ఇండస్ట్రీలో దోపిడీ వ్యవస్థ లేదంటే అంతకంటే కామెడీ మరొకటి ఉండదేమో. చాప కింద నీరులా నిర్మాతలను పీల్చేస్తున్న వ్యవస్థలో బయటికి కనిపించకుండా బలవుతున్న వారు ఎందరో. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఈ విషయంలో తన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ మధ్య వేతనాలకు సంబంధించి వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆయన చెబుతున్న కొన్ని విషయాలు షాకింగ్ గా ఉన్నాయి. ఇంత టాప్ ప్రొడ్యూసర్ అయ్యుండి, రాజా సాబ్ – మిరాయ్ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ చేతిలో పెట్టుకుని కూడా వెతలు పడాల్సి వస్తోందంటే దానికి కారణం ఎవరు.
మా ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కొన్ని సీరియస్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేశారు. ఉదాహరణకు విఎఫెక్స్ సూపర్ వైజింగ్ ఎంత దారుణంగా తయారయ్యిందో ఆయన నిర్మించిన రెండు సినిమాలను ఎగ్జాంపుల్స్ గా చెప్పారు. కార్తికేయ 2, బ్రోకు ఆశించిన స్థాయిలో తమకు విజువల్ ఎఫెక్ట్స్ డెలివరీ కాలేదని, దానికి టెర్రరిస్టు లాంటి అంతర్గత మాఫియాలే కారణమని, నేను పెట్టిన ఖర్చు తగ్గ క్వాలిటీ ఇవ్వకపోవడం వల్ల ఆ రెండు చిత్రాల అవుట్ ఫుట్ నాణ్యత తగ్గిందని చెప్పారు. కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ అయినప్పటికీ కొన్ని బ్లాక్స్ కు సంబంధించి సిజి ఇంకా బెటర్ గా ఉండాల్సిందని ఒప్పుకున్నారు.
కన్నప్ప టైంలోనూ మంచు విష్ణు ఇదే పాయింట్ మీద తన అసంతృప్తిని వ్యక్తం చేయడం గుర్తు చేసుకోవాలి. విఎఫ్ఎక్స్ సూపర్ వైజ్ చేసే బాధ్యతను ఒక తప్పుడు వ్యక్తికి ఇవ్వడం వల్ల అనుకున్న టైంని ఫైనల్ కాపీ సిద్ధం చేసుకోలేకపోయామని, అందుకే ఆ పని వేరేవాళ్లకు అప్పగించి రిలీజ్ చేయడానికి ఎక్కువ టైం పట్టిందని అన్నారు. ఇప్పుడు టిజి విశ్వప్రసాద్ ఇదే టాపిక్ మీద కంప్లైంట్ చేయడం గమనార్హం. ఈ మధ్య పెద్ద హీరోల ప్యాన్ ఇండియా సినిమాలు సైతం విఎఫ్ఎక్స్ పరంగా దారుణమైన ఫలితాలు అందుకుంటున్నాయి. దీన్ని బట్టే ఇదెంత ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన విభాగమో అర్థమవుతుంది.
This post was last modified on August 7, 2025 6:31 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…