Movie News

కూలీని టెన్షన్ పెడుతున్న ‘నో కిడ్స్’ నిబంధన

సెన్సారు బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ తీసుకోవడం కూలీకి పెద్ద చేటు చేసేలా ఉంది. పివిఆర్ లైనక్స్, ఏజిఎస్ లాంటి మల్టీప్లెక్సులు 18 ఏళ్ళ లోపు పిల్లల్ని ఈ సినిమాకు తీసుకు రావొద్దంటూ ప్రత్యేక ప్రకటనలు ఇవ్వడం రజని ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. ఏజ్ ప్రూఫ్ లేకుండా అనుమతించడం సాధ్యం కాదని పేర్కొనడంతో టీనేజ్ అభిమానులు తల్లడిల్లిపోతున్నారు. నిజానికి ఈ నిబంధన సింగల్ స్క్రీన్లకు కూడా వర్తిస్తుంది. కానీ వాటి యాజమాన్యాలు అంతగా పట్టించుకోవు. టికెట్లు తెగితే చాలని చిన్నా పెద్ద లేకుండా అందరిని పంపిస్తారు. కానీ చాలా మల్టీప్లెక్సులు ఈ కండీషన్ కఠినంగా పాటిస్తాయి. అసలు సమస్య ఇది కాదు.

రజనీకాంత్ అంటేనే వయసుతో సంబంధం లేకుండా అందరూ చూడాలని ఎగబడతారు. వాళ్ళను కంట్రోల్ చేయడం కష్టం. గతంలో సలార్ కు ఓ హైదరాబాద్ మల్టీప్లెక్సులో చిన్న పిల్లాడిని అనుమతించపోతే తల్లి అక్కడి సిబ్బందితో గొడవ పడిన వీడియో వైరల్ అయ్యింది. ఇప్పుడు కూలికి కూడా అలాంటి సీన్లు చూడబోతున్నాం. కూలికి ఇది అడ్డంకిగా మారి వార్ 2కి మేలు చేస్తుందేమోననే అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే వార్ 2లో కూడా వయొలెన్స్ ఉన్నప్పటికీ దానికి యు/ఏ దక్కింది. కాబట్టి ఏజ్ తో సంబంధం లేకుండా ఎవరైనా చూడొచ్చు. కాకపోతే పెద్ద పర్యవేక్షణ ఉండాలి అంతే.

ఓపెనింగ్స్, ఫైనల్ రన్ రికార్డులు మీద భారీగా ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ కు ఇప్పుడీ ఏ సర్టిఫికెట్ సమస్యగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పివిఆర్ ఐనాక్స్ దేశవ్యాప్తంగా దీన్ని అమలు చేయబోతోంది. గతంలో ఎన్నో ఏ రేటెడ్ సినిమాలకు ఇవ్వని ప్రకటన ఇప్పుడు కూలికి ఎందుకు ఇస్తున్నారంటే కారణం సింపుల్. తండోప తండాలుగా వచ్చే ఆడియన్స్ మధ్యలో చిన్న పిలల్లను వెనక్కు పంపడం పెద్ద తలనొప్పి. అదేదో ముందే చెప్పేస్తే ఏ గొడవా ఉండదని ఇలా అనౌన్స్ మెంట్ ఇస్తున్నారు. సో 18 ఇయర్స్ బిలో ఎవరైనా సరే కూలి కోసం సింగల్ స్క్రీన్లు వెతుక్కోవడం తప్ప వేరే మార్గం లేదు.

This post was last modified on August 7, 2025 1:11 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Coolie

Recent Posts

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

7 minutes ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

10 minutes ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

1 hour ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

2 hours ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

5 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

5 hours ago