టాలీవుడ్లో ప్రస్తుతం నంబర్ వన్ కమెడియన్ అంటే వెన్నెల కిషోర్ పేరే చెప్పాలి. దశాబ్దాల పాటు హవా సాగించిన లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం గత కొన్నేళ్లలో డౌన్ అయ్యారు. ఆయన ప్రైమ్లో ఉండగానే కమెడియన్గా రైజ్ అయిన కిషోర్.. తర్వాత అవకాశాల్లో బ్రహ్మిని దాటేసి ముందుకు వెళ్లిపోయాడు. ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గ టైమింగ్తో నవ్వించడంలో కిషోర్ దిట్ట. టాలీవుడ్ చరిత్రలోనే బెస్ట్ కమెడియన్లలో అతడి పేరు ఉంటుందనడంలో సందేహం లేదు. ఐతే కామెడీలో ఇంతగా ఆరితేరిన కిషోర్.. అసలు నటనలోకే రావాలనుకోలేదట. అతడి లక్ష్యం దర్శకుడు కావడం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా తీయడమేనట.
తన తొలి చిత్రం వెన్నెలలో ఖాదర్ అనే కామెడీ పాత్ర పోషించడం అనుకోకుండా జరిగిందట. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు దేవా కట్టా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
వెన్నెల సినిమాను చాలా వరకు అమెరికాలోనే చిత్రీకరించిన సంగతి తెలిసిందే. కిషోర్ దేవా కట్టాకు స్నేహితుడు కాగా.. ఈ సినిమాకు అసిస్టెంట్గా పని చేసి మేకింగ్లో సాయం చేయడానికి అతను వచ్చాడట. దర్శకుడిగా మారి పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలని లక్ష్యంగా పెట్టుకున్న కిషోర్.. అనుభవం కోసమే ఈ సినిమాకు పని చేశాడట.
తన చిత్రానికి బడ్జెట్ తక్కువ కావడంతో ఉచితంగా పని చేసేవాళ్లు అవసరం అన్న ఉద్దేశంతో కిషోర్ను తీసుకున్నాడట దేవా. ఐతే వీసా సమస్య వల్ల ఖాదర్ పాత్ర చేయాల్సిన శివారెడ్డి అమెరికాకు రాలేకపోవడంతో ఇబ్బంది తలెత్తినట్లు దేవా చెప్పాడు. ఖాదర్ చాలా ముఖ్యమైన పాత్ర కావడంతో ఆ క్యారెక్టర్ చేయాల్సిన నటుడు రాకుంటే సినిమానే సగం చచ్చిపోయే పరిస్థితి వచ్చిందని.. ఆ పరిస్థితుల్లో కిషోర్తో ఆ పాత్ర చేయించామని దేవా తెలిపాడు. ఐతే ముందు అందుకు కిషోర్ ఒప్పుకోలేదని.. డైరెక్షనే తన లక్ష్యమని చెప్పాడని.. కానీ ఈ సినిమా చేస్తే ఇండస్ట్రీలోకి వెళ్లేందుకు మార్గం దొరుకుతుందని ఒప్పించి ఆ పాత్రను కిషోర్తో చేయించినట్లు దేవా వెల్లడించాడు.
This post was last modified on August 9, 2025 7:04 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…