Movie News

పీపుల్స్ నిర్మాత చెప్పిన నోబుల్ నిజాలు

ఇండస్ట్రీలో దోపిడీ వ్యవస్థ లేదంటే అంతకంటే కామెడీ మరొకటి ఉండదేమో. చాప కింద నీరులా నిర్మాతలను పీల్చేస్తున్న వ్యవస్థలో బయటికి కనిపించకుండా బలవుతున్న వారు ఎందరో. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఈ విషయంలో తన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ మధ్య వేతనాలకు సంబంధించి వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆయన చెబుతున్న కొన్ని విషయాలు షాకింగ్ గా ఉన్నాయి. ఇంత టాప్ ప్రొడ్యూసర్ అయ్యుండి, రాజా సాబ్ – మిరాయ్ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ చేతిలో పెట్టుకుని కూడా వెతలు పడాల్సి వస్తోందంటే దానికి కారణం ఎవరు.

మా ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కొన్ని సీరియస్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేశారు. ఉదాహరణకు విఎఫెక్స్ సూపర్ వైజింగ్ ఎంత దారుణంగా తయారయ్యిందో ఆయన నిర్మించిన రెండు సినిమాలను ఎగ్జాంపుల్స్ గా చెప్పారు. కార్తికేయ 2, బ్రోకు ఆశించిన స్థాయిలో తమకు విజువల్ ఎఫెక్ట్స్ డెలివరీ కాలేదని, దానికి టెర్రరిస్టు లాంటి అంతర్గత మాఫియాలే కారణమని, నేను పెట్టిన ఖర్చు తగ్గ క్వాలిటీ ఇవ్వకపోవడం వల్ల ఆ రెండు చిత్రాల అవుట్ ఫుట్ నాణ్యత తగ్గిందని చెప్పారు. కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ అయినప్పటికీ కొన్ని బ్లాక్స్ కు సంబంధించి సిజి ఇంకా బెటర్ గా ఉండాల్సిందని ఒప్పుకున్నారు.

కన్నప్ప టైంలోనూ మంచు విష్ణు ఇదే పాయింట్ మీద తన అసంతృప్తిని వ్యక్తం చేయడం గుర్తు చేసుకోవాలి. విఎఫ్ఎక్స్ సూపర్ వైజ్ చేసే బాధ్యతను ఒక తప్పుడు వ్యక్తికి ఇవ్వడం వల్ల అనుకున్న టైంని ఫైనల్ కాపీ సిద్ధం చేసుకోలేకపోయామని, అందుకే ఆ పని వేరేవాళ్లకు అప్పగించి రిలీజ్ చేయడానికి ఎక్కువ టైం పట్టిందని అన్నారు. ఇప్పుడు టిజి విశ్వప్రసాద్ ఇదే టాపిక్ మీద కంప్లైంట్ చేయడం గమనార్హం. ఈ మధ్య పెద్ద హీరోల ప్యాన్ ఇండియా సినిమాలు సైతం విఎఫ్ఎక్స్ పరంగా దారుణమైన ఫలితాలు అందుకుంటున్నాయి. దీన్ని బట్టే ఇదెంత ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన విభాగమో అర్థమవుతుంది.

This post was last modified on August 7, 2025 6:31 pm

Share

Recent Posts

100 కోట్లు రాలేదంటే ఏమనుకోవాలి

నిన్న విడుదలైన జన నాయకుడుకి ఎలాంటి టాక్ వచ్చిందో తెలిసిందే. విజయ్ కున్న క్రేజ్ దృష్యా తమిళనాడులో ఎగబడి చూస్తున్నారు…

6 minutes ago

`మేకిన్` ఇండియా అడిగితే.. `లీకిన్` ఇండియా ఇచ్చారు

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ త‌న‌దైన శైలిలో సెటైర్లు వేశారు. దేశ ప్ర‌జ‌లు మేకిన్…

1 hour ago

మ‌న్యానికి కుంకీల‌ను పంపిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌

పార్వ‌తీపురం మ‌న్యం జిల్లాలోని రైతులు గ‌త కొన్ని రోజులుగా ఏనుగుల బెడ‌ద‌ను ఎదుర్కొంటున్నారు. స్థానిక గ్రామాల్లోకి ఏనుగులు చొర‌బ‌డి ప్ర‌జ‌ల‌ను…

2 hours ago

స్థానికంపై జగన్ సీరియస్ గానే ఉన్నారా?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో కీలక ఎన్నికలకు తెర లేవనుంది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే దిశగా కూటమి సర్కారు ప్రణాళికలు…

3 hours ago

ముగ్గురు యువతుల ముద్దుల వరుడు

ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు.. ఈ కాన్సెప్ట్ తో తెలుగులో ఎన్నో సినిమాలు వచ్చాయి. వినడానికి, చూడడానికి సరదాగానే ఉంటుంది.…

4 hours ago

రామ రామా… ఇంకెన్ని బ్రేకులు స్వామీ

నాలుగు వేల కోట్లతో తీశామని గొప్పగా చెప్పుకున్న ప్యాన్ ఇండియా మూవీ రామాయణ ప్రమోషన్ల పరంగా వేస్తున్న అడుగులు ఎటెటో…

4 hours ago