గోట్ లైఫ్ ఆడు జీవితంలో అద్భుతంగా నటించిన పృథ్విరాజ్ సుకుమారన్ కు కాకుండా జవాన్ లాంటి కమర్షియల్ మూవీలో చేసిన షారుఖ్ ఖాన్ కు జాతీయ అవార్డు ఇవ్వడం పట్ల సర్వత్రా విమర్శలు రేగుతున్నాయి. కేవలం వివక్షతోనే ఇలా చేశారని ఊర్వశి లాంటి సీనియర్ నటీమణులు ఓపెన్ గా కామెంట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా జ్యురి చైర్మన్ అశుతోష్ గోవారికర్ చేసిన కామెంట్లు అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యాయి. గోట్ లైఫ్ లో తమకు సహజత్వం కనిపించలేదని, టెక్నికల్ గా వీక్ గా ఉందని, అందువల్లే నేషనల్ అవార్డు ఇవ్వలేకపోయామని చెప్పడం మూవీ లవర్స్ ఆగ్రహానికి కారణమయ్యింది.
నిజానికి దీని వెనుక పలు కోణాలున్నాయి. లగాన్ తర్వాత ఇదే అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించిన స్వదేస్ లో షారుఖ్ ఖాన్ నటనకు గాను అప్పట్లో జాతీయ అవార్డు వస్తుందని అందరూ భావించారు. కానీ అది జరగలేదు. దీని మీద పత్రికల్లో డిబేట్ కూడా నడిచింది. స్వదేస్ కాదని మధుర్ బండార్కర్ తీసిన పేజ్ 3కి ఇవ్వడం పట్ల కొంత వివాదమూ నడిచింది. సరిగ్గా అదే తరహాలో అలాంటి కాంట్రావర్సికి అశుతోష్ తెరలేపారు. ఇప్పటికే మూడు దశాబ్దాల నట జీవితం పూర్తి చేసుకున్న షారుఖ్ కు మళ్ళీ ఛాన్స్ వస్తుందో లేదో అనే తరహాలో కావాలని ఇచ్చినట్టు సోషల్ మీడియాలో తీవ్రమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి.
జ్యురి సభ్యుడు ప్రదీప్ నాయర్ తమ చర్యను సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. సాంకేతిక కారణాలతో పాటు పాటలకు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఇవ్వకపోవడం వల్లే అర్హత తగ్గిందని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా గోట్ సహజంగా లేదని చెప్పడం పెద్ద జోక్. ఈ వ్యవహారం మీద గోట్ దర్శకుడు బ్లేస్సి స్పందించాడు. ముంబైలో తమ సినిమా ప్రీమియర్ చూసి అశుతోష్ గోవారికర్ హాలీవుడ్ మూవీ లారెన్స్ అఫ్ అరేబియాతో పోల్చి, తమ టీమ్ ని లంచ్ కి పిలిచాడని, ఇప్పుడు అదే వ్యక్తి ఇలా యు టర్న్ తీసుకుని గోట్ ని తక్కువ చేసి మాట్లాడ్డం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చూస్తుంటే ఈ డిబేట్ అంత సులభంగా ముగిసేలా లేదు.
This post was last modified on August 5, 2025 5:01 pm
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…
కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…
వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా…
తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించారు. దీనికి ప్రస్తుత మంత్రి నారా…