుడ్ భామ పూజా హెగ్డే. తెలుగులో తన తొలి మూడు చిత్రాలు ముకుంద, ఒక లైలా కోసం, దువ్వాడ జగన్నాథం ఆశించిన ఫలితాలు అందించకపోయినా.. ఆమె కెరీర్కు ఢోకా లేకపోయింది. ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలో సూపర్ సెక్సీగా కనిపించి కుర్రాళ్ల గుండెలకు గాయాలు చేసిన పూజాకు అవకాశాలు వరుస కట్టాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి టాప్ స్టార్లతో సినిమాలు చేసిందామె. కానీ ఒక దశలో వరుస ఫ్లాపులు రావడంతో పూజా కెరీర్ డౌన్ అయిపోయింది.
కొన్నేళ్ల నుంచి తెలుగులో సినిమానే చేయలేదు పూజా. ఆ సమయంలో హిందీ, తమిళంలో మాత్రం బాగానే అవకాశాలు దక్కించుకుంది. తెలుగు రీఎంట్రీ గురించి వార్తలు వస్తున్నాయి కానీ.. అవేవీ నిజం కాలేదు. ఐతే ఈ మధ్య ‘రెట్రో’ ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన పూజా.. తన రీఎంట్రీ తెలుగు మూవీ దాదాపు ఓకే అయినట్లు చెప్పింది. ఆ కబురు కోసమే తన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఎట్టకేలకు పూజా చేయబోయే తర్వాత తెలుగు సినిమా గురించి సమాచారం బయటికి వచ్చింది. ఆమె నితిన్ సరసన నటించబోతున్నట్లు తెలుస్తోంది. వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న నితిన్.. త్వరలోనే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టబోతున్నాడు. వీరి కలయికలో వచ్చిన ‘ఇష్క్’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత వీళ్లిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారు.
ఇదొక స్పోర్ట్స్ డ్రామా అని.. ఇందులో నితిన్ హార్స్ రైడర్గా కనిపించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రానికి పూజాను కథానాయికగా ఖరారు చేసినట్లు సమాచారం. నితిన్ సొంత బేనర్ శ్రేష్ఠ్ మూవీస్లో ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే పూర్తి వివరాలు బయటికి రానున్నాయి. పూజా ఒకప్పటి రేంజ్తో పోలిస్తే నితిన్ సరసన నటించడం కొంచెం తక్కువే అనిపించినా.. ఆమెకు అసలు అవకాశాలే లేని స్థితిలో ఈ మాత్రం ఛాన్స్ రావడం గొప్పే.
This post was last modified on August 9, 2025 2:39 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…