సుషాంత్ సింగ్ రాజ్పుట్ మరణించడంలో రియా చక్రవర్తి పాత్ర ఏమిటనేది ఎవరికీ తెలియదు. దానిపై మీడియా పలు రకాల కథనాలు ప్రచారం చేసింది. దానికి ఆజ్యం పోస్తూ సుషాంత్ కుటుంబం ఆమెను దోషిగా చూపించింది. అయితే ఆమెకు సిబిఐ ఎంక్వయిరీలో ఈ విషయంపై క్లీన్ చిట్ లభించింది. అయినప్పటికీ రియాను దోషిగా భావిస్తోన్న వారు చాలా మందే వున్నారు.
సుషాంత్ మరణవార్త ఇప్పుడు మరుగున పడిపోయినా కానీ ఆ మరక పూర్తిగా చెరిపేసుకుని రియా మునుపటిలా తన కెరియర్ కొనసాగించడం అంత సులభం కాదు. సినిమాల సంగతి అటుంచి కనీసం సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టాలన్నా కూడా ట్రోలింగ్కి భయపడాలి. సోషల్ మీడియా ట్రోలింగ్కి మహామహులే అకౌంట్లు డిలీట్ చేసుకుని వెళ్లిపోయిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తితో సినిమా తీయడానికి ఎవరు సాహసిస్తారు.
ఇప్పుడు తనకు అవకాశం ఇచ్చిన ఏ పెద్ద నిర్మాణ సంస్థకు అయినా సుషాంత్ మరణంలో వారి పాత్ర కూడా వుందనే అపవాదులు తప్పవు. అందుకే తనతో సినిమా తీసేందుకు ఏ బడా సంస్థ ధైర్యం చేయకపోవచ్చు. ఆమె తమ సినిమాలో వుంటే ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని భావించే చిన్న నిర్మాతలు ఈ స్థాయి ట్రోలింగ్ను తట్టుకుని సినిమాను విడుదల చేస్తారనే నమ్మకం లేదు. ఈ ఫ్యాక్టర్ వల్ల రియా చక్రవర్తికి ఓటిటి నుంచి కూడా అవకాశాలు రాకపోవచ్చు.
This post was last modified on November 19, 2020 5:17 pm
వేటూరి, సిరివెన్నెల లాంటి దిగ్గజ గేయ రచయితలు వెళ్ళిపోయాక తెలుగు సినీ పాటల స్థాయి తగ్గిపోయిందని సాహితీ అభిమానులు బాధ…
నెలలో ఒక్కరోజు గ్రామీణ ప్రాంతాలకు రావాలని.. ఇక్కడి వారికి వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్…
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…