సుషాంత్ సింగ్ రాజ్పుట్ మరణించడంలో రియా చక్రవర్తి పాత్ర ఏమిటనేది ఎవరికీ తెలియదు. దానిపై మీడియా పలు రకాల కథనాలు ప్రచారం చేసింది. దానికి ఆజ్యం పోస్తూ సుషాంత్ కుటుంబం ఆమెను దోషిగా చూపించింది. అయితే ఆమెకు సిబిఐ ఎంక్వయిరీలో ఈ విషయంపై క్లీన్ చిట్ లభించింది. అయినప్పటికీ రియాను దోషిగా భావిస్తోన్న వారు చాలా మందే వున్నారు.
సుషాంత్ మరణవార్త ఇప్పుడు మరుగున పడిపోయినా కానీ ఆ మరక పూర్తిగా చెరిపేసుకుని రియా మునుపటిలా తన కెరియర్ కొనసాగించడం అంత సులభం కాదు. సినిమాల సంగతి అటుంచి కనీసం సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టాలన్నా కూడా ట్రోలింగ్కి భయపడాలి. సోషల్ మీడియా ట్రోలింగ్కి మహామహులే అకౌంట్లు డిలీట్ చేసుకుని వెళ్లిపోయిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తితో సినిమా తీయడానికి ఎవరు సాహసిస్తారు.
ఇప్పుడు తనకు అవకాశం ఇచ్చిన ఏ పెద్ద నిర్మాణ సంస్థకు అయినా సుషాంత్ మరణంలో వారి పాత్ర కూడా వుందనే అపవాదులు తప్పవు. అందుకే తనతో సినిమా తీసేందుకు ఏ బడా సంస్థ ధైర్యం చేయకపోవచ్చు. ఆమె తమ సినిమాలో వుంటే ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని భావించే చిన్న నిర్మాతలు ఈ స్థాయి ట్రోలింగ్ను తట్టుకుని సినిమాను విడుదల చేస్తారనే నమ్మకం లేదు. ఈ ఫ్యాక్టర్ వల్ల రియా చక్రవర్తికి ఓటిటి నుంచి కూడా అవకాశాలు రాకపోవచ్చు.
This post was last modified on November 19, 2020 5:17 pm
వైసీపీలో నాయకులు బయటకు రావడం లేదు. ఎన్నికలు పూర్తయి ఏడాది అయినా పెద్దగా ఎవరూ ముందుకు రావడం లేదు. నోరు…
వైైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయన కన్న తల్లి విజయమ్మ నుంచే భారీ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం పనిచేస్తోందని ఆరోపించిన కొన్ని గంటల వ్యవధిలోనే టీడీపీ యువనాయకుడు,…
సౌత్ దర్శకుల్లో రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్ తర్వాత అంతకన్నా తక్కువో ఎక్కువో స్టార్ డం తెచ్చుకున్న వాళ్లలో లోకేష్ కనగరాజ్…
ఇటీవలే జరిగిన ఒక ఈవెంట్ లో అమీర్ ఖాన్ మాట్లాడుతూ థియేటర్ ఓటిటి మధ్య ఇప్పుడున్న గ్యాప్ సరిపోదని నాలుగు…
రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల ఇంచార్జ్లను మార్చనున్నట్లు వైసీపీ అధినేత జగన్ చెప్పారు. అయితే దీనికి కొంత సమయం పడుతుందన్నారు.…