టాలీవుడ్లో ప్రస్తుతం నంబర్ వన్ కమెడియన్ అంటే వెన్నెల కిషోర్ పేరే చెప్పాలి. దశాబ్దాల పాటు హవా సాగించిన లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం గత కొన్నేళ్లలో డౌన్ అయ్యారు. ఆయన ప్రైమ్లో ఉండగానే కమెడియన్గా రైజ్ అయిన కిషోర్.. తర్వాత అవకాశాల్లో బ్రహ్మిని దాటేసి ముందుకు వెళ్లిపోయాడు. ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గ టైమింగ్తో నవ్వించడంలో కిషోర్ దిట్ట. టాలీవుడ్ చరిత్రలోనే బెస్ట్ కమెడియన్లలో అతడి పేరు ఉంటుందనడంలో సందేహం లేదు. ఐతే కామెడీలో ఇంతగా ఆరితేరిన కిషోర్.. అసలు నటనలోకే రావాలనుకోలేదట. అతడి లక్ష్యం దర్శకుడు కావడం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా తీయడమేనట.
తన తొలి చిత్రం వెన్నెలలో ఖాదర్ అనే కామెడీ పాత్ర పోషించడం అనుకోకుండా జరిగిందట. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు దేవా కట్టా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
వెన్నెల సినిమాను చాలా వరకు అమెరికాలోనే చిత్రీకరించిన సంగతి తెలిసిందే. కిషోర్ దేవా కట్టాకు స్నేహితుడు కాగా.. ఈ సినిమాకు అసిస్టెంట్గా పని చేసి మేకింగ్లో సాయం చేయడానికి అతను వచ్చాడట. దర్శకుడిగా మారి పవన్ కళ్యాణ్తో సినిమా తీయాలని లక్ష్యంగా పెట్టుకున్న కిషోర్.. అనుభవం కోసమే ఈ సినిమాకు పని చేశాడట.
తన చిత్రానికి బడ్జెట్ తక్కువ కావడంతో ఉచితంగా పని చేసేవాళ్లు అవసరం అన్న ఉద్దేశంతో కిషోర్ను తీసుకున్నాడట దేవా. ఐతే వీసా సమస్య వల్ల ఖాదర్ పాత్ర చేయాల్సిన శివారెడ్డి అమెరికాకు రాలేకపోవడంతో ఇబ్బంది తలెత్తినట్లు దేవా చెప్పాడు. ఖాదర్ చాలా ముఖ్యమైన పాత్ర కావడంతో ఆ క్యారెక్టర్ చేయాల్సిన నటుడు రాకుంటే సినిమానే సగం చచ్చిపోయే పరిస్థితి వచ్చిందని.. ఆ పరిస్థితుల్లో కిషోర్తో ఆ పాత్ర చేయించామని దేవా తెలిపాడు. ఐతే ముందు అందుకు కిషోర్ ఒప్పుకోలేదని.. డైరెక్షనే తన లక్ష్యమని చెప్పాడని.. కానీ ఈ సినిమా చేస్తే ఇండస్ట్రీలోకి వెళ్లేందుకు మార్గం దొరుకుతుందని ఒప్పించి ఆ పాత్రను కిషోర్తో చేయించినట్లు దేవా వెల్లడించాడు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…