Movie News

పీపుల్స్ నిర్మాత చెప్పిన నోబుల్ నిజాలు

ఇండస్ట్రీలో దోపిడీ వ్యవస్థ లేదంటే అంతకంటే కామెడీ మరొకటి ఉండదేమో. చాప కింద నీరులా నిర్మాతలను పీల్చేస్తున్న వ్యవస్థలో బయటికి కనిపించకుండా బలవుతున్న వారు ఎందరో. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వప్రసాద్ ఈ విషయంలో తన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ మధ్య వేతనాలకు సంబంధించి వివాదం నెలకొన్న నేపథ్యంలో ఆయన చెబుతున్న కొన్ని విషయాలు షాకింగ్ గా ఉన్నాయి. ఇంత టాప్ ప్రొడ్యూసర్ అయ్యుండి, రాజా సాబ్ – మిరాయ్ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ చేతిలో పెట్టుకుని కూడా వెతలు పడాల్సి వస్తోందంటే దానికి కారణం ఎవరు.

మా ప్రతినిధికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన కొన్ని సీరియస్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేశారు. ఉదాహరణకు విఎఫెక్స్ సూపర్ వైజింగ్ ఎంత దారుణంగా తయారయ్యిందో ఆయన నిర్మించిన రెండు సినిమాలను ఎగ్జాంపుల్స్ గా చెప్పారు. కార్తికేయ 2, బ్రోకు ఆశించిన స్థాయిలో తమకు విజువల్ ఎఫెక్ట్స్ డెలివరీ కాలేదని, దానికి టెర్రరిస్టు లాంటి అంతర్గత మాఫియాలే కారణమని, నేను పెట్టిన ఖర్చు తగ్గ క్వాలిటీ ఇవ్వకపోవడం వల్ల ఆ రెండు చిత్రాల అవుట్ ఫుట్ నాణ్యత తగ్గిందని చెప్పారు. కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ అయినప్పటికీ కొన్ని బ్లాక్స్ కు సంబంధించి సిజి ఇంకా బెటర్ గా ఉండాల్సిందని ఒప్పుకున్నారు.

కన్నప్ప టైంలోనూ మంచు విష్ణు ఇదే పాయింట్ మీద తన అసంతృప్తిని వ్యక్తం చేయడం గుర్తు చేసుకోవాలి. విఎఫ్ఎక్స్ సూపర్ వైజ్ చేసే బాధ్యతను ఒక తప్పుడు వ్యక్తికి ఇవ్వడం వల్ల అనుకున్న టైంని ఫైనల్ కాపీ సిద్ధం చేసుకోలేకపోయామని, అందుకే ఆ పని వేరేవాళ్లకు అప్పగించి రిలీజ్ చేయడానికి ఎక్కువ టైం పట్టిందని అన్నారు. ఇప్పుడు టిజి విశ్వప్రసాద్ ఇదే టాపిక్ మీద కంప్లైంట్ చేయడం గమనార్హం. ఈ మధ్య పెద్ద హీరోల ప్యాన్ ఇండియా సినిమాలు సైతం విఎఫ్ఎక్స్ పరంగా దారుణమైన ఫలితాలు అందుకుంటున్నాయి. దీన్ని బట్టే ఇదెంత ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన విభాగమో అర్థమవుతుంది.

This post was last modified on August 7, 2025 6:31 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

7 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

8 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

8 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

10 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

11 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

12 hours ago