టాలీవుడ్లో ప్రస్తుతం నంబర్ వన్ కమెడియన్ అంటే వెన్నెల కిషోర్ పేరే చెప్పాలి. దశాబ్దాల పాటు హవా సాగించిన లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం గత కొన్నేళ్లలో డౌన్ అయ్యారు. ఆయన ప్రైమ్లో ఉండగానే కమెడియన్గా రైజ్ అయిన కిషోర్.. తర్వాత అవకాశాల్లో బ్రహ్మిని దాటేసి ముందుకు వెళ్లిపోయాడు. ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గ టైమింగ్తో నవ్వించడంలో కిషోర్ దిట్ట. టాలీవుడ్ చరిత్రలోనే బెస్ట్ కమెడియన్లలో అతడి పేరు ఉంటుందనడంలో సందేహం లేదు. ఐతే కామెడీలో ఇంతగా ఆరితేరిన కిషోర్.. అసలు నటనలోకే రావాలనుకోలేదట. అతడి లక్ష్యం దర్శకుడు కావడం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా తీయడమేనట.
తన తొలి చిత్రం వెన్నెలలో ఖాదర్ అనే కామెడీ పాత్ర పోషించడం అనుకోకుండా జరిగిందట. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు దేవా కట్టా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
వెన్నెల సినిమాను చాలా వరకు అమెరికాలోనే చిత్రీకరించిన సంగతి తెలిసిందే. కిషోర్ దేవా కట్టాకు స్నేహితుడు కాగా.. ఈ సినిమాకు అసిస్టెంట్గా పని చేసి మేకింగ్లో సాయం చేయడానికి అతను వచ్చాడట. దర్శకుడిగా మారి పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలని లక్ష్యంగా పెట్టుకున్న కిషోర్.. అనుభవం కోసమే ఈ సినిమాకు పని చేశాడట.
తన చిత్రానికి బడ్జెట్ తక్కువ కావడంతో ఉచితంగా పని చేసేవాళ్లు అవసరం అన్న ఉద్దేశంతో కిషోర్ను తీసుకున్నాడట దేవా. ఐతే వీసా సమస్య వల్ల ఖాదర్ పాత్ర చేయాల్సిన శివారెడ్డి అమెరికాకు రాలేకపోవడంతో ఇబ్బంది తలెత్తినట్లు దేవా చెప్పాడు. ఖాదర్ చాలా ముఖ్యమైన పాత్ర కావడంతో ఆ క్యారెక్టర్ చేయాల్సిన నటుడు రాకుంటే సినిమానే సగం చచ్చిపోయే పరిస్థితి వచ్చిందని.. ఆ పరిస్థితుల్లో కిషోర్తో ఆ పాత్ర చేయించామని దేవా తెలిపాడు. ఐతే ముందు అందుకు కిషోర్ ఒప్పుకోలేదని.. డైరెక్షనే తన లక్ష్యమని చెప్పాడని.. కానీ ఈ సినిమా చేస్తే ఇండస్ట్రీలోకి వెళ్లేందుకు మార్గం దొరుకుతుందని ఒప్పించి ఆ పాత్రను కిషోర్తో చేయించినట్లు దేవా వెల్లడించాడు.
This post was last modified on August 9, 2025 7:04 am
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…